2017లో ప్రారంభమైన వస్తు, సేవల పన్ను (GST)లో ఇప్పటివరకు జరిగిన అతిపెద్ద సంస్కరణలను కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. GST 2.0గా పిలువబడుతున్న ఈ కొత్త వ్యవస్థలో పన్ను నిర్మాణం సులభతరం చేస్తూ కేవలం రెండు ప్రధాన స్లాబ్లకు పరిమితం చేశారు. అవేంటంటే.. 5 శాతంతో పాటుగా 18 శాతం. ఈ సంస్కరణలు 2025 సెప్టెంబర్ 22 నుండి అమల్లోకి రానున్నాయి. తాజాగా జీఎస్టీ (వస్తు సేవల పన్ను)లో ప్రధాన సంస్కరణలను ప్రకటించిన తరువాత కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఇండియా టుడేకు ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ సందర్భంగా Nirmala Sitharaman పలు ముఖ్య అంశాలపై సమాధానాలు ఇచ్చారు.
ఈ సందర్భంగా పెట్రోల్, డీజిల్ ఇప్పటికీ జీఎస్టీ పరిధిలోకి ఎందుకు రాలేదని రిపోర్టర్ అడిగిన ప్రశ్నపై ఆమె మాట్లాడుతూ.. జీఎస్టీ రేటు తగ్గింపుతో సాధారణ ప్రజలకు నేరుగా లాభం చేకూరుతుందని ఆమె స్పష్టం చేశారు. ఏదైనా కంపెనీ లేదా వ్యాపార సంస్థ పన్ను తగ్గింపు వల్ల వచ్చిన ప్రయోజనాన్ని వినియోగదారులకు అందించకపోతే ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని ఆమె హెచ్చరించారు. పెట్రోల్-డీజిల్ జీఎస్టీలో చేర్చేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు.

అయితే ఇది జీఎస్టీ ప్రతిపాదనలో లేదని తెలిపారు. జీఎస్టీ ప్రవేశపెట్టిన సమయంలోనే పెట్రోల్, డీజిల్లను కూడా చేర్చే ప్రయత్నం చేశామని అయితే రాష్ట్రాలు అంగీకరించలేదని గుర్తుచేశారు. దేశంలోని రాష్ట్రాలు రేట్ల విషయంలో ఒక నిర్ణయానికి వస్తే.. భవిష్యత్తులో పెట్రోల్, డీజిల్ను జీఎస్టీలోకి తీసుకురావచ్చని ఆమె అన్నారు.ప్రస్తుతం అలాంటి ప్రతిపాదన ఏదీ లేదని స్పష్టం చేశారు.
ఇంటర్యూలో ఇంకా అనేక అంశాలపై ఆర్థిక మంత్రి మాట్లాడారు. స్టాక్ మార్కెట్ గురించి ప్రస్తావిస్తూ.. మార్కెట్ ఒకే అంశం ఆధారంగా కదలదు. ఆర్థిక పరిస్థితులు, అంతర్జాతీయ పరిస్థితులు, పెట్టుబడిదారుల భావజాలం వంటి అనేక కారణాలు దానికి ప్రభావం చూపుతాయన్నారు. జీఎస్టీ 2.0 సంస్కరణ వల్ల 99 శాతం వస్తువుల ధరలు తగ్గాయని, ముఖ్యంగా ఆహార పదార్థాలను చౌకగా చేయడంపై మేము ప్రత్యేక దృష్టి పెట్టామని వివరించారు.ఇది కంపెనీలకోసం కాకుండా సామాన్యులకోసమే తీసుకువచ్చామన్నారు.
జీఎస్టీని ఒకప్పుడు గబ్బర్ సింగ్ టాక్స్ అని పిలిచిన ప్రతిపక్షాలు ఇప్పుడు దానిపై క్రెడిట్ తీసుకోవడం విచిత్రంగా ఉందని సీతారామన్ అన్నారు. ఇందిరా గాంధీ కాలంలో కాంగ్రెస్ ఆదాయపు పన్నుపై 91 శాతం వరకు పన్ను విధించింది. ఇప్పుడు జీఎస్టీ సంస్కరణలకూ, ప్రజలకు కలిగిన లాభాలకూ అదే కాంగ్రెస్ పార్టీ క్రెడిట్ తీసుకోవడానికి ప్రయత్నిస్తోందని ఆమె విమర్శించారు. మోదీప్రభుత్వం ప్రతి సంవత్సరం జీఎస్టీని మరింత ప్రజానుకూలంగా మార్చడానికి కృషి చేస్తుందని తెలిపారు.ముందు ముందు కూడా పన్ను తగ్గింపులు, సరళీకరణలు కొనసాగుతాయన్నారు. ప్రజలకు నేరుగా లాభం చేరేలా చూస్తామని హామీ ఇచ్చారు.
More From GoodReturns

బంగారంపై షాకిస్తున్న వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ రిపోర్ట్.. వచ్చే 15 రోజులు పసిడి ప్రియుల గుండెల్లో దడదడ..

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

పసిడి ప్రియులకు గుడ్ న్యూస్.. భారీగా తగ్గనున్న బంగారం, వెండి ధరలు.. కారణం ఏంటంటే..

Hyderabad: హైదరాబాద్లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

బంగారం ధరలు ఈ రోజు కూడా తగ్గాయి.. 10 గ్రాములు ధర ఎంత తగ్గిందంటే.. మార్చి 3, మంగళవారం ధరలు ఇవే..

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..

Gold: నిశ్శబ్దంగా ఉన్న బంగారం మార్కెట్.. బ్యాంకుల వ్యూహం మారింది, ఇన్వెస్టర్లు జాగ్రత్త!

బంగారం ధరలు ఈ రోజు కూడా తగ్గాయి.. కొనుగోలుపై బులియన్ నిపుణులు కీలక సూచన.. మార్చి 5, గురువారం ధరలు ఇవే..

Bengaluru: ఒక్క లేఆఫ్.. 8 ఏళ్ల కష్టాన్ని బూడిద చేసింది! వైరల్ అవుతున్న చార్టర్డ్ అకౌంటెంట్ పోస్ట్!

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!



Click it and Unblock the Notifications