Vodafone Idea 5G: దేశంలో 5జీ విస్తరణకు మేజర్ టెలికాం కంపెనీలు విస్తృతంగా ప్రయత్నించటంతో పాటు కస్టమర్లను ఆకర్షించేందుకు ప్రయత్నిస్తున్నాయి. అయితే ఇక్కడ ఉన్న పెద్ద సమస్య చాలా మంది వినియోగిస్తున్న 4జీ హ్యాండ్ సెట్స్. దీంతో ఇటీవల కాలంలో పెద్ద టెలికాం ఆపరేటర్లైన జియో, ఎయిర్ టెల్ కూడా తమ ఫోకస్ 5జీ విస్తరణ నుంచి 4జీని బలపరచటంపైకి మార్చేశాయి.
ఈ క్రమంలోనే చాపకింద నీరులా వొడాఫోన్ ఐడియా 5జీ లాంచ్ కోసం చురుకుగా ప్రయత్నాలు స్టార్ట్ చేసింది. కంపెనీ మార్చి 2025 నాటికి దిల్లీ, ముంబై నగరాల్లో తొలుత 5జీ సేవలను లాంచ్ చేయాలని యోచిస్తోంది. జియో, ఎయిర్ టెల్ కంపెనీలకు పోటీగా ముందుగా మెట్రో నగరాలతో పాటు ప్రధాన పట్టణ ప్రాంతాలపై దృష్టి సారించి 17 ప్రాంతాలలో 5G సేవలను అందుబాటులోకి తీసుకొస్తున్నట్లు కంపెనీ చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్ జగ్బీర్ సింగ్ వెల్లడించారు. ప్రస్తుతం దేశంలో యూజర్లు ఎక్కువగా 4జీ కనెక్టివిటీని వినియోగిస్తుండగా జూన్ 2024 నాటికి వొడఫోన్ ఐడియా 90 శాతం ప్రజలకు చేరుకోవాలని లక్ష్యంగా పెట్టుకున్న సంగతి తెలిసిందే.

ప్రస్తుతం వొడఫోన్ ఐడియా దేశంలోని 77 శాతం మందికి తన 4జీ సేవలను అందిస్తోంది. దీని ద్వారా ఒక బిలియన్ కంటే ఎక్కువ మంది ప్రజలకు సేవలను చేరువచేసింది. ఈ క్రమంలో ప్రత్యర్థి ఆటగాళ్లకు బలమైన నెట్వర్క్ సేవలతో గట్టి పోటీ ఇవ్వాలని ప్లాన్ చేస్తోంది. దాని పునరుద్ధరణ ప్రణాళికలో భాగంగా, ఫాలో-ఆన్ పబ్లిక్ ఆఫర్ నుంచి రూ.18,000 కోట్లతో సహా ఈక్విటీ ఫండింగ్ ద్వారా Vi రూ.24,000 కోట్లను సేకరించింది. ఈ డబ్బులో ఎక్కువ భాగం దాని 4G నెట్వర్క్ను మెరుగుపరచడానికి, 5G సేవలను ప్రారంభ మద్దతుకు ఉపయోగిస్తోంది. బిర్లాలు భాగస్వామం కలిగిన కంపెనీ జియో అరంగేట్రానికి ముందు మార్కెట్లో ఒక వెలుగు వెలిగిన సంగతి తెలిసిందే.
ప్రస్తుతం కొనసాగుతున్న నెట్వర్క్ అప్గ్రేడ్ పనులు కొనసాగుతున్న వేళ ఇది పూర్తయితే Vi సబ్స్క్రైబర్లను కోల్పోవడం ఆగిపోతుందని సింగ్ నమ్మకంగా ఉన్నానన్నారు. పెరుగుతున్న డిమాండ్ను నిర్వహించడానికి తన 4G నెట్వర్క్ను విస్తరించడంపై దృష్టి సారిస్తోంది. ఈ క్రమంలో కంపెనీ ప్రత్యేకంగా 900 MHz బ్యాండ్పై దృష్టి సారించింది. ఇది మెరుగైన కవరేజీని అందిస్తుందని ముఖ్యంగా పట్టణ ప్రాంతాల్లో మెరుగైన కవరేజీ అందిస్తుందని కంపెనీ భావిస్తోంది. ఇదే క్రమంలో కంపెనీ తన టవర్ల సంఖ్యను 55 వేల నుంచి లక్షన్నరకు పెంచాలని నిర్ణయించింది. ఈ క్రమంలో ఇప్పటి వరకు 50 వేల కొత్త సైట్లు సిద్ధంగా ఉండగా, మరిన్న రానున్న కాలంలో సంసిద్ధం చేసే పనిలో కంపెనీ ఉంది. దీనికి తోడు ఇండస్ టవర్స్, ATC, టవర్ విజన్ వంటి ప్రధాన టవర్ ప్రొవైడర్లతో భాగస్వామ్యం కలిగిఉంది. అలాగే కంపెనీ ప్రస్తుతం చైనా నెట్ వర్క్ పరికరాలను రీప్లేస్ చేయాలని చూస్తోంది.
More From GoodReturns

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

బంగారం ధరలు ఈ స్థాయికి వస్తేనే కొనడానికి వెళ్లండి.. పసిడి ధరలపై ఆర్థిక నిపుణులు కీలక సూచన..

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..

Hyderabad: హైదరాబాద్లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..

ఒక్కసారిగా తగ్గిన బంగారం ధర .. తగ్గిన రేట్లతో పసిడి ప్రియుల్లో జోష్.. మార్చి 9, సోమవారం ధరలు ఇవే..

Stock market: స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు అలర్ట్.. సోమవారం భారీ పతనం తప్పదా?

బంగారం ధరలు ఈ రోజు కూడా తగ్గాయి.. కొనుగోలుపై బులియన్ నిపుణులు కీలక సూచన.. మార్చి 5, గురువారం ధరలు ఇవే..

Gold: నిశ్శబ్దంగా ఉన్న బంగారం మార్కెట్.. బ్యాంకుల వ్యూహం మారింది, ఇన్వెస్టర్లు జాగ్రత్త!



Click it and Unblock the Notifications