భారతదేశంలోని ప్రముఖ టెక్ సంస్థల్లో ఒకటైన విప్రో తన హైబ్రిడ్ వర్క్ విధానాన్ని మరింత కఠినతరం చేసింది. ఉద్యోగులు ఇకపై వారానికి కనీసం మూడు రోజులు కార్యాలయానికి హాజరవ్వాలని.. ఆ రోజుల్లో కనీసం ఆరు గంటలు ఆఫీసులోనే పని చేయడం తప్పనిసరి చేస్తూ కొత్త నిబంధనలను అమలు చేసింది. ఈ విధానం జనవరి 1 నుంచి అధికారికంగా అమల్లోకి వచ్చింది. ఇంతకుముందు ఉన్న సడలింపులతో కూడిన వర్క్-ఫ్రమ్-ఆఫీస్ విధానానికి ఇది భిన్నంగా ఉండడం గమనార్హం.
బెంగళూరు కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్న విప్రోలో ప్రస్తుతం సుమారు 2.34 లక్షల మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. గత కొంతకాలంగా వారానికి మూడు రోజులు ఆఫీసు హాజరు కొనసాగుతున్నప్పటికీ.. ఇప్పుడు ఇన్-అవుట్ పంచ్ల మధ్య తప్పనిసరిగా ఆరు గంటల కార్యాలయంలో ఉండాలనే నిబంధనను యాడ్ చేశారు. ఇది భారతదేశంలో విప్రో అమలు చేస్తున్న హైబ్రిడ్ వర్క్ పాలసీలో ఒక కీలక మార్పుగా భావిస్తున్నారు.

ఈ కొత్త విధానం ఉద్యోగుల సెలవుల బ్యాలెన్స్పై నేరుగా ప్రభావం చూపుతోంది. ఆఫీసులో నిర్ణయించిన సమయం పూర్తి చేయని ఉద్యోగుల సెలవుల ఖాతా నుంచి రోజులు తగ్గించబడుతున్నాయని పలువురు ఉద్యోగులు తెలిపారు. ముఖ్యంగా ఒక రోజు ఆఫీసులో ఆరు గంటల కంటే తక్కువ సమయం గడిపితే.. సగం రోజు సెలవు కోత విధిస్తున్నట్లు సమాచారం. దీంతో ఉద్యోగుల్లో కొంత ఆందోళన కూడా వ్యక్తమవుతోంది.
అదేవిధంగా, విప్రో అందిస్తున్న తాత్కాలిక రిమోట్ వర్క్ సౌకర్యాన్ని కూడా తగ్గించింది. గతంలో క్యాలెండర్ సంవత్సరానికి 15 రోజుల వరకు ఇంటి నుంచి పని చేసే అవకాశం ఉండగా, ఇప్పుడు దాన్ని 12 రోజులకు పరిమితం చేసింది. ఈ రిమోట్ వర్క్ రోజులను వ్యక్తిగత సంరక్షణ, అనారోగ్యం లేదా కుటుంబ సంరక్షణ వంటి అవసరాల కోసం మాత్రమే వినియోగించుకోవాలని సంస్థ స్పష్టం చేసింది.
ఉద్యోగులకు Wipro పంపిన అంతర్గత ఇమెయిల్లో.. హైబ్రిడ్ వర్కింగ్ భవిష్యత్తు అనేది పనితీరులో కీలక భాగంగా కొనసాగుతుందని విప్రో పేర్కొంది. కార్యాలయంలో భౌతికంగా కలిసి పనిచేయడం వల్ల జట్ల మధ్య సహకారం పెరుగుతుందని, అదే సమయంలో అవసరమైన అవసరాలకు అనుగుణంగా పని చేసే స్వేచ్ఛ కూడా లభిస్తుందని సంస్థ అభిప్రాయపడింది. అయితే, ఆఫీసులో ఉండాల్సిన ఆరు గంటలు మొత్తం పని గంటలు కాదని.. రోజువారీ పని సమయం ఇప్పటికీ 9.5 గంటలేనని ఆ ఇమెయిల్ స్పష్టం చేసింది. మిగిలిన పని గంటలను ఉద్యోగులు అదే రోజు ఇంటి నుంచే పూర్తి చేయవచ్చని తెలిపింది.
ఈ విధాన మార్పులు భారత ఐటీ రంగం ఎదుర్కొంటున్న మందగమనం నేపథ్యంలోని నిర్ణయాలుగా పరిశ్రమ నిపుణులు విశ్లేషిస్తున్నారు. కృత్రిమ మేధస్సు (AI) వేగంగా విస్తరిస్తున్న తరుణంలో, ప్రాజెక్టుల డెలివరీ సమయాలు తగ్గిపోయాయని, జట్ల మధ్య వేగవంతమైన సమన్వయం అవసరమైందని వారు చెబుతున్నారు. గతంలో సాఫ్ట్వేర్ అప్లికేషన్లను కొన్ని సంవత్సరాలకు ఒకసారి విడుదల చేసేవారు, కానీ ఇప్పుడు కొన్ని వారాల్లోనే విడుదల చేస్తున్న పరిస్థితి నెలకొంది. ఈ మార్పులు రిమోట్ వర్క్ కన్నా ఆఫీసు ఆధారిత సహకారాన్ని కీలకంగా మారుస్తున్నాయి. కాగా ఇప్పటికే టీసీఎస్, ఇన్ఫోసిస్ వంటి ఇతర దిగ్గజ ఐటీ సంస్థలు కూడా ఇప్పటికే కఠినమైన రిటర్న్-టు-ఆఫీస్ విధానాలను అమలు చేస్తున్నాయి.
More From GoodReturns

రూ. 6 వేల కోట్లకు చేరిన సుందర్ పిచాయ్ జీతం..గూగుల్ తాజాగా వేతన ప్యాకేజీ ఎంత పెంచిందంటే..

30 వేల మంది ఉద్యోగుల తొలగింపు అంతా ఫేక్.. లేఆప్స్పై క్లారిటీ ఇచ్చిన టెక్ మహీంద్రా..

ఇరాన్ వార్ దెబ్బకు వణుకుతున్న భారత ఐటీ సెక్టార్.. తీవ్ర ప్రమాదంలో కీలక ప్రాజెక్టులు..

IT Jobs: ఐటీ కొలువుల్లో AI కలకలం.. ఇక ఫ్రెషర్లకు ఉద్యోగాలు దొరకడం కష్టమేనా?

కొంపలు ముంచుతున్న ఇరాన్ యుద్ధం.. కొనేవారు లేక దుబాయ్లో కుప్పలు కుప్పలుగా పడిన బంగారం ..

Bengaluru: ఒకప్పుడు డబ్బు లేక నేలపై నిద్ర.. నేడు రూ. 800 కోట్ల టర్నోవర్! 23 ఏళ్ల అంజలి ఇన్స్పైరింగ్ జర్నీ!

బంగారం ధరలు పతనం కాబోతున్నాయి.. వెనిజులా బంగారంపై కన్నేసిన అమెరికా.. ట్రేడ్ డీల్ క్లోజ్..

బంగారంపై షాకిస్తున్న వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ రిపోర్ట్.. వచ్చే 15 రోజులు పసిడి ప్రియుల గుండెల్లో దడదడ..

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

పసిడి ప్రియులకు గుడ్ న్యూస్.. భారీగా తగ్గనున్న బంగారం, వెండి ధరలు.. కారణం ఏంటంటే..



Click it and Unblock the Notifications