విజయవాడ నుంచి తిరుపతి మీదుగా బెంగళూరుకు వందే భారత్.. డిసెంబర్ 10 నుంచి పట్టాల పైకి..

దక్షిణ మధ్య రైల్వే తాజా ప్రకటన ప్రకారం.. విజయవాడ, బెంగళూరును నేరుగా అనుసంధానించనున్న కొత్త వందే భారత్ ఎక్స్‌ప్రెస్ సేవలు డిసెంబర్ 10న ప్రారంభమయ్యే అవకాశం ఉంది. ప్రారంభ తేదీపై తుది ధృవీకరణ త్వరలో రానున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు. ఈ రైలు ప్రధానంగా విజయవాడ - తిరుపతి - బెంగళూరు మార్గంలో నడుస్తూ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక మధ్య త్వరితగతి రవాణాకు మార్గం సుగమం చేయనుంది.

ఈ Vande Bharat రైలు సేవలను ప్రారంభించడానికి రైల్వే అధికారులు ప్రస్తుతం టైమ్ టేబుల్, సాంకేతిక తనిఖీలను పూర్తిచేస్తున్నారు. ప్రాథమిక ప్రణాళిక ప్రకారం, రైలు ఉదయం 5:15 గంటలకు విజయవాడ నుండి బయలుదేరి మధ్యాహ్నం 1:15 గంటలకు బెంగళూరుకు చేరుకుంటుంది. అంటే ఇప్పటివరకు 9-10 గంటలు పడుతున్న ప్రయాణ సమయం సగానికి పైగా తగ్గనుంది. వేగం, సౌకర్యం, ఆధునాతన సాంకేతికతపరంగా వందే భారత్ రైళ్లు దేశవ్యాప్తంగా ప్రజాదరణ పొందుతున్న నేపథ్యంలో..ఈ కొత్త సేవ రెండు ప్రతిష్టాత్మక నగరాల మధ్య ప్రయాణించే విద్యార్థులు, ఉద్యోగులు, వ్యాపారవేత్తలు, భక్తులకు ఎంతో అనుకూలంగా ఉంటుందని భావిస్తున్నారు.

Vijayawada Bengaluru Vande Bharat Express Vijayawada to Bengaluru Vande Bharat launch date Vande Bharat new route South India Vijayawada Bengaluru train timing Vijayawada Bengaluru Vande Bharat stops South Central Railway new Vande Bharat Indian Railways high speed train Vande Bharat latest news Andhra Pradesh Karnataka train connectivity Vijayawada Bengaluru travel time upcoming Vande Bharat trains 2025 Vijayawada train updates Bengaluru train updates Vijayawada Bengaluru express route map

ప్రత్యేకించి తిరుపతి మీదుగా నడుస్తుండటం ఈ సేవకు మరింత ప్రాధాన్యత తెచ్చిపెడుతోంది. తిరుమలలోని శ్రీ వెంకటేశ్వరస్వామి ఆలయాన్ని సందర్శించడానికి ప్రతి రోజు లక్షలాది మంది యాత్రికులు ప్రయాణిస్తారు. ఈ కొత్త రైలు సేవ వారికీ సౌకర్యవంతమైన, వేగవంతమైన ప్రయాణ ప్రత్యామ్నాయాన్ని అందిస్తుంది.

దక్షిణ మధ్య రైల్వే ఇప్పటికే ప్రకటించిన మరో కీలక నిర్ణయం..సికింద్రాబాద్-తిరుపతి వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌లో రైలు సామర్థ్యాన్ని పెంచడం. నవంబర్ 26 నుండి ఈ రైలులో 18 AC చైర్ కార్లు, 2 ఎగ్జిక్యూటివ్ కోచ్‌లు చేర్చబడతాయి. తద్వారా పెరుగుతున్న ప్రయాణీకుల డిమాండ్‌ను తీర్చగలుగుతారు. ఈ రెండు సేవల విస్తరణ మొత్తం దక్షిణ ప్రాంతంలో వేగవంతమైన రైలు సౌకర్యాల పురోగతిని సూచిస్తుంది.

విజయవాడ-బెంగళూరు వందే భారత్ రైలు రైల్వే మంత్రిత్వ శాఖ చేపట్టిన దేశవ్యాప్త ఆధునికీకరణ కార్యక్రమంలో భాగంగా నిలుస్తోంది. ఇటీవల మంత్రిత్వ శాఖ కేఎస్‌ఆర్ బెంగళూరు-ఎర్నాకులం వందే భారత్ వంటి పలు కొత్త సేవలను కూడా ఆమోదించింది. రాబోయే కాలంలో దక్షిణ భారతదేశం హై‌స్పీడ్, ప్రీమియం రైలు సేవల ప్రధాన కేంద్రంగా మారనుంది.

ప్రారంభ తేదీ సమీకృతం అవుతున్న కొద్దీ.. రైల్వే అధికారులు త్వరలో టికెట్ బుకింగ్ వివరాలు, ధరలు, స్టేషన్ల వివరాలు, పూర్తి కార్యాచరణ మార్గదర్శకాలను విడుదల చేయనున్నారు. ఆధునిక సౌకర్యాలతో కూడిన వందే భారత్ ఎక్స్‌ప్రెస్ ఈ ప్రాంతంలో రైల్వే ప్రయాణ అనుభవాన్ని కొత్తస్థాయికి తీసుకెళ్లనున్నదని నిపుణులు భావిస్తున్నారు.ఈ రైలు ప్రారంభం ద్వారా ఆర్థిక, విద్యా, పర్యాటక రంగాలు లాభపడతాయని, రాబోయే నెలల్లో ప్రయాణీకుల సంఖ్య గణనీయంగా పెరుగుతుందని అంచనా.

More From GoodReturns

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+