ఒకనాడు బంగారు పక్షిగా భారత్.. నేడు తీవ్ర పసిడి కరువులో.. కారణం తెలిస్తే మైండ్ బ్లాకవ్వాల్సిందే..

భారతదేశాన్ని చరిత్రలో 'బంగారు పక్షి' అని పిలిచేవారు. అది కేవలం ఒక వర్ణన మాత్రమే కాదు, అక్షరాలా నిజం. ఒకప్పుడు ప్రపంచంలోని బంగారం అంతా నదుల లాగా భారతదేశంలోకి ప్రవహించేది. అయితే, శతాబ్దాలుగా విదేశాల నుండి భారతదేశంలోకి Gold నిరంతరం వస్తూనే ఉంటే.. నేడు అదే బంగారం దిగుమతులపై ప్రభుత్వం ఎందుకు ఆందోళన చెందుతోంది? ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్వయంగా ప్రజలను ఏడాది పాటు బంగారం కొనుగోలుకు దూరంగా ఉండాలని ఎందుకు విజ్ఞప్తి చేయాల్సి వచ్చింది? ఈ ప్రశ్నలకు సమాధానం కావాలంటే, మనం 2000 ఏళ్ల నాటి చరిత్రను, నేటి ఆర్థిక వాస్తవాలను పరిశీలించాల్సి ఉంటుంది.

దాదాపు రెండు వేల సంవత్సరాల క్రితం, క్రీ.శ. 77 ప్రాంతంలో, ప్రసిద్ధ రోమన్ చరిత్రకారుడు ప్లినీ ది ఎల్డర్ తన 'న్యాచురాలిస్ హిస్టోరియా' అనే పుస్తకంలో రోమ్ ఆర్థిక పరిస్థితిపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేశాడు. భారతదేశంతో జరుగుతున్న వాణిజ్యం కారణంగా రోమన్ సామ్రాజ్యం తీవ్ర ఆర్థిక నష్టాన్ని మూటగట్టుకుంటోందని ఆయన వాపోయాడు. భారతదేశం ప్రతి సంవత్సరం రోమ్ నుండి సుమారు 50 మిలియన్ సెస్టర్స్‌ల విలువైన బంగారాన్ని లాగేసుకుంటోందని ప్లినీ రాశాడు.

Ancient India trade Ancient Indian economy Gold imports in Ancient India Ancient India global trade Roman gold trade India India trade routes Ancient Bharat economy Gold inflow India history Silk Route India Spice trade India Ancient Indian commerce India trade surplus Indian economic history Global trade ancient India Roman Empire and India trade Ancient wealth of India Maritime trade India Ancient Indian exports Gold trade history Indian civilization economy

ఆ కాలంలో ఒక రోమన్ సైనికుడి వార్షిక జీతం 900 నుండి 1200 సెస్టర్సెస్ మాత్రమే. అంటే, భారతదేశానికి వెళ్తున్న బంగారం విలువ దాదాపు 40 వేల మంది సైనికుల వార్షిక జీతంతో సమానం. అందుకే ప్లినీ భారతదేశాన్ని "ప్రపంచంలోనే అతిపెద్ద బంగారు మురుగు కాలువ" అని విమర్శించాడు. రోమన్లు భారత్‌కు చెందిన మిరియాలు, సుగంధ ద్రవ్యాలు, ముత్యాలు, పట్టు వస్త్రాల కోసం అంతగా పిచ్చిగా బంగారం చెల్లించేవారు.

ప్రాచీన భారతదేశంలో విదేశీ వాణిజ్యం అత్యంత వ్యవస్థీకృతంగా ఉండేది. దక్షిణ భారతదేశంలోని 'సంగం సాహిత్యం' నాటి సముద్ర వాణిజ్యాన్ని అద్భుతంగా వర్ణించింది. ఓడలు బంగారంతో నిండి వచ్చి, మిరియాలతో నిండి తిరిగి వెళ్ళేవి అని తమిళ పద్యాలు పేర్కొన్నాయి. ఆ కాలంలో ఐరోపాలో నల్ల బంగారంగా పిలవబడే మిరియాలకు విపరీతమైన డిమాండ్ ఉండేది.

Also Read

మౌర్య సామ్రాజ్యం కాలంలో భారతదేశం నుండి సుగంధ ద్రవ్యాలు, ముత్యాలు, రత్నాలు, పత్తి వస్త్రాలు, ఏనుగు దంతాలు విదేశాలకు ఎగుమతి అయ్యేవి. ప్రతిగా గుర్రాలు, Gold, గాజు దిగుమతి చేసుకునేవారు. క్రీ.పూ. 400 నాటికే భారత్‌లో అత్యుత్తమ నాణ్యత గల ఉక్కు తయారీ ప్రారంభమైంది. ఆ తర్వాత శాతవాహన రాజవంశం కాలంలో రోమన్ సామ్రాజ్యంతో వాణిజ్యం శిఖరాగ్రానికి చేరింది. రోమ్ నుండి బంగారం, వెండి, వైన్ వస్తే, భారత్ నుండి పరిమళ ద్రవ్యాలు, ఆభరణాలు, నీలిమందు, చందనం, మరియు ఉక్కు ఎగుమతి అయ్యేవి.

