మల్టీబ్యాగర్ స్మాల్క్యాప్ స్టాక్ మిరాకల్..ఏడాదిలోనే డబుల్ సంపాదన.. విజయ్ కేడియా చిట్కాలు తెలుసుకోండి
భారత స్టాక్ మార్కెట్లో మల్టీబ్యాగర్ స్మాల్క్యాప్ స్టాక్లను ముందుగానే గుర్తించడంలో అత్యంత ప్రసిద్ధి పొందిన పెట్టుబడిదారుడు విజయ్ కేడియా.. ఈసారి మాత్రం అందరినీ ఆశ్చర్యపరిచే పెట్టుబడి ద్వారా తన డబ్బును ఒకే సంవత్సరంలో రెట్టింపు చేసుకున్నాడు. సాధారణంగా దాగి ఉన్న చిన్న కంపెనీలలో అవకాశాలను కనిపెట్టే కేడియా.. ఈసారి అలాంటి స్టాక్లో కాదు, వెండి ETFలో పెట్టుబడి పెట్టి భారీ లాభాలను పొందాడు. గత పన్నెండు నెలల్లో వెండి ధరలు అపూర్వమైన పెరుగుదల చూపించాయి. MCXలో వెండి ధర కిలోకు 1.9 లక్షలకు చేరుకోగా, అంతర్జాతీయ మార్కెట్లో ఔన్స్ ధర 60 డాలర్లను దాటింది. ఈ ర్యాలీ ప్రభావంతో కేడియా కొనుగోలు చేసిన వెండి ETF విలువ ఒకే సంవత్సరంలో రెట్టింపు అయింది.
ET మార్కెట్స్తో ఆయన మాట్లాడుతూ గత సంవత్సరం వెండి ETFలను కొనుగోలు చేశానని.. అప్పటి నుండి వాటి విలువ రెండింతలు పెరిగిందని చెప్పారు. బంగారం కూడా శక్తివంతమైన పెట్టుబడి సాధనమే అయినప్పటికీ వెండి మరింత బలమైన అవకాశాలను ఇస్తుందనే నమ్మకం తనకు ఉందని ఆయన వివరించారు. వెండి ధరల పెరుగుదల వెనుక అనేక కారణాలు ఉన్నాయి. పారిశ్రామిక అవసరం భారీగా పెరగడం వాటిలో ముఖ్యమైనది. సోలార్ ప్యానెల్స్, ఎలక్ట్రిక్ వాహనాలు, ఎలక్ట్రానిక్స్ వంటి రంగాలలో వెండి డిమాండ్ వేగంగా పెరుగుతుంటే, గనుల ఉత్పత్తి మాత్రం ఆ అవసరాలకు సరిపడే రీతిలో పెరగడం లేదు. దీనివల్ల మార్కెట్లో నిర్మాణాత