ముంబై: భారత ఐటీ దిగ్గజం విప్రో షేర్లు సోమవారం భారీగా ఎగిశాయి. బ్రెజిల్ దేశానికి చెందిన ఐటీ సంస్థ ఇవియా సెర్వియోస్ సంస్థని చేజిక్కించుకున్నట్లు రెండు రోజుల ప్రకటించింది. ఇందుకు 22.4 మిలియన్ డాలర్లు (దాదాపు రూ.170 కోట్లు) వెచ్చించింది. ఈ కంపెనీ టేకోవర్ ప్రక్రియ ముగిసినట్లు శనివారం తెలిపింది. బ్రెజిల్ ఐటీ కంపెనీని చేజిక్కించుకోవడంతో ఇన్ఫోసిస్ షేర్ ధర సోమవారం భారీగా పెరిగింది.

అందుకే విప్రో కీలక నిర్ణయం
బ్రెజిల్లోని డెవలప్మెంట్, ఆపరేషనల్, మెయింటినెన్స్, కన్సల్టింగ్, ఐటీ సేవలు అందిస్తుంది ఇవియా సెర్వియోస్. ఐటీ రంగంలో ప్రపంచవ్యాప్తంగా తనదైన ముద్రవేసిన విప్రో ఇప్పుడు అభివృద్ధి చెందిన దేశాలపై దృష్టి సారించింది. ఇవియా సెర్వియోస్లో 700కు పైగా ఉద్యోగులు ఉన్నారు. దీని కొనుగోలు ద్వారా బ్రెజిల్లో విప్రో తన సేవలను మరింతగా విస్తరించనుంది. బ్రెజిల్లో ఐటీ రంగంలో పెరుగుతున్న అవకాశాలను అందిపుచ్చుకోవడంలో భాగంగా విప్రో కీలక నిర్ణయం తీసుకుంది.

విప్రో షేర్ జూమ్
విప్రో శనివారమే ఈ ప్రకటన చేసింది. దీంతో ఈ ఐటీ దిగ్గజం షేర్ ధర సోమవారం ఎగిసిపడింది. మార్కెట్ ముగిసే సమయంలో 2.53 శాతం ఎగిసి రూ.283.50 పలికింది. ఓ సమయంలో 3.54 శాతం ఎగిసింది. ఇవియా సెర్వియోస్కు సంబంధించిన విషయాన్ని విప్రో జూలై లోనే ప్రకటించింది. తాజాగా శనివారం ఈ కొనుగోలు ముగిసిందని ప్రకటించడంతో విప్రో షేర్ దూసుకెళ్లింది. విప్రో షేర్ 5 రోజులు, 20 రోజులు, 50 రోజులు, 100 రోజులు, 200 రోజుల సగటు కంటే ఎక్కువగా పెరిగింది. ఈ షేర్ ధర ఏడాదిలో 13 శాతం ఎగిసింది. ఈ ఏడాది ప్రారంభం నుండి 14.56 శాతం పుంజుకుంది.

విప్రో మార్కెట్ క్యాప్
విప్రో మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.1.61 లక్షల కోట్లు పెరిగి, రూ.4.32 లక్షల కోట్లుగా ఉంది. ఈ ఆర్థిక సంవత్సరం తొలి క్వార్టర్లో కూడా విప్రో కన్సాలిడేటెడ్ లాభాన్ని నమోదు చేసింది. ఏప్రిల్-జూన్ క్వార్టర్లో విప్రో ఆదాయం దాదాపు ఫ్లాట్గా రూ.15,871 కోట్లుగా ఉంది. అంతకుముందు ఇదే కాలంలో రూ.15,566 కోట్లు నమోదు చేసింది.
More From GoodReturns

ఇరాన్ యుద్ధంతో స్టాక్ మార్కెట్లో భయాందోళన..728 పాయింట్లు పడిపోయిన గిఫ్ట్ నిఫ్టీ.. భారీగా పెరిగిన ఇండియా VIX..

భారత స్టాక్ మార్కెట్లు పతనం.. చమురు ధరలు పెరగడంతో కుప్పకూలిన మార్కెట్

BSE: స్టాక్ మార్కెట్లో సరికొత్త ట్రెండ్.. సెన్సెక్స్లోనే కాకుండా ఇకపై వీటిలోనూ ట్రేడింగ్ చేయెచ్చు!

కొంపలు ముంచుతున్న ఇరాన్ యుద్ధం.. కొనేవారు లేక దుబాయ్లో కుప్పలు కుప్పలుగా పడిన బంగారం ..

బంగారంపై షాకిస్తున్న వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ రిపోర్ట్.. వచ్చే 15 రోజులు పసిడి ప్రియుల గుండెల్లో దడదడ..

బంగారం ధరలు పతనం కాబోతున్నాయి.. వెనిజులా బంగారంపై కన్నేసిన అమెరికా.. ట్రేడ్ డీల్ క్లోజ్..

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

బంగారం ధరలు ఈ స్థాయికి వస్తేనే కొనడానికి వెళ్లండి.. పసిడి ధరలపై ఆర్థిక నిపుణులు కీలక సూచన..

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..

Hyderabad: హైదరాబాద్లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?



Click it and Unblock the Notifications