భారతదేశ 'స్వర్ణయుగం'గా పిలిచే గుప్తుల కాలంలో వస్త్ర పరిశ్రమ మూడు పువ్వులు ఆరు కాయలుగా వర్ధిల్లింది. పట్టు, మస్లిన్, నార, పత్తి వస్త్రాల ఉత్పత్తితో పాటు కుమ్మరి పరిశ్రమ, రాతి శిల్పాలు, ముత్యాల పరిశ్రమలు దేశ సంపదను పెంచాయి. ఆ తర్వాత వచ్చిన చోళ పాలకులు తమ శక్తివంతమైన నౌకాదళంతో సముద్ర వాణిజ్యాన్ని ఆగ్నేయాసియా వరకు విస్తరించారు. ఓడరేవులు, గిడ్డంగులు, ఓడల మరమ్మతు కేంద్రాలను నిర్మించి అంతర్జాతీయ వ్యాపారాన్ని శాసించారు. భారతదేశం సహజంగా బంగారాన్ని ఉత్పత్తి చేసే దేశం కాదు. కానీ, ప్రపంచ దేశాలు మన వస్తువుల నాణ్యతకు దాసోహమై, ఆనాటి అంతర్జాతీయ కరెన్సీ అయిన బంగారాన్ని మనకు చెల్లించక తప్పలేదు. అలా భారత్ 'బంగారు పక్షి'గా మారింది.

అప్పటి పరిస్థితికి, ఇప్పటి పరిస్థితికి భూమికి, ఆకాశానికి ఉన్నంత తేడా ఉంది. నాటి కాలంలో భారతదేశం బంగారాన్ని వాణిజ్య మిగులు ద్వారా సంపాదించింది. కానీ నేడు భారతదేశం బంగారాన్ని విదేశీ డబ్బు ఇచ్చి కొనుగోలు చేస్తోంది. ప్రస్తుతం మనం నిరంతరం వాణిజ్య లోటును ఎదుర్కొంటున్నాము. అంటే, మనం విదేశాలకు చేసే ఎగుమతుల కంటే, అక్కడి నుండి చేసుకునే దిగుమతులు చాలా ఎక్కువ. ముఖ్యంగా ముడిచమురు ధరలు పెరగడం, దాంతో పాటు భారతీయులకు బంగారంపై ఉన్న విపరీతమైన మోజు వల్ల దేశ విలువైన విదేశీ మారక నిధులు కరిగిపోతున్నాయి. ఇరాన్ సంక్షోభం వంటి అంతర్జాతీయ ఉద్రిక్తతల వల్ల చమురు ధరలు మరింత పెరిగినప్పుడు, దేశ ఆర్థిక వృద్ధికి ఉపయోగపడాల్సిన నిధులు విదేశాలకు తరలిపోతున్నాయి.

ప్రధాని మోదీ బంగారం కొనవద్దని చేసిన విజ్ఞప్తి వెనుక ఉద్దేశం బంగారానికి వ్యతిరేకం కావడం కాదు, దేశ ఆర్థిక సార్వభౌమత్వాన్ని కాపాడడమే. అందుకే, ప్రస్తుత ప్రభుత్వం ఈ ఆందోళన నుండి బయటపడటానికి, విదేశీ వాణిజ్యాన్ని పెంచడానికి ప్రపంచ దేశాలతో సరికొత్త వాణిజ్య ఒప్పందాలు కుదుర్చుకుంటూ, మళ్లీ భారతదేశాన్ని ఎగుమతుల హబ్‌గా మార్చడానికి ప్రయత్నిస్తోంది. ఆనాటి 'బంగారు పక్షి' వైభవాన్ని నేటి ఆధునిక ఆర్థిక వ్యవస్థలో సాధించడమే ప్రస్తుత భారతదేశం ముందున్న సవాలు అని చెప్పవచ్చు.

డిస్క్లైమర్: ఈ వెబ్‌సైట్‌లోని అభిప్రాయాలు, సూచనలు పూర్తిగా వ్యక్తిగత విశ్లేషకులు లేదా ఇతర సంస్థలవి మాత్రమే. ఇవి Goodreturns.in లేదా Greynium Information Technologies Private Limited అధికారిక అభిప్రాయాలు కాదని గమనించగలరు.మేము ఈ విషయం యొక్క ఖచ్చితత్వం, సమగ్రత లేదా విశ్వసనీయతపై ఎటువంటి హామీ ఇవ్వడం కాని, అనుమతించడం కాని బాధ్యత వహించడం జరగదు. మేము ఎలాంటి పెట్టుబడి సలహా ఇవ్వము. అలాగే ఎటువంటి సెక్యూరిటీ కొనుగోలు లేదా అమ్మకాలు ప్రోత్సహించము. ఈ వెబ్‌సైట్‌లోని కథనం పూర్తిగా సమాచారం, విద్యా ప్రయోజనాల కోసమే అందించబడుతుంది. మీరు ఏదైనా పెట్టుబడి నిర్ణయం తీసుకునే ముందు, లైసెన్స్ పొందిన ఆర్థిక సలహాదారుల సహాయం తీసుకోండి. ఈ కథనాన్ని కేవలం సమాచారంగా మాత్రమే పరిగణించండి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+