WhatsApp Pay: గుడ్‌న్యూస్, మెసేజ్ పంపించినంత ఈజీగా డబ్బు పంపించవచ్చు

వాట్సాప్ వినియోగదారులకు గుడ్‌న్యూస్. ఫోన్‌పే, పేటీఎం, గూగుల్ పే వలె వాట్సాప్ ద్వారా కూడా పేమెంట్స్ చేసుకోవచ్చు. వాట్సాప్ ద్వారా ఆర్థిక కార్యకలాపాలకు కేంద్ర ప్రభుత్వం అనుమతులు ఇచ్చింది. దశలవారీగా ఈ సేవల్ని అందుబాటులోకి తీసుకు రావొచ్చునని తెలిపింది. ఈ మేరకు నేషనల్ పేమెంట్స్ కార్పోరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) తెలిపింది. కేంద్రం అనుమతి ఇవ్వడంపై ఫేస్‌బుక్ సీఈవో మార్క్ జుకర్‌బర్గ్ హర్షం వ్యక్తం చేశారు. శుక్రవారం నుండి ఈ సేవల్ని అందుబాటులోకి తీసుకు వస్తున్నట్లు వీడియో సందేశంలో తెలిపారు.

ఇప్పుడు ఇండియాలో వాట్సాప్ పే...

ఇప్పుడు ఇండియాలో వాట్సాప్ పే...

భారత్‌లో వాట్సాప్ పే సేవలు నేటి నుండి అమలులోకి వచ్చాయి. ఈ రోజు నుండి కొత్త ఫీచర్‌ను అందుబాటులోకి తెచ్చినట్లు వాట్సాప్ బ్లాగ్ ద్వారా తెలిపింది. 'ఈ రోజు నుండి భారత్‌లో ప్రజలు వాట్సాప్ ద్వారా డబ్బులు పంపించగలరు. దీని ద్వారా సురక్షిత చెల్లింపులు జరపవచ్చు. వాట్సాప్ నుండి సందేశం పంపించినంత సులభంగా వాట్సాప్ పే ద్వారా డబ్బులు చెల్లించవచ్చు. వ్యక్తిగత నగదు మార్పిడి లేకుండా, స్థానికంగా బ్యాంకుకు వెళ్లకుండా ప్రజలు సురక్షితంగా కుటుంబ సభ్యులకు, స్నేహితులకు డబ్బులు పంపించవచ్చు. లేదా ఉత్పత్తుల కొనుగోలుకు చెల్లింపులు జరపవచ్చు' అని పేర్కొంది.

160కి పైగా ఖాతాల పేమెంట్స్

160కి పైగా ఖాతాల పేమెంట్స్

NPCIతో కలిసి యూనిఫైట్ పేమెంట్ ఇంటర్‌ఫేస్(UPI)ని ఉపయోగించి వాట్సాప్ పేమెంట్ ఫీచర్‌ను రూపొందించింది. ఇది 160కి పైగా బ్యాంకుల ఖాతాల నుండి పేమెంట్స్ జరుపుకోవచ్చు. వాట్సాప్ ఐసీఐసీఐ, హెచ్‌డీఎఫ్‌సీ, యాక్సిస్, ఎస్బీఐ, జియో పేమెంట్ బ్యాంకుతో జత కట్టింది. పది ప్రాంతీయ భాషల్లో ఈ వాట్సాప్ పేమెంట్స్ అందుబాటులోకి వచ్చింది. చెల్లింపులకు మరింత భద్రత ఉండేలా త్వరలో వాట్సాప్ యూపీఐని తీసుకు రానున్నారు.

అప్ డేట్ చేసుకోవాలి

అప్ డేట్ చేసుకోవాలి

వాట్సాప్ ద్వారా డబ్బులు పంపించడానికి భారత్‌లో బ్యాంకు ఖాతా, డెబిట్ కార్డు ఉండాలి. ఇందుకు సంబంధించిన ట్రాన్సాక్షన్ సమాచారాన్ని బ్యాంకులకు పంపిస్తుంది. యూపీఐ సపోర్ట్ చేసే ఎవరైనా వాట్సాప్ ద్వారా డబ్బులు పంపించవచ్చును. మనీ ట్రాన్స్‌ఫర్ సెక్యూరిటీ కోసం ప్రతి చెల్లింపు కోసం యూపీఐ పిన్ ఎంటర్ చేయాలి. అన్ని ఐవోఎస్, ఆండ్రాయిడ్ యూజర్లకు వాట్సాప్ పేమెంట్ అందుబాటులో ఉంటుంది. ఈ కొత్త ఫీచర్ అందుబాటులోకి రావడానికి యాప్‌ను అప్ డేట్ చేసుకోవాలి.

జుకర్ బర్గ్ ఏమన్నారంటే

జుకర్ బర్గ్ ఏమన్నారంటే

యూపీఐతో భారత్ ప్రత్యేకత సాధించిందని, భారత ఆర్థిక వ్యవస్థకు వెన్నుముక అయిన ఎంఎస్ఎంఈ వ్యాపారాల్లో కొత్త అవకాశాలను సృష్టిస్తోందని, ఇలాంటి ఘనత సాధించిన తొలి దేశం భారత్ అని జుకర్ బర్గ్ అన్నారు. ఇందులో తాము కూడా భాగస్వాములం కావడం, డిజిటల్ ఇండియాకు తమ వంతు సహకారం అందించే అవకాశం రావడం ఆనందంగా ఉందన్నారు. వాట్సాప్ ద్వారా డబ్బు పంపించడం, సందేశాలు పంపించినంత సులభమన్నారు.

More From GoodReturns

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+