Adani News: అంతా గౌతమ్ అదానీ ప్లానేనా..? ఆ మూడు కంపెనీలకు వినోద్ అదానీ రాజీనామా..!
Vinod Adani: హిండెన్ బర్గ్ నివేదిక తర్వాత అదానీ ఎవ్వరూ ఊహించని నిర్ణయాలు తీసుకుంటున్నారు. అవును పరిణామాలను ఒకసారి పరిశీలిస్తే.. వేగంగా వ్యాపార విస్తరణ డీల్స్ చేసుకుంటూ పోయిన అదానీ దూకుడు తగ్గించారు. కొన్ని పవర్ డీల్స్ బిడ్డింగ్ నుంచి తప్పుకున్నారు.
అలాగే తనను నమ్మిన ఇన్వెస్టర్లలో భయాలను తొలగించేందుకు అనేక కోట్ల రుణాలను గడువు కంటే ముందుగానే చెల్లించటం ప్రారంభించారు. అదానీ గ్రూప్ కంపెనీలకు ఉన్న రెండు బిలియన్ డాలర్ల కంటే ఎక్కువ అప్పును ఇప్పటికే చెల్లించి రికార్డు సృష్టించారు. అలాగే విదేశీ పెట్టుబడులను భారీగా సమకూర్చుకున్నారు. ఇన్వెస్టర్లకు ఎలాంటి ఢోకా లేదని అభయహస్తం ఇస్తున్నారు.

ఈ తరుణంలో ఆయన సోదరుడు వినోద్ అదానీ కీలక పాత్ర ఉందని.. దానివల్లే అవినీతి జరిగిందంటూ అనేక ఆరోపణలు వచ్చాయి. ఆఫ్ షోర్ సూట్ కేస్ కంపెనీలను వినియోగించి డబ్బు రీరూట్ చేశారంటూ అభియోగాలు ఎదుర్కొంటున్నారు. ఈ క్రమంలో ఆయన ఆస్ట్రేలియా బొగ్గు గనుల కంపెనీలైన కార్మైఖేల్ రైల్ & పోర్ట్ సింగపూర్, కార్మైకేల్ రైల్ సింగపూర్, అబాట్ పాయింట్ టెర్మినల్ కు రాజీనామా చేశారు. అయితే సింగపూర్కు చెందిన అబాట్ పాయింట్ పోర్ట్ హోల్డింగ్స్ బోర్డులో కొనసాగుతున్నారు. గౌతమ్ అదానీ తనపై వస్తున్న ఆరోపణలను తిప్పికొట్టే క్రమంలోనే వినోద్ అదానీని పక్కకు తప్పించారని చాలా మంది భావిస్తున్నారు.
అదానీ గ్రూప్ను పర్యవేక్షించడంలో రెగ్యులేటర్ల వైఫల్యంపై విచారణకు కమిటీని సుప్రీంకోర్టు ఆదేశించిన కొద్ది రోజుల ముందు రాజీనామాలు జరిగటం అనేక అనుమానాలను కలిగిస్తోంది. అయితే వినోద్ అదానీ అకస్మాత్తుగా ఎందుకు రాజీనామా చేశారనే విషయంపై అదానీ గ్రూప్ అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయలేదు. ఫిబ్రవరి చివరిలో అదానీ కంపెనీల నిర్వహణపై అనేక ప్రశ్నలు తలెత్తగా షేర్లు భారీ పతనాన్ని చూశాయి.
ప్రస్తుతం అదానీ గ్రూప్- వినోద్ అదానీ మధ్య జరిగిన కొన్ని లావాదేవీలపై సెబీ విచారణ చేస్తోంది. అదానీ గ్రూప్ కంపెనీల స్టాక్ ధరలను పెంచేందుకు వినోద్ అదానీ ఆధ్వర్యంలోని డజన్ల కొద్దీ డమ్మీ కంపెనీలు అదానీ గ్రూప్ కంపెనీల్లో బిలియన్ డాలర్ల లావాదేవీలు జరిపాయని జనవరి 24న విడుదలైన హిండెన్బర్గ్ నివేదికలోని ప్రధాన ఆరోపణ. పైగా దుబాయ్ లోని అదానీ గ్రోబల్ కార్యాలయంలో రోజూ వినోద్ అదానీ కొంత సమయం గడుపుతారని ఇటీవల వార్తల్లో వెల్లడైంది.


Click it and Unblock the Notifications