8వ వేతన సంఘంతో కేంద్ర ఉద్యోగులకు భారీ ఊరట కలుగుతుందా లేక నిరాశేనా..

భారత కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు ఎంతోకాలంగా ఎదురు చూస్తున్న 8వ వేతన సంఘంపై (8th Pay Commission) ఆసక్తికర విశ్లేషణలు వెలువడుతున్నాయి. తాజా నివేదికల ప్రకారం, ఈసారి వేతనాల్లో భారీగా పెరుగుదల ఊహించబడినప్పటికీ, వాస్తవానికి లాభం మాత్రం గత వేతన సంఘాలతో పోలిస్తే కొంత తక్కువగానే ఉండే అవకాశం కనిపిస్తోంది. ప్రముఖ ఆర్థిక సంస్థ కోటక్ ఇన్స్టిట్యూషనల్ ఈక్విటీస్ విడుదల చేసిన నివేదిక ఈ అంశంపై కీలక వివరాలను తెలియజేసింది. వేతన బడ్జెట్‌, ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్, కేంద్ర ప్రభుత్వ ఖర్చులు అన్నింటిపై స్పష్టత ఇస్తూ, ఇది ఉద్యోగుల ఆశలు ఎంతవరకు నెరవేర్చగలదో అనే చర్చకు నాంది పలుకుతోంది.

8th Pay Commission Central Government Employees Salary Hike Wage Increase Fitment Factor Dearness Allowance DA Kotak Institutional Equities Government Expenditure Fiscal Burden Inflation Impact Economic Analysis Employee Benefits Grade-C Employees National Council JCM 8 -

ఈ సంఘం కొత్తగా సూచించబోయే "ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్" అంటే ప్రస్తుత మూల వేతనాన్ని ఎంత రెట్టింపు చేయాలో సూచించే సంఖ్య 1.8గా ఉండే అవకాశం ఉందని కోటక్ చెబుతోంది. ఇది గత 7వ వేతన సంఘం సిఫార్సు చేసిన 2.57 కంటే దాదాపు 30% తక్కువ. వాస్తవానికి, 1.8 ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్ వల్ల ప్రస్తుత కనీస వేతనం రూ. 18,000 నుండి సుమారు రూ. 32,000కి పెరిగే అవకాశం ఉంది.

కానీ ఇది కేవలం మూల వేతనానికి సంబంధించిన లెక్క. ప్రస్తుతం మూల వేతనానికి అదనంగా లభిస్తున్న డీఏ (Dearness Allowance) వంటి ఇతర భత్యాలు రద్దవడం వల్ల ఉద్యోగికి వచ్చే వాస్తవ వేతనంలో పెంపు మాత్రం పెద్దగా ఉండదు. ఉదాహరణకి, ఇప్పుడున్న రూ. 18,000 మూల వేతనానికి రూ. 9,900 డీఏతో కలిపి వచ్చే మొత్తం రూ. 27,900. కానీ 8వ సంఘం అమలయ్యాక డీఏను 0 నుంచి ప్రారంభించడం వల్ల పెరిగిన మూల వేతనం ఉన్నా, వాస్తవ పెంపు దాదాపు 13% మాత్రమే ఉంటుందన్నది నివేదిక అంచనా.

8వ వేతన సంఘం అమలుతో కేంద్ర ప్రభుత్వ ఖజానాపై రూ. 2.4 నుండి 3.2 లక్షల కోట్ల వరకు భారం పడే అవకాశం ఉంది. ఇది 2017లో 7వ వేతన సంఘం అమలుతో వచ్చిన రూ. 1.02 లక్షల కోట్ల భారం కంటే రెండింతలు ఎక్కువ. ఇది దాదాపు 33 లక్షల కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు నేరుగా లాభం చేకూర్చనుంది. వీరిలో దాదాపు 90 శాతం మంది గ్రేడ్-సీ ఉద్యోగులు కాగా, వీరికి ఈ పెంపు కారణంగా ఖర్చు సామర్థ్యం కూడా పెరుగుతుందని కోటక్ అంచనా వేసింది.

నేషనల్ కౌన్సిల్ జాయింట్ కన్సల్టేటివ్ మెషినరీలోని ఉద్యోగ సంఘాల ప్రతినిధులు ఇప్పటికే ప్రభుత్వం ముందు తమ డిమాండ్ వేశారు. వారు కనీసం 7వ వేతన సంఘం లాగే 2.57 ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్ కావాలంటున్నారు. కానీ ప్రభుత్వ ఆర్థిక పరిస్థితులను దృష్టిలో ఉంచుకుంటే, తక్కువ సంఖ్యే సాధ్యమవుతుందని చాలా మంది అంచనా వేస్తున్నారు.

2017లో 7వ వేతన సంఘం అమలుతో కేంద్ర ప్రభుత్వ ఖజానాపై సుమారు రూ 1.02 లక్షల కోట్ల భారం ఏర్పడింది. ఇప్పుడు 8వ వేతన సంఘం అమలవితే, దీని వ్యయభారం దాదాపు రెండు నుంచి మూడింతలు పెరిగి రూ 2.4 లక్షల కోట్లు నుండి రూ 3.2 లక్షల కోట్ల వరకు ఉండే అవకాశం ఉంది. ఇది కేంద్ర ప్రభుత్వంపై భారీ ఆర్థిక ఒత్తిడిని తేలుస్తోంది. అలాంటి పరిస్థితుల్లో, ప్రభుత్వ ఖర్చు ప్రణాళికల్లో మార్పులు రావొచ్చు. అలాగే, జీతాల పెరుగుదల కారణంగా ప్రజల ఖర్చులు పెరగడం, డిమాండ్ పెరగడం వల్ల ద్రవ్యోల్బణం కూడా ప్రభావితమయ్యే అవకాశముంది. దీన్ని దృష్టిలో ఉంచుకుంటే, దీని ప్రభావాన్ని సమగ్రంగా అంచనా వేసే అవసరం ఉంది.

ఈ నేపథ్యంలో, 8వ వేతన సంఘం పైన ఉద్యోగులు ఆశలతో ఎదురు చూస్తున్నప్పటికీ, ప్రభుత్వం తీసుకునే తుది నిర్ణయం సమతులితంగా ఉండాలి. ఉద్యోగుల జీవన స్థితిగతులను మెరుగుపరచడంలో వేతనాల పెంపు కీలకం అయినట్లే, కేంద్ర ఖజానాపై భారం, ద్రవ్యోల్బణంపై ప్రభావం వంటి అంశాలనూ సమంగా పరిగణనలోకి తీసుకోవాలి. వేతన సంఘాల ప్రతిపాదనలతో పాటు, ఆర్థిక మంత్రిత్వ శాఖ వ్యయ నియంత్రణ వ్యూహాలు, దేశ ఆర్థిక పరిస్థితిని సమీక్షించి, సమర్థవంతమైన నిర్ణయం తీసుకోవడం అవసరం. చివరికి, ఇది ఉద్యోగుల అభ్యున్నతికే కాకుండా, దేశ ఆర్థిక స్థిరత్వానికి కూడా కీలక ఘట్టంగా మారనుంది.

More From GoodReturns

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+