Visakhapatnam Real Estate: ఆంధ్రప్రదేశ్ నగరం రియల్ ఎస్టేట్ రంగంలో దూసుకుపోతోంది. రాష్ట్రానికి హార్ట్ అయిన విశాఖపట్నంలో అయితే భూములు ధరలు ఒక్కసారిగా ఎగబాకాయి. వైజాగ్ కి ఏఐ డేటా సెంటర్ వస్తుందనే అంచనాల మధ్య భూముల రేట్లు అమాంతం పెరిగాయి. సామాన్యులకు అందుబాటులో లేని పరిస్థితి కూడా అక్కడ నెలకొంది. ఇప్పటిదాకా ఒక దశలో వరకు ఉన్న విశాఖపట్నం రియల్ ఎస్టేట్ మార్కెట్ ఇప్పుడు కొత్త దశలోకి అడుగుపెట్టింది.
ఇక్కడ పురాతనంగా ఉన్న 5 నుంచి 15 అంతస్థుల నివాస భవనాల స్థానంలో.. ఇప్పుడు 40 నుంచి 50 అంతస్థుల హై‑రైజ్ అపార్ట్మెంట్ ప్రాజెక్టులు ఎక్కువగా నిర్మితమవుతున్నాయి. దీని ప్రధాన కారణం ఏంటంటే.. భూమి ధరల భారీ పెరుగుదల. చిన్న ప్లాట్లు ఉండకపోవడం.. ప్రధాన ప్రాంతాల్లో భూమి ఖరీదు ఎక్కువ స్థాయికి చేరడమే డెవలపర్లను ఎత్తైన భవనాల నిర్మాణానికి ప్రేరేపిస్తోందని చెప్పవచ్చు.

