బడ్జెట్ వస్తోందంటే చాలు సంపన్నుల నుంచి సామాన్యుల వరకు తమకు ప్రయోజనం కలిగే ఏదో ఒక ప్రకటన వెలువడక పోతుందా అని ఎదురు చూస్తుంటారు. తమకు అనుకూలంగా ప్రకటన ఉంటే సంబరపడి పోతారు. ప్రతికూలంగా ఉంటే నిరాశ చెందుతారు. కొన్ని ప్రకటనల గురించి కొంత మందికి అర్థం కూడా కాదు. కొన్ని ప్రకటనలు మాత్రం ఎంతో ఆలోచింపజేస్తాయి. అప్పుడు ఇలాంటి సలహా ఎవరు ఇచ్చారా అని తెలుసుకునే ప్రయత్నం చేస్తాం. తమకు ఒక అవకాశం లభిస్తే తమ ఆలోచనను కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకువెళతామని కొంతమంది భావిస్తుంటారు. అయితే ఆ అవకాశం కొంత మందికి మాత్రమే ఉంటుందని తెలుసుకుని నిరాశ చెందుతారు. కానీ ఇప్పుడు ప్రభుత్వాల ఆలోచనా ధోరణి మారుతోంది. ప్రజల నుంచి మరింత విస్తృతంగా సలహాలు, సూచనలు తీసుకొని వాటిలో ప్రయోజనకరంగా ఉన్న వాటిని బడ్జెట్ లో చేర్చాలని ప్రభుత్వం భావిస్తోంది. ఈ సారి బడ్జెట్ లో ప్రజల నుంచి సలహాలు సూచనలు కోరుతున్నారు. మీరు కూడా ఇందులో పాల్గొనవచ్చు.

20వ తేదీ వరకు గడువు
* దేశంలోని మెజారిటీ ప్రజలు కోరుకునేది పన్నుల భారాన్ని ప్రభుత్వం తగ్గించాలని. ముఖ్యంగా ఆదాయ పన్ను ను తగ్గిస్తే చాలా మందికి ఎంతో ఉపశమనం లభిస్తున్నది. పన్ను ప్రయోజనాలను మరింతగా పెంచితే బాగుండు అని కొందరు ఆశిస్తారు. ఇల్లు కొనుగోలు చేయాలనుకునే వారి ఆశలు మరో విధంగా ఉంటాయి. ఇలా సమాజంలోని ఒక్కో వ్యక్తి ఆశ ఒక్కో విధంగా ఉంటుంది. ఇలాంటి వాటి గురించే కాకుండా ప్రభుత్వానికి మంచి ఆలోచనలు లేదా సలహాలను తెలియజేయవచ్చు. ఈ సలహాలను ప్రభుత్వానికి వచ్చే నెల 20వ తేదీ వరకు తెలియజేయవచ్చు.
* ఎలా తెలియజేయాలంటే.. myGov.in వెబ్ సైట్ లోకి ఎంటర్ అయితే అందులో ఇన్విటింగ్ ఐడియాస్ అండ్ సజెషన్స్ ఫర్ యూనియన్ బడ్జెట్ 2020-2021 అని ఉంటుంది. దీని ద్వారా మీరు మీ సలహాలను ప్రభుత్వం దృష్టికి తీసుకు వెళ్ళవచ్చు. అంతే కాకుండా ఆర్ధిక మంత్రిత్వ శాఖకు చెందిన @FinMinIndia ట్విట్టర్ ఖాతా ద్వారా కూడా తెలియజేయవచ్చు. ట్విట్టర్ ద్వారా ఇప్పటికే అనేక మంది పౌరులు ప్రభుత్వానికి తమ వినతులను తెలియజేస్తున్నారు.
* ఆదాయ పన్ను, ఫైనాన్స్, జీఎస్టీ, ఉపాధి, ఎంట్రప్రెన్యూయర్షిప్, రైల్వేస్, రైతులు, మౌలిక సదుపాయాలు, వ్యవసాయం, ఆరోగ్యం, విద్యా వంటి వాటికి సంబంధించి సలహాలు అందించవచ్చు.

సమ్మిళితంగా...
* బడ్జెట్ రూపకల్పనకు ముందు కేంద్ర ఆర్ధిక మంత్రి పారిశ్రామికవేత్తలు, ఆర్ధిక వేత్తలు, రైతులు, వ్యాపారులు, కేంద్ర నాయకులు, పారిశ్రామిక సంఘాలతో సమావేశం అవుతుంటారు. వారి సమస్యలు వింటారు. ఎలాంటి ప్రకటనలను కోరుకుంటున్నారు. తెలుసుకుంటారు. ఇది ప్రతి ఏడాది జరుగుతుంది. ఈ ఏడాది ఈ ప్రక్రియను మరింత సమ్మిళితం చేసే ఉద్దేశంతో సామాన్య పౌరులు కూడా తమ సలహాలను చాలా సులభంగా తెలియజేసే అవకాశాన్ని కల్పిస్తున్నారు. మొబైల్ ఫోన్ల విస్తృతి పెరిగిపోయిన నేపథ్యంలో ఎక్కువ మంది తమ సలహాలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లే అవకాశం ఉంటుందని భావిస్తున్నారు.

ఫిబ్రవరి 1న బడ్జెట్
* వచ్చే ఫిబ్రవరి ఒకటో తేదీన కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ ను ప్రవేశ పెట్ట నున్నారు. ఈ బడ్జెట్ లో వ్యక్తిగత ఆదాయ పన్ను రేట్లను తగ్గించే అవకాశం ఉండవచ్చన్న అంచనాలు వెలువడుతున్నాయి. ఆర్ధిక వ్యవస్థ వృద్దికోసం ఇలాంటి ప్రకటన చేయవచ్చంటున్నారు. ఇక ఇన్వెస్టర్లలో జోష్ నింపేందుకు దీర్ఘకాలిక మూలధన లాభాలపై పన్నును తగ్గించవచ్చంటున్నారు. ఈసారి బడ్జెట్ పై అన్ని రంగాలు వర్గాలు ఆశలతో ఉన్నాయి.
More From GoodReturns

బంగారం ధరలు ఈ స్థాయికి వస్తేనే కొనడానికి వెళ్లండి.. పసిడి ధరలపై ఆర్థిక నిపుణులు కీలక సూచన..

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

Hyderabad: హైదరాబాద్లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..

ప్రయోగశాలలో పండించిన బంగారం వచ్చేస్తోంది.. ఇక పసిడి తవ్వకాలకు గుడ్ బై చెప్పడమే..

ఒక్కసారిగా తగ్గిన బంగారం ధర .. తగ్గిన రేట్లతో పసిడి ప్రియుల్లో జోష్.. మార్చి 9, సోమవారం ధరలు ఇవే..

Stock market: స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు అలర్ట్.. సోమవారం భారీ పతనం తప్పదా?

బంగారం ధరలు: క్రూడ్ ఆయిల్ పతనం తర్వాత బంగారం, వెండి ధరలు ఇలా..

Gold: నిశ్శబ్దంగా ఉన్న బంగారం మార్కెట్.. బ్యాంకుల వ్యూహం మారింది, ఇన్వెస్టర్లు జాగ్రత్త!



Click it and Unblock the Notifications