Dal Prices: దేశంలో కూరగాయల ధరలు ఇప్పటికే మండిపోతుంటే.. పప్పుధాన్యాల ధరలు అమాంతం ఆకాశాన్ని తాకే పనిలో కొనసాగుతున్నాయి. ఈ ఏడాది పప్పుల ధరలు దాదాపు 10 శాతానికిపైగా పెరిగాయి.
వీటి ధరలు రానున్న కాలంలో మరింతగా పెరుగుతాయని వ్యాపారులు చెబుతున్నారు. అయితే వీటి ధరలను అదుపులో ఉంచేందుకు ప్రభుత్వం ఎన్ని ప్రయత్నాలు చేసినా స్వల్పకాలంలో పెంపుదల ఆగడం ఆందోళన కలిగిస్తోంది. రాయితీలను కొనసాగించాలని నిపుణులు అంటున్నారు. ప్రస్తుతం ఇతర దినుసుల ధరలు సైతం పరుగుల పందెంలోకి వస్తున్నాయి.

వర్షాకాలంలో కూరగాయల ధరలు పెరగడం ఆనవాయితీగా మారిపోయింది. కానీ ఈ ఏడాది వాటితో పాటు అనేక ఇతర ఆహారాల ధరలు పెరగటం గమనార్హం. గడచిన ఐదు నెలల్లో పప్పు ధాన్యాల ద్రవ్యోల్బణం రెండింతలు పెరిగిందని రేటింగ్ ఏజెన్సీ క్రిసిల్ వెల్లడించింది. మే నెలలో టోకు ధరల సూచీ పప్పుల ద్రవ్యోల్బణం 5.8 శాతం, సీపీఐ 6.6 శాతంగా నమోదైంది. అయితే జూన్లో సీపీఐ పప్పుల ద్రవ్యోల్బణం 10.58 శాతానికి చేరుకుంది.
ఇదే సమయంలో బియ్యం ధరలు 10 శాతం, గోధుమల ధరలు 12 శాతం పెరగటంతో సగటు భారతీయుడు మూడు పూటలా తినలేని పరిస్థితి నెలకొంది. ఆహార ద్రవ్యోల్బణం బుట్టలో పప్పుధాన్యాలకు ఆరు శాతం వెయిటేజీ ఉంటుంది. ఇక్కడ ఏవైనా ధరలు పెరిగితే అది గృహ బడ్జెట్లను ప్రభావితం చేస్తుంది. అయితే ప్రస్తుతం పప్పుల ధరలను నియంత్రించటంలో చురుకుగా ఉన్నట్లు క్రిసిల్ చీఫ్ ఎకనామిస్ట్ డికె జోషి అభిప్రాయపడ్డారు. పప్పు ధాన్యాల కొనుగోలు, దిగుమతులపై కేంద్రం దృష్టి సారించింది.
దేశంలోని పల్స్ స్టోరీకి వస్తే.. పంజాబ్, హర్యానా, పశ్చిమ యూపీ, కోస్టల్ అండ్ తూర్పు కర్ణాటక, మహారాష్ట్రలోని కొన్ని ప్రాంతాలలో పప్పుధాన్యాలను పండిస్తారు. ఇదే సమయంలో మయన్మార్, కెనడా వంటి దేశాల నుంచి ఇండియా భారీ మెుత్తంలో దిగుమతులను సైతం చేసుకుంటుంది. ఇలాంటి తరుణంలో జాతీయ ఆహార భద్రతా మిషన్ పప్పుధాన్యాల ఉత్పత్తిపై అధికంగా దృష్టి సారించింది. అలాగే పప్పుధాన్యాలపై దిగుమతి పరిమితులను తొలగించడం, వ్యవసాయోత్పత్తి మార్కెట్ కమిటీ చట్టాల నుంచి పప్పులను తొలగించడం వంటివి జరిగాయి.
More From GoodReturns

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

బంగారం, వెండి ధరలు పతనానికి ఇరాన్ యుద్ధం కారణం కాదు..సంచలన విషయాలు వెల్లడించిన బులియన్ నిపుణులు..

Gas booking: ఇకపై గ్యాస్ వెంటనే బుక్ చేయలేరు.. కొత్త వెయిటింగ్ పీరియడ్ రూల్స్ ఇవే!

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..



Click it and Unblock the Notifications