ప్రపంచం మార్పు దిశలో ఉంది. ఈ క్రమంలో డ్రాగన్ (చైనా), ఏనుగు (భారత్) కలిసి రావడం చాలా అవసరం అని చెబుతూ చైనా అధ్యక్షుడు షీ జిన్పింగ్ కీలక వ్యాఖ్యలు చేశారు. చైనాలో జరుగుతున్న షాంఘై సహకార సంస్థ (SCO) శిఖరాగ్ర సదస్సు సందర్భంగా, ప్రధాని నరేంద్ర మోదీతో జరిగిన ప్రతినిధుల స్థాయి చర్చల ప్రారంభంలో జిన్పింగ్ ఈ వ్యాఖ్యలు చేశారు. ఆయన మాట్లాడుతూ, భారత్-చైనా దేశాలు స్నేహపూర్వకంగా, మంచి పొరుగు దేశాలుగా ఉండటం అత్యంత అవసరమని పేర్కొన్నారు.

ఇది సాధారణ మీటింగ్ మాత్రమే కాదు. దాదాపు ఏడేళ్ల తర్వాత మోదీ చైనా పర్యటన చేస్తున్నారు. అంతేకాదు, 2020లో లడఖ్ గల్వాన్ లోయలో జరిగిన ఘర్షణల తర్వాత ఇరుదేశాల మధ్య ఉన్న ఉద్రిక్తత దృష్ట్యా ఈ భేటీకి ప్రత్యేక ప్రాధాన్యత ఉంది.
జిన్పింగ్ మాట్లాడుతూ భారత్-చైనా మధ్య ఉన్న సంబంధాలను ఒక కొత్త కోణంలో వివరించారు. ఆయన మాటల్లో ఈ రెండు దేశాలు వేల ఏళ్ల చరిత్ర కలిగిన ప్రాచీన నాగరికతలు, అలాగే ప్రపంచంలోనే ఎక్కువ జనాభా కలిగిన దేశాలు. గ్లోబల్ సౌత్లో కూడా కీలక పాత్ర పోషిస్తున్నాయి. కాబట్టి ఇరు దేశాలు మంచి పొరుగు వారిలా, స్నేహితుల్లా కలిసి ముందుకు నడవాల్సిన అవసరం ఉందని ఆయన స్పష్టం చేశారు. ఈ సంవత్సరం భారత్-చైనా దౌత్య సంబంధాలకు 75 ఏళ్లు పూర్తవుతున్న నేపథ్యంలో, దీన్ని వ్యూహాత్మకంగా ఉపయోగించుకుని, దీర్ఘకాల దృష్టితో బంధాన్ని మరింత బలపరచుకోవాలని జిన్పింగ్ పిలుపునిచ్చారు.
అంతర్జాతీయ స్థాయిలో కూడా జిన్పింగ్ ఒక క్లియర్ మెసేజ్ ఇచ్చారు. దేశాలు బహుళ పాక్షిక విధానం (మల్టిలేటరలిజం)కు కట్టుబడి ఉండాలని ఆయన చెప్పారు. ప్రపంచం మల్టిపోలర్గా అనేక శక్తి కేంద్రాలతో మారేందుకు కలిసి కృషి చేయాలని పిలుపునిచ్చారు. అంతర్జాతీయ సంస్థల్లో మరింత ప్రజాస్వామ్యం ఉండాలని కూడా ఆయన స్పష్టం చేశారు. ఆసియాలోనే కాదు, మొత్తం ప్రపంచంలో శాంతి, అభివృద్ధి కోసం అందరం కలసి ముందుకు సాగాలని జిన్పింగ్ అభిప్రాయపడ్డారు.
తన ప్రసంగంలో ప్రధాని మోదీ కూడా స్పష్టమైన హామీ ఇచ్చారు."భారత్-చైనా సంబంధాలు పరస్పర నమ్మకం, గౌరవం, సున్నితత్వం మీదే ఆధారపడాలి. మేము అదే దిశలో ముందుకు వెళ్లాలని కట్టుబడి ఉన్నాం" అని ఆయన అన్నారు. అదే సమయంలో, 2.8 బిలియన్ ప్రజల సంక్షేమం భారత్-చైనా సహకారంపైనే ఆధారపడి ఉందని కూడా మోదీ చెప్పారు.
మోదీ ప్రస్తావించిన ముఖ్యాంశాల్లో, గత సంవత్సరం జరిగిన సైనిక విరమణ వల్ల సరిహద్దుల్లో కొంత శాంతి నెలకొన్నట్టు చెప్పారు. భారత్-చైనా మధ్య నేరుగా విమాన సర్వీసులు మళ్లీ ప్రారంభం కానున్నాయన్న విషయాన్ని వెల్లడించారు. అంతేకాకుండా, యాత్రికులు ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న కైలాస్-మానససరోవర్ యాత్ర మళ్లీ మొదలవుతున్నట్టు మంచి వార్తను పంచుకున్నారు.
కొత్త దిశలో సంబంధాల పునఃప్రారంభం?
గత కొన్ని ఏళ్లుగా సరిహద్దు సమస్యలు, గల్వాన్ ఘర్షణ వల్ల భారత్-చైనా సంబంధాలు బాగా దెబ్బతిన్నాయి. కానీ ఇప్పుడు SCO మీటింగ్ వేదికగా, ఇరుదేశాల నేతల మధ్య మళ్లీ సానుకూల వాతావరణం కనిపిస్తోంది. జిన్పింగ్ ఇచ్చిన "డ్రాగన్ - ఏనుగు కలిసి రావాలి" అనే మెసేజ్ ఈ మార్పుకు సంకేతమని చెప్పవచ్చు.
మొత్తానికి, "భారత్-చైనా సంబంధాలు" మళ్లీ కొత్త పేజీ తిప్పబోతున్నాయా? లేక ఇది కేవలం డిప్లొమాటిక్ మాటల ఆటేనా? అనే కుతూహలం మాత్రం అందరికి పెరిగింది.
More From GoodReturns

బంగారంపై షాకిస్తున్న వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ రిపోర్ట్.. వచ్చే 15 రోజులు పసిడి ప్రియుల గుండెల్లో దడదడ..

బంగారం ధరలు పతనం కాబోతున్నాయి.. వెనిజులా బంగారంపై కన్నేసిన అమెరికా.. ట్రేడ్ డీల్ క్లోజ్..

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

బంగారం ధరలు ఈ స్థాయికి వస్తేనే కొనడానికి వెళ్లండి.. పసిడి ధరలపై ఆర్థిక నిపుణులు కీలక సూచన..

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..

Hyderabad: హైదరాబాద్లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..

ఒక్కసారిగా తగ్గిన బంగారం ధర .. తగ్గిన రేట్లతో పసిడి ప్రియుల్లో జోష్.. మార్చి 9, సోమవారం ధరలు ఇవే..

Stock market: స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు అలర్ట్.. సోమవారం భారీ పతనం తప్పదా?



Click it and Unblock the Notifications