భారతదేశంలో ఐటీ రంగాన్ని నమ్ముకున్న కోట్లాది మందికి టీసీఎస్ ఒక్కసారిగా షాక్ ఇచ్చింది. ఎక్కువ జీతాలు, కార్పోరేట్ జీవితం గడపవచ్చనే భ్రమలన టీసీఎస్ ఒక్కసారిగా తొలగించింది. టెక్ కార్పోరేట్ ప్రపంచం అంతా ఓ మాయా ద్వీపమని చాటి చెప్పింది. టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (TCS) తాజాగా ప్రకటించిన ఉద్యోగాల కోత టెక్ రంగంలో రావాలనుకునే వారికి ఒక పెద్ద కరెంట్ షాక్ లాంటిదని చెప్పుకోవచ్చు. TCS తొలగింపులు ప్రస్తుతం భారత ఐటీని కుదిపేస్తున్నాయి. TCS తొలగింపుల ప్రభావంతో విప్రో, ఇన్ఫోసిస్ తో పాటుగా మరో 37 ఐటీ కంపెనీల స్టాక్స్ ఈరోజు పడిపోయాయి
ప్రపంచవ్యాప్తంగా 613,000 మందికి పైగా ఉద్యోగులు ఉన్న ఐటీ దిగ్గజం టీసీఎస్..మార్చి 2026 నాటికి దాదాపు 12 వేల ఉద్యోగాలను తొలగించనున్నట్టు ప్రకటించింది. ఈ ప్రకటన టెక్ రంగంలొ ఒక్కసారిగా కలకలం రేపింది. ఇది సంస్థ మొత్తంలో సుమారు 2 శాతంగా ఉంది. ఈ చర్య టెక్ రంగంలో ఉద్యోగ భద్రతపై ఉన్న నమ్మకాన్ని పూర్తిగా తుడిచిపెట్టేసిందని చెప్పవచ్చు.

