ఆర్థిక నిపుణులతో మోడీ కీలక భేటీ, నిర్మలా సీతారామన్ ఎందుకు రాలేదు?
ప్రధాని నరేంద్ర మోడీ గురువారం ఆర్థికవేత్తలు, ప్రయివేటు ఈక్విటీ, వెంచర్ క్యాపిటలిస్టులు, బిజినెస్మెన్, వ్యవసాయ నిపుణులతో నీతి అయోగ్ కార్యాలయంలో భేటీ అయ్యారు. ఈ భేటీలో నీతి అయోగ్ ఉపాధ్యక్షులు రాజీవ్ కుమార్, కేంద్రమంత్రులు అమిత్ షా, నితిన్ గడ్కరీ, పీయూష్ గోయల్, నీతి అయోగ్ సీఈవో అమితాబ్ కాంత్, ప్రధానమంత్రి ఆర్థిక సలహా మండలి చైర్మన్ వివేక్ దేవరాయ్ తదితరులు పాల్గొన్నారు. దాదాపు 40 మందికి పైగా నిపుణులు, ఆర్థికవేత్తలు, వ్యాపార దిగ్గజాలు ఈ సమావేశంలో పాల్గొన్నారు.
IRCTC tatkal: తత్కాల్ బుకింగ్ రూల్స్, టైమింగ్స్, ఛార్జీలు
అయితే కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ మాత్రం ఈ సమావేశంలో పాల్గొనలేదు. బీజేపీ ప్రధాన కార్యాలయంలో పార్టీ నేతలతో బడ్జెట్ ముందస్తు సమావేశాల్లో ఉన్న కారణంగా ఆమె పాల్గొనలేకపోయారు.
నిర్మలా సీతారామన్ మరో బడ్జెట్ ముందస్తు సమావేశాల్లో ఉండటం వల్ల హాజరు కాలేకపోయినప్పటికీ కాంగ్రెస్ పార్టీ ఈ విషయాన్ని ప్రశ్నించింది. ఆర్థిక శాఖ మంత్రి లేకుండానే బడ్జెట్ సమావేశం నిర్వహిస్తారా, కనీసం వచ్చే సమావేశానికైనా ఆర్థిక మంత్రని ఆహ్వానించే విషయమై ఆలోచించండి అని కాంగ్రెస్ పార్టీ ట్వీట్ చేసింది.