మనందరం ప్రతిరోజూ వాడే మెసేజింగ్ యాప్ వాట్సాప్(WhatsApp).. ఇప్పుడు దేశంలో హాట్ టాపిక్గా మారింది. మీరు వింటే ఆశ్చర్యపోతారు. కానీ మన దేశంలో ప్రతి నెలా సగటున దాదాపు కోటి (10 మిలియన్లు) వాట్సాప్ అకౌంట్లు నిషేధానికి గురవుతున్నాయి. ఆన్లైన్ మోసాలు, సైబర్ ఫ్రాడ్స్ పెరుగుతున్న నేపథ్యంలో వాట్సాప్ ఈ కఠిన నిర్ణయాలు తీసుకుంటోంది. అయితే దీనిపై కేంద్ర ప్రభుత్వం మరింత లోతుగా విచారణ జరుపుతోంది.

ఏ నెలకు ఎన్ని అకౌంట్లు బ్యాన్ అయ్యాయి?
వాట్సాప్ విడుదల చేసిన రిపోర్ట్స్ ప్రకారం ఈ ఏడాది(2025) అక్టోబర్ వరకు నిషేధించబడిన అకౌంట్ల వివరాలు చూస్తే.. జనవరిలో 99 లక్షల అకౌంట్లు, మార్చిలో 1.11 కోట్లు, మే నెలలో 1.12 కోట్లు, సెప్టెంబర్ లో 1 కోటి, అక్టోబర్ లో 91 లక్షల అకౌంట్లు బ్యాన్ అవుతున్నాయి. అంటే సగటున నెలకు 98 లక్షల అకౌంట్లు ఈ ప్లాట్ఫారమ్ నుండి తొలగించబడుతున్నాయి. అంటే దేశంలో సైబర్ నేరాలు ఏ స్థాయిలో జరుగుతున్నాయో మనం అర్థం చేసుకోవచ్చు.
ప్రభుత్వం ఎందుకు ఆందోళన చెందుతోంది?
వాట్సాప్ అకౌంట్లను బ్యాన్ చేస్తున్నప్పటికీ.. కేంద్ర ప్రభుత్వం కొన్ని కీలక ప్రశ్నలను లేవనెత్తుతోంది.
- డేటా షేరింగ్: ఏ నంబర్లను బ్యాన్ చేశారో ఆ వివరాలను వాట్సాప్ ప్రభుత్వం సరిగ్గా ఇవ్వడం లేదు. దీనివల్ల ఆ నేరగాళ్లను పట్టుకోవడం పోలీసులకు కష్టమవుతోంది.
- టెలిగ్రామ్ వైపు మలుపు: వాట్సాప్ లో బ్యాన్ అయిన నంబర్లు వెంటనే టెలిగ్రామ్ వంటి ఇతర యాప్స్లోకి వెళ్లి అక్కడ మోసాలకు పాల్పడుతున్నాయి.
- డిజిటల్ అరెస్ట్ స్కామ్స్: ప్రస్తుతం దేశంలో సంచలనం సృష్టిస్తున్న 'డిజిటల్ అరెస్ట్' మోసాలు, ఐడెంటిటీ థెఫ్ట్ కేసులు 95 శాతం వాట్సాప్ ద్వారానే జరుగుతున్నాయి.
నేరగాళ్లు ఎలా తప్పించుకుంటున్నారు?
సైబర్ నేరగాళ్లు ఒకసారి మొబైల్ నంబర్ తో అకౌంట్ క్రియేట్ చేశాక, సిమ్ కార్డ్ తీసేసినా వాట్సాప్ వాడుకోవచ్చు. ఇది ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీలకు పెద్ద తలనొప్పిగా మారింది. కేవలం 'బిహేవియరల్ సిగ్నల్స్' (అంటే అనుమానాస్పదంగా మెసేజ్లు పంపడం) ఆధారంగానే వాట్సాప్ ఈ చర్యలు తీసుకుంటోంది.
యూజర్లు తీసుకోవాల్సిన జాగ్రత్తలు
మీ వాట్సాప్ అకౌంట్ సురక్షితంగా ఉండాలంటే, మీరు మోసపోకుండా ఉండాలంటే ఇలా చేయండి..
- అపరిచిత మెసేజ్లు: గుర్తు తెలియని నంబర్ల నుండి వచ్చే లింక్లను క్లిక్ చేయకండి.
- టూ-స్టెప్ వెరిఫికేషన్: మీ వాట్సాప్ సెట్టింగ్స్లో టూ-స్టెప్ వెరిఫికేషన్ తప్పనిసరిగా ఎనేబుల్ చేసుకోండి.
- రిపోర్ట్ & బ్లాక్: మీకు ఏదైనా అనుమానాస్పద మెసేజ్ వస్తే వెంటనే ఆ నంబర్ను రిపోర్ట్ చేసి బ్లాక్ చేయండి.
ఏదేమైనా ఈ రోజుల్లో సాంకేతికత ఎంత పెరుగుతుందో మోసాలు కూడా అంతే వేగంగా పెరుగుతున్నాయి. ప్రభుత్వం ఇప్పుడు వాట్సాప్ తో పాటు ఇతర సంస్థలతో కూడా చర్చలు జరుపుతోంది. భవిష్యత్తులో కేవలం అకౌంట్ బ్యాన్ చేయడమే కాకుండా సదరు నేరగాడిని గుర్తించేలా కఠిన నిబంధనలు వచ్చే అవకాశం ఉంది.
More From GoodReturns

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్గా కానిచ్చేస్తున్నారు!

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?

బంగారం, వెండి ధరలు పతనానికి ఇరాన్ యుద్ధం కారణం కాదు..సంచలన విషయాలు వెల్లడించిన బులియన్ నిపుణులు..



Click it and Unblock the Notifications