విశాఖలో స్థల పరిమితులు అలాగే భూమి ధరల పెరుగుదల కారణంగా.. పెద్ద స్థాయి ప్రాజెక్టులకు మాత్రమే అందుబాటులో ఉంది. 5-15 అంతస్థుల ప్రాజెక్టులు నిర్మించడానికి భూమిని కొనడం ఆర్థికంగా కష్టతరమైంది కావడంతో డెవలపర్లు అటువైపు మొగ్గు చూపుతున్నారు. అందువలన హై‑రైజ్ అపార్ట్మెంట్ల నిర్మాణం ప్రధాన ఆప్షన్గా మారింది. భూమిని ఎక్కువ యూనిట్లుగా పంచి ప్రతి చదరపు అడుగు ధరను రూ. 1,000 నుంచి రూ. 1,500 మధ్య ఉంచడం.. అలాగే అమ్మకానికి తక్కువ ధరలో అందించడం కొనుగోలుదారులకు ఆకర్షణీయంగా మారుతుందని డెవలపర్లు చెబుతున్నారు.
ఇంకో కారణం ఏంటంటే.. కొనుగోలు‑దారుల అభిరుచులు మారడం. ఈ రోజుల్లో నివాస అభ్యర్థులు కేవలం ఇళ్లను మాత్రమే కోరుకోవడం లేదు. పార్కింగ్, జిమ్, బేసిన్, క్లబ్ హౌస్ వంటి ఆధునిక సౌకర్యాలు ఉన్న అపార్ట్మెంట్లను కోరుతున్నారు. వీటిని వారు సాధించడం ఎక్కువగా హై‑రైజ్ ప్రాజెక్టులలోనే సాధ్యమవుతుంది.
విశాఖలో ఇప్పుడు కొన్ని మైక్రో‑మార్కెట్లు వేగంగా అభివృద్ధి చెందుతున్నాయి. అవేంటంటే.. మధురవాడ‑కాపులుప్పాడ, ఆనందపురం‑కొమ్మాది, భోగాపురం‑భీమిలి, యెండాడ‑రుషికొండ. ఈ ప్రాంతాల్లో రోడ్ల విస్తరణ, ట్రాఫిక్ మార్గాల అభివృద్ధి, ఆధునిక ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏర్పాట్ల కారణంగా భూమి ధరలు రెండింతలు లేదా అంతకంటే ఎక్కువగానే పెరిగాయి.
ఇప్పటికే విశాఖలో 35 అంతస్థుల అపార్ట్మెంట్లు నిర్మాణం కొనసాగుతున్నాయి. అదనంగా ఇండియన్ నేవీ 41 అంతస్థుల సైలోర్స్ బ్లాక్ నిర్మాణంలో ఉంది. స్థానిక ప్రజలు ఇళ్ల కోసం ఇంకా వెతుకుతున్నారు. అయితే ధరల పెరుగుదల వలన కొందరు తక్షణంగా కొనుగోలు చేసేందుకు ముందున్నారు. IT, అనుబంధ రంగాల్లో వృద్ధి కూడా రియల్ ఎస్టేట్ను వేగవంతంగా ముందుకు తరలిస్తుంది.
హై‑రైజ్ నిర్మాణం ద్వారా ఒక వైపు భూమి వినియోగ సామర్థ్యం పెరుగుతుండగా.. మరొక వైపు అందుబాటులో ఇళ్ల ధరలు తగ్గుతున్నాయి. ఇది వేగంగా అభివృద్ధి చెందుతున్న నగరానికి సమన్వయంగా పనిచేస్తుందని రియల్ ఎస్టేట్ నిపుణులు చెబుతున్నారు. క్లుప్తంగా చెప్పాలంటే.. భూమి ధరలు పెరగడం, స్థల పరిమితులు, IT రంగ అభివృద్ధి, కొనుగోలు‑దారుల మారుతున్న అభిరుచులు కారణంగా విశాఖపట్నం రియల్ ఎస్టేట్ హై‑రైజ్, వర్టికల్ స్కైలైన్ వైపు పయనిస్తోంది. దూకుతోంది. నగరం భవిష్యత్తులో స్మార్ట్, ఎత్తైన నివాస భవనాల కేంద్రంగా మారబోతోంది.
డిస్క్లైమర్: ఈ వెబ్సైట్లోని అభిప్రాయాలు, సూచనలు పూర్తిగా వ్యక్తిగత విశ్లేషకులు లేదా ఇతర సంస్థలవి మాత్రమే. ఇవి Goodreturns.in లేదా Greynium Information Technologies Private Limited అధికారిక అభిప్రాయాలు కాదని గమనించగలరు.మేము ఈ విషయం యొక్క ఖచ్చితత్వం, సమగ్రత లేదా విశ్వసనీయతపై ఎటువంటి హామీ ఇవ్వడం కాని, అనుమతించడం కాని బాధ్యత వహించడం జరగదు. మేము ఎలాంటి పెట్టుబడి సలహా ఇవ్వము. అలాగే ఎటువంటి సెక్యూరిటీ కొనుగోలు లేదా అమ్మకాలు ప్రోత్సహించము. ఈ వెబ్సైట్లోని కథనం పూర్తిగా సమాచారం, విద్యా ప్రయోజనాల కోసమే అందించబడుతుంది. మీరు ఏదైనా పెట్టుబడి నిర్ణయం తీసుకునే ముందు, లైసెన్స్ పొందిన ఆర్థిక సలహాదారుల సహాయం తీసుకోండి. ఈ కథనాన్ని కేవలం సమాచారంగా మాత్రమే పరిగణించండి.
More From GoodReturns

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

బంగారంతో కొత్త గేమ్ మొదలుపెట్టిన రష్యా.. ఇరాన్ యుద్ధం వేళ భారీగా డబ్బులు పోగేసుకోవడానికి..

Bengaluru: బెంగళూరు వాసులకు గుడ్ న్యూస్! రెండో ఎయిర్పోర్ట్ ఎక్కడో క్లారిటీ వచ్చేసింది!

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?

Interest rates Hike: త్వరలో ప్రపంచవ్యాప్తంగా పెరగనున్న వడ్డీ రేట్లు.. మన EMIలు కూడా పెరుగుతాయా?

బంగారం, వెండి ధరలు పతనానికి ఇరాన్ యుద్ధం కారణం కాదు..సంచలన విషయాలు వెల్లడించిన బులియన్ నిపుణులు..

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

Bengaluru: ట్రాఫిక్ కష్టాలకు గుడ్ బై.. ఈ యువతి ఐడియా నెటిజన్లను ఆశ్చర్యపరుస్తోంది!



Click it and Unblock the Notifications