విశాఖ ఉక్కు ప్లాంట్.. రూ. 2,400 కోట్ల విద్యుత్ బకాయిలను ఈక్విటీగా మార్చాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయం

విశాఖ ఉక్కు కర్మాగారానికి ఊరట లభించేలా కూటమి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. రూ. 2,400 కోట్ల విద్యుత్ బకాయిలను ఈక్విటీగా మార్చాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నిర్ణయం ప్లాంట్ ఆర్థిక పునరుద్ధరణకు కీలకమని రాష్ట్ర ప్రభుత్వం పేర్కొంది. ఈ ప్రణాళిక ద్వారా విశాఖ ఉక్కు కర్మాగారం (విశాఖ స్టీల్ ప్లాంట్/VSP) ఆర్థిక స్థిరత్వం సాధించి, దీర్ఘకాలికంగా నిలదొక్కుకునే అవకాశాలు పెరుగుతాయని విశాఖ గాజువాక ఎమ్మెల్యే మరియు టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు తెలిపారు.

ఆయన మాట్లాడుతూ ఈ నిర్ణయం కీలక పరిశ్రమలను బలోపేతం చేయడంలో ప్రభుత్వ నిబద్ధతను స్పష్టంగా చూపుతుంది. విద్యుత్ బకాయిలను ఈక్విటీగా మార్చడం వల్ల ప్లాంట్‌కు ఆర్థిక స్థిరత్వం లభిస్తుంది. కార్యాచరణ మరింత సులభతరం అవుతుంది. ఈ చర్య వల్ల సంస్థతో పాటు దానిపై ఆధారపడిన వేలాది కుటుంబాల జీవనోపాధి కూడా భద్రంగా ఉంటుందని అన్నారు. కేంద్ర ప్రభుత్వ సమన్వయంతో అమలు అవుతున్న పునరుద్ధరణ ప్రణాళికలో భాగంగా ఈ చర్య చేపట్టడం జరిగిందన్నారు. గతంలో ప్రకటించిన రూ. 11,500 కోట్ల ఆర్థిక ప్యాకేజీలో, ఇప్పటికే రూ. 9,500 కోట్లు రాష్ట్రీయ ఇస్పాత్ నిగమ్ లిమిటెడ్‌ (RINL) కు విడుదలయ్యాయి. తాజా నిర్ణయం ప్లాంట్ ఆర్థిక పునాదిని మరింత బలోపేతం చేస్తుందని ఆయన పేర్కొన్నారు.

Visakhapatnam Steel Plant VSP news Andhra Pradesh government AP government equity VSP power dues VSP electricity bills AP converts power dues VSP equity conversion Visakhapatnam Steel Plant updates RINL news Vizag Steel Plant news Andhra Pradesh industry news VSP financial restructuring AP government stake in VSP VSP bailout plan Vizag Steel latest news

కార్మిక సంఘాల ఆందోళనలపై స్పందిస్తూ.. ప్లాంట్‌కు క్యాప్టివ్ ఇనుప ఖనిజ గనులు లేకపోయినా అది నష్టాల్లో నడవదని తెలిపారు. 40 శాతం కంటే తక్కువ ఇనుము శాతం ఉన్న ఖనిజాలు వాణిజ్యపరంగా లాభదాయకం కావు. అయినప్పటికీ, ప్లాంట్ 60 శాతం ఉత్పత్తి సామర్థ్యంతో, రోజుకు 15 వేల మెట్రిక్ టన్నులు ఉత్పత్తి చేస్తూ బ్రేక్‌ఈవెన్ స్థాయికి చేరుకుంటుంది. మూడవ బ్లాస్ట్ ఫర్నేస్ ప్రారంభంతో ఉత్పత్తి క్రమంగా పెరుగుతోందని ఆయన వివరించారు.

కార్మికుల నిబద్ధతపై ప్రశంసలు కురిపించిన పల్లా.. ఉత్పాదకతను పెంచేందుకు కార్మికులు విశేషమైన కృషి చేస్తున్నారు. కానీ, కొన్ని గ్రూపులు తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేసి ఉద్యోగులను తప్పుదారి పట్టించే ప్రయత్నం చేస్తున్నాయని విమర్శించారు. గత పాలనలో జరిగిన అవకతవకలను ప్రస్తావిస్తూ.. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని తీవ్రంగా విమర్శించారు. గత ప్రభుత్వ నిర్లక్ష్యం, పేలవమైన పారిశ్రామిక విధానాలు, చెల్లింపుల్లో జాప్యం వల్ల Visakhapatnam Steel Plant రూ. 38,500 కోట్లకు పైగా అప్పుల్లో కూరుకుపోయింది. ఫలితంగా వేలాది ఉద్యోగాలు కోల్పోయాయి.పెట్టుబడులు తగ్గాయి, ఉక్కు రంగం నిలిచిపోయిందని ఆయన అన్నారు.

ప్లాంట్ ఏర్పాటుతో స్థానభ్రంశం చెందిన స్థానిక కార్మికులకు నియామకాల్లో ప్రాధాన్యత ఇవ్వాలి. కొత్త కాంట్రాక్టు వ్యవస్థ కింద కనీసం సగం ఉద్యోగాలు స్థానికులకు కేటాయించబడాలి. ప్రభుత్వం కొత్త సింగిల్-విండో కాంట్రాక్టు మోడల్‌ను మద్దతు ఇస్తోందని వివరించారు.గతంలో ఉన్న వందలాది కాంట్రాక్టర్ల స్థానంలో కేవలం 42 మంది మాత్రమే నియమించబడుతున్నారని, ప్రతి డివిజన్‌కు ఒక కాంట్రాక్టర్‌ ఉండే విధంగా వ్యవస్థ రూపొందించబడిందని ఆయన తెలిపారు. దీని ద్వారా నిధుల దుర్వినియోగం తగ్గి, కార్యకలాపాలు మరింత పారదర్శకంగా మారుతాయని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు.

More From GoodReturns

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+