కర్ణాటక టెక్ హబ్ అయినా ఎందుకు పెట్టుబడిదారులు వెనక్కు తగ్గుతున్నారు? కారణం ఇదే!

కర్ణాటక రాష్ట్రం అంటే చాలా మంది పెట్టుబడులకు హాట్‌స్పాట్‌గా భావిస్తారు. స్కిల్డ్ వర్క్‌ఫోర్స్, బలమైన టెక్నాలజీ వాతావరణం, మంచి లొకేషన్ ఇవన్నీ కర్ణాటకను పెట్టుబడిదారుల కలల గమ్యస్థానంగా చూపిస్తాయి. కానీ వాస్తవ పరిస్థితులు మాత్రం అంత స్నేహపూర్వకంగా లేవని ప్రముఖ పారిశ్రామికవేత్త డి. మురళీధర్ పేర్కొన్నారు.

మురళీధర్ చెప్పిన ప్రకారం కొత్త పెట్టుబడిదారులు ఎదుర్కొంటున్న పెద్ద సమస్యలలో ఒకటి భూమి లభ్యత మరియు దాని ధరలు. అందుబాటులో ఉన్న పారిశ్రామిక భూమి చాలా తక్కువగా ఉంది. దాన్ని కొనుగోలు చేయడం లేదా సేకరించడం చాలా క్లిష్టమైన ప్రక్రియ, అని ఆయన చెప్పారు. అదనంగా విద్యుత్ సరఫరా సమస్యలు కూడా పరిశ్రమల పనితీరును ప్రభావితం చేస్తున్నాయని పేర్కొన్నారు.

What s stopping industries from investing in Karnataka The hidden hurdles revealed

ఇంకా ఒక పెద్ద ఇబ్బంది గ్రామ పంచాయతీ పన్నులు. చిన్న మరియు మధ్య తరహా కంపెనీలు ఈ పన్నులతో తీవ్రంగా ఇబ్బంది పడుతున్నాయని ఆయన అన్నారు. అంతేకాదు, బెంగళూరు మరియు పరిసర ప్రాంతాల్లో వ్యాపారం చేయడం చాలా ఖరీదైనదై పోయిందని చెప్పారు. "పొరుగు రాష్ట్రాలతో పోలిస్తే ఇక్కడ వ్యాపార వ్యయాలు చాలా ఎక్కువగా ఉన్నాయి," అని ఆయన అభిప్రాయ పడ్డారు.

ముఖ్యంగా, ప్రభుత్వ యంత్రాంగం ప్రవర్తన పెట్టుబడిదారుల పట్ల అంత సానుకూలంగా లేదని ఆయన నేరుగా చెప్పారు. "కాగితాల పై పెట్టుబడులకోసం ఎంత వాగ్దానం చేసినా, నేలమీద పరిస్థితి అంతా భిన్నంగా ఉంటుంది," అని మురళీధర్ వ్యాఖ్యానించారు. కొత్త పరిశ్రమలు ఇప్పటికీ విధాన పరమైన ఆలస్యం, క్లారిటీ లేకపోవడం, అధికారుల వ్యక్తిగత నిర్ణయాలు వంటి సమస్యలతో ఇబ్బంది పడుతున్నాయని అన్నారు.

డిజిటల్ వ్యవస్థల పనితీరు పై కూడా ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. "ప్రభుత్వం చెప్పే ఆన్‌లైన్ సిస్టమ్స్ చాలా సార్లు పనిచేయవు. కొద్ది మంది అధికారులకే వాటిని ఎలా వాడాలో తెలుసు. ఇది మోసానికి అవకాశం కల్పిస్తోంది," అని ఆయన అన్నారు. 'సింగిల్ విండో క్లియరెన్స్' వ్యవస్థ కూడా వాస్తవంగా పనిచేయడం లేదని ఆయన పేర్కొన్నారు. పెట్టుబడిదారులు ఇంకా అనుమతుల కోసం విభాగాల తలుపులు తట్టాల్సి వస్తోంది," అని ఆయన అన్నారు. తమిళనాడు, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు పెట్టుబడిదారులను ఆకర్షించేందుకు కొత్త విధానాలు తీసుకొస్తున్నందున కర్ణాటక కూడా ఒక అడుగు ముందుకు వేయాలని సూచించారు.

మురళీధర్ చివరిగా చెప్పిన ముఖ్యమైన సూచన ఏమిటంటే పెట్టుబడుల కోసం ప్రత్యేక మంత్రిత్వశాఖ ఏర్పాటు చేయడం. అన్ని విభాగాల మధ్య సమన్వయం చేసుకునే, పెట్టుబడిదారుల సమస్యలను వేగంగా పరిష్కరించే ఒకే ఒక్క బాధ్యతగల అధికారి ఉంటే చాలా సమస్యలు సులభంగా పరిష్కరించవచ్చు, అని ఆయన అభిప్రాయపడ్డారు. మొత్తానికి, కర్ణాటక పెట్టుబడిదారులకు ఆకర్షణీయంగా కనిపించినా, నేలమీద ఎదురయ్యే అడ్డంకులు దాన్ని నిజంగా "ఇన్వెస్టర్-ఫ్రెండ్లీ" రాష్ట్రంగా నిలపడంలో అడ్డుగా మారుతున్నాయి.

More From GoodReturns

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+