టీసీఎస్ ప్రకటించిన తాజా తొలగింపులు ప్రధానంగా మధ్య, సీనియర్ స్థాయి ఉద్యోగులను లక్ష్యంగా చేసుకున్నాయి. ముఖ్యంగా లెగసీ టెక్నాలజీల్లో పని చేస్తున్నవారు తీవ్రంగా ప్రభావితం కానున్నారు. అలాగే క్లయింట్కు నేరుగా సంబంధం లేని పాత్రల్లో ఉన్నవారు కూడా తమ ఉద్యోగాలను కోల్పోనున్నారు.ఇంకా ప్రాజెక్ట్ మేనేజర్లు కూడా దీని ప్రభావానికి లోనవుతున్నారు. ఇక ఏఐ వాతావరణానికి అందిపుచ్చుకోకపోతే వారికి భవిష్యత్తులో అవకాశాలు మరింత తగ్గినట్లేనని చెప్పవచ్చు.
దూసుకొస్తున్న AI ప్రభావమే ఈ మార్పుల వెనుక ముఖ్యమైన కారణంగా TCS కంపెనీ పేర్కొంది. సంస్థ భవిష్యత్తులో వచ్చే మార్పులకు సిద్ధంగా ఉండేందుకు తన వర్క్ఫోర్స్లో మార్పులు చేర్పులు చేస్తోంది. ఈ క్రమంలోనే బెంచ్ పాలసీ కూడా చాలా కఠిన తరంగా మార్చింది. ఒక ఉద్యోగి ఏడాదిలో 35 రోజులకు మించి ప్రాజెక్టులో లేకున్నా.. తిరిగి కేటాయింపు లేకపోతే అతడిని కంపెనీ నుంచి బయటకు పంపిస్తోంది.
టీసీఎస్ తీసుకున్న తాజా ప్రకటనపై ఉద్యోగుల నుండి పలు రకాల స్పందనలు వచ్చాయి. కోల్కతాకు చెందిన అభిషేక్ సుర్ లింక్డ్ఇన్లో స్పందిస్తూ.. ఒకప్పుడు TCS అంటే ప్రభుత్వ ఉద్యోగం లాంటిదని అనుకున్నాం. కానీ ఇప్పుడు ఎవరికీ భద్రత లేదని తేల్చి చెప్పారు.దిగ్గజ సంస్థలు కూడా ఇందుకు మినహాయింపు కావన్నారు.
ఆర్ఠిక సలహాదారు కానన్ బహ్ల్ టీసీఎస్ తొలగింపులపై స్పందిస్తూ..టీసీఎస్ 12 వేల మందిని తొలగించడం అనేది ఓ హెచ్చరిక లాంటిది. 45 ఏళ్ళే అనేది ఇప్పుడు కొత్త 60 ఏళ్ళకు చేరుకుందన్నారు. ఇప్పుడు ఉద్యోగులు చేయాల్సింది.. 12 నెలల అత్యవసర నిధిని సిద్ధం చేసుకోవడం, వ్యక్తిగత ఆరోగ్య, టర్మ్ ఇన్సూరెన్స్ కలిగి ఉండటం, AI వంటి రంగాల్లో నైపుణ్యాలను పెంచుకోవడం అత్యవసరమని నొక్కి చెప్పారు.క్లుప్తంగా చెప్పాలంటే AI రాకతో అది ఎటువంటి ఉద్యోగాలు తీయడం లేదు. AIని సద్వినియోగం చేసేవారు లేదా కంపెనీలు మాత్రమే ఉద్యోగాలు తీస్తున్నారని వ్యాఖ్యానించారు.
ఇప్పటికే విప్రోలో పనితీరు పరీక్షలు, HCLTechలో ఆటోమేషన్ వల్ల ఉద్యోగాల కోత వంటి మార్పులు ఐటీలో కలకలం రేపతుండగా టీసీఎస్ దాన్ని మరింతగా పెంచింది. ఇక ఇంటెల్ కూడా 25 వేల మంది ఉద్యోగులను ఇంటికి సాగనంపుతుందనే వార్తలు కూడా ఐటీ రంగం సంక్షోభం దిశగా పయనిస్తుందనే సంకేతాలను పంపిస్తోంది. CS లేఆఫ్స్ ఈ మార్పు దిశలో ఒక ఆరంభం మాత్రమే.. ముందు ముందు ఐటీ రంగంలో ఎలాంటి మలుపులు ఉంటాయో చూడాలి.
More From GoodReturns

IT Jobs: ఐటీ కొలువుల్లో AI కలకలం.. ఇక ఫ్రెషర్లకు ఉద్యోగాలు దొరకడం కష్టమేనా?

అమెరికాలో ఛాయ్ వాలాగా మారిన భారత ఐటీ ఉద్యోగి.. రోజూ వారి సంపాదన చూస్తే కళ్లు బైర్లు కమ్మాల్సిందే..

రూ. 6 వేల కోట్లకు చేరిన సుందర్ పిచాయ్ జీతం..గూగుల్ తాజాగా వేతన ప్యాకేజీ ఎంత పెంచిందంటే..

కొంపలు ముంచుతున్న ఇరాన్ యుద్ధం.. కొనేవారు లేక దుబాయ్లో కుప్పలు కుప్పలుగా పడిన బంగారం ..

బంగారంపై షాకిస్తున్న వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ రిపోర్ట్.. వచ్చే 15 రోజులు పసిడి ప్రియుల గుండెల్లో దడదడ..

బంగారం ధరలు పతనం కాబోతున్నాయి.. వెనిజులా బంగారంపై కన్నేసిన అమెరికా.. ట్రేడ్ డీల్ క్లోజ్..

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

బంగారం ధరలు ఈ స్థాయికి వస్తేనే కొనడానికి వెళ్లండి.. పసిడి ధరలపై ఆర్థిక నిపుణులు కీలక సూచన..

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..

Hyderabad: హైదరాబాద్లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?



Click it and Unblock the Notifications