స్టాక్ మార్కెట్లు సోమవారం(డిసెంబర్ 6) భారీ నష్టాల్లో ముగిశాయి. ఉదయం నష్టాల్లో ప్రారంభమైన మార్కెట్లు, ఆ తర్వాత ఏ దశలోను కోలుకోలేదు. పైగా అంతకంతకూ దిగజారాయి. సెన్సెక్స్ 950 పాయింట్ల మేర పతనమై 57,000 దిగువన ముగిసింది. నిఫ్టీ 17000 పాయింట్ల దిగువన ముగిసింది. ఉదయం స్వల్ప నష్టాల్లో ప్రారంభమై, అదే నష్టాలతో ఫ్లాట్గా కనిపించింది. కానీ ఆ తర్వాత మధ్యాహ్నం సమయానికి భారీగా నష్టపోయింది. అంతర్జాతీయ ప్రతికూల సంకేతాలు, బలహీన రూపాయి, విదేశీ ఇన్వెస్టర్ల అమ్మకాలు స్థిరంగా కొనసాగడం వంటి అంశాలు దెబ్బతీశాయి. డాలర్ మారకంతో రూపాయి 75.42 వద్ద ముగిసింది.

సెన్సెక్స్ 950 పాయింట్లు డౌన్
సెన్సెక్స్ నేడు 57,778.01 పాయింట్ల వద్ద ప్రారంభమై, 57,781.46 పాయింట్ల వద్ద గరిష్టాన్ని, 56,687.62 పాయింట్ల వద్ద కనిష్టాన్ని తాకింది. నిఫ్టీ 17,209.05 పాయింట్ల వద్ద ప్రారంభమై, 17,216.75 పాయింట్ల వద్ద గరిష్టాన్ని, 16,891.70 పాయింట్ల వద్ద కనిష్టాన్ని తాకింది. సెన్సెక్స్ చివరకు 949.32 (1.65%) పాయింట్లు నష్టపోయి 56,747.14 పాయింట్ల వద్ద, నిఫ్టీ 284.45 (1.65%) పాయింట్లు పతనమై 16,912.25 పాయింట్ల వద్ద ముగిసింది. సెన్సెక్స్ నేడు 1100 పాయింట్ల మేర పైకి కిందకు కదలాడింది.

టాప్ లూజర్స్
ఆటో, ఐటీ, ఫార్మా రంగాలు భారీగా నష్టపోయాయి. ఈ స్టాక్స్ దాదాపు రెండు శాతం క్షీణించాయి. బీఎస్ఈ మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ సూచీలు కూడా ఒక్కొక్కటి ఒక శాతం చొప్పున పతనమయ్యాయి. నేటి టాప్ గెయినర్స్ జాబితాలో యూపీఎల్ నిలిచింది. నేటి టాప్ లూజర్స్ జాబితాలో కోల్ ఇండియా, ఇండస్ఇండ్ బ్యాంకు, టాటా కన్స్యూమర్ లిమిటెడ్, బజాజ్ ఫిన్ సర్వ్, హెచ్సీఎల్ టెక్ ఉన్నాయి. హెవీ వెయిట్స్ రిలయన్స్ 1.76 శాతం, టీసీఎస్ 3 శాతం, ఇన్ఫోసిస్ 2.3 శాతం మేర క్షీణించాయి.

రూ.4.27 లక్షల కోట్లు హుష్ కాకి, అందుకే..
నేడు సెన్సెక్స్ 950 పాయింట్లు క్షీణించగా, నిఫ్టీ 17,000 పాయింట్ల దిగువన ముగిసింది. నేడు ఐటీ స్టాక్స్ భారీగా పతనమయ్యాయి. మార్కెట్ పతనం నేపథ్యంలో ఇన్వెస్టర్ల సంపద ఈ రోజు ఒక్కరోజే రూ.4.27 లక్షల కోట్లు తగ్గింది.
ఫెడరల్ రిజర్వ్ రిలీఫ్ మెజర్స్ను ఊహించిన దాని కంటే ముందే వెనక్కి తీసుకుంటుందనే అంచనాలు మార్కెట్ నష్టాలకు ప్రధాన కారణం. అదే సమయంలో ఒమిక్రాన్ కేసులు ప్రపంచవ్యాప్తంగా, దేశవ్యాప్తంగా పెరుగుతున్నాయి. దీంతో మున్ముందు ఏమవుతుందోననే ఆందోళనతో ఇన్వెస్టర్లు ప్రస్తుత స్వల్ప ప్రాఫిట్ బుకింగ్ కోసం మొగ్గు చూపుతున్నారు.
More From GoodReturns

ఇరాన్ యుద్ధంతో స్టాక్ మార్కెట్లో భయాందోళన..728 పాయింట్లు పడిపోయిన గిఫ్ట్ నిఫ్టీ.. భారీగా పెరిగిన ఇండియా VIX..

భారత స్టాక్ మార్కెట్లు పతనం.. చమురు ధరలు పెరగడంతో కుప్పకూలిన మార్కెట్

Stock market: మార్కెట్ షాక్ ఇచ్చినా భయం వద్దు.. ఇన్వెస్టర్లకు ఇవే సేఫ్ ఆప్షన్లు!

BSE: స్టాక్ మార్కెట్లో సరికొత్త ట్రెండ్.. సెన్సెక్స్లోనే కాకుండా ఇకపై వీటిలోనూ ట్రేడింగ్ చేయెచ్చు!

Investment: మార్కెట్ ఒడిదుడుకులకు భయపడుతున్నారా? ఈ టైంలో ధనవంతులు ఏం చేస్తారో తెలుసా?

కొంపలు ముంచుతున్న ఇరాన్ యుద్ధం.. కొనేవారు లేక దుబాయ్లో కుప్పలు కుప్పలుగా పడిన బంగారం ..

బంగారంపై షాకిస్తున్న వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ రిపోర్ట్.. వచ్చే 15 రోజులు పసిడి ప్రియుల గుండెల్లో దడదడ..

బంగారం ధరలు పతనం కాబోతున్నాయి.. వెనిజులా బంగారంపై కన్నేసిన అమెరికా.. ట్రేడ్ డీల్ క్లోజ్..

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

బంగారం ధరలు ఈ స్థాయికి వస్తేనే కొనడానికి వెళ్లండి.. పసిడి ధరలపై ఆర్థిక నిపుణులు కీలక సూచన..



Click it and Unblock the Notifications