వినాయక విగ్రహానికి రూ. 474.46 కోట్లు ఇన్సూరెన్స్.. దేశంలోనే ఇదే తొలిసారి.. ఎక్కడంటే..

vinayaka chaturthi 2025: భారతదేశంలో ఒక పండుగకు ఇంత పెద్ద మొత్తంలో బీమా తీసుకోవడం ఇదే తొలిసారి. ముంబైలోని జీఎస్‌బీ సేవా మండల్ మహా గణపతి..అత్యంత కాస్ట్ లీ గణేశుడి విగ్రహం గా ప్రసిద్ధి పొందింది. ఈసారి ఈ గణేశోత్సవానికి రూ. 474.46 కోట్ల భారీ బీమా కవర్ తీసుకున్నారు. గత సంవత్సరం (2024) ఇది రూ. 400.58 కోట్లుగా ఉండగా ఈసారి దాన్ని రికార్డు స్థాయిలో పెంచారు. ఈ బీమా కవర్‌ను న్యూ ఇండియా ఇన్సూరెన్స్ కంపెనీ అందించింది. అయితే, బీమా కోసం చెల్లించిన ప్రీమియం మొత్తాన్ని మండలి నిర్వహణ ఇంకా అధికారికంగా ప్రకటించలేదు.

జీఎస్‌బీ సేవా మండలి చైర్మన్ అమిత్ డి. పాయ్ తెలిపిన వివరాల ప్రకారం.. ఇందులో రూ. 67.03 కోట్లు బంగారం, వెండి, ఆభరణాలు, ఇతర విలువైన వస్తువుల రక్షణకు ఆల్ రిస్క్ పాలసీ కింద కవర్ చేశారు. ఇక రూ.2 కోట్లు భూకంపం, అగ్నిప్రమాదం, ఇతర ప్రత్యేక ప్రమాదాల కవర్లకు కేటాయించారు. ఇవి ఫర్నిచర్, కంప్యూటర్లు, CCTV కెమెరాలు, QR స్కానర్లు, పాత్రలు, పండ్లు, కూరగాయలు వంటి ఉత్సవంలో ఉపయోగించే సామాగ్రిని కవర్ చేస్తాయి.

Ganesh Chaturthi 2025 GSB Seva Mandal insurance GSB Ganpati 2025 Ganeshotsav Mumbai insurance record festival insurance India GSB Seva Mandal Ganesh Chaturthi Ganesh festival 2025 insured Mumbai Ganpati festival insurance GSB Mandal 474 46 crore cover most expensive Ganesh Chaturthi 2025 2025 474 46 vinayaka chaturthi 2025 vinayaka chaturthi

ఇక రూ. 30 కోట్లు ప్రజా బాధ్యత (పబ్లిక్ లయబిలిటీ) కోసం కేటాయించారు. దీని కింద పండళ్లు, స్టేడియం ప్రాంగణం, భక్తులకు సంభవించే ప్రమాదాల కవర్ ఉంటుంది.మరో 375 కోట్లు అతిపెద్ద మొత్తం స్వచ్ఛంద సేవకులు, వంటవారు, సెక్యూరిటీ సిబ్బంది, గాడీలు, చప్పల్ స్టాల్ కార్మికులు, వాలెట్ పార్కింగ్ సిబ్బంది వంటి ఉత్సవంలో పనిచేసే వేలాది మందికి వ్యక్తిగత ప్రమాద బీమా కింద కవర్ చేశారు. దీనికి అదనంగా, వేదిక ప్రాంగణానికి రూ. 43 లక్షల ప్రత్యేక బీమా తీసుకున్నారు.

జీఎస్‌బీ గణపతి విగ్రహం ఎంతో ప్రత్యేకమైనదిగా చెప్పుకోవచ్చు. ఇది 69 కిలోలకుపైగా బంగారు ఆభరణాలు, 336 కిలోల వెండితో అలంకరించబడుతుంది. ఈ ఆభరణాలను ఎక్కువగా భక్తులు, సేవకులు విరాళంగా ఇస్తారు. అందుకే దీనిని అత్యంత ధనిక గణేశుడు అని అంటారు. ముంబైలోని ఇతర గణేశ మండలాలతో పోలిస్తే జీఎస్‌బీ సేవా మండల్ ప్రత్యేకత ఏమిటంటే 24 గంటలపాటు పూజలు, అర్చనలు, అన్నదానాలు నిరంతరం కొనసాగుతాయి. ఇది రుగ్వేద సంప్రదాయం ప్రకారం జరిగే ఏకైక మండలిగా చెబుతారు.

జీఎస్‌బీ సేవా మండలి కేవలం ఉత్సవం మాత్రమే నిర్వహించదు. ప్రతి సంవత్సరం సమాజంలోని బలహీన వర్గాలకు విద్య, అభివృద్ధి అవకాశాలను అందిస్తుంది.అలాగే ప్రతి సంవత్సరం సమాజంలోని వెనుకబడిన వర్గాల పిల్లలకు విద్యను అందించడం ద్వారా వారి జీవితాలను మార్చే దిశగా కృషి చేస్తామని మండలి అధ్యక్షుడు అమిత్ పాయ్ తెలిపారు.

More From GoodReturns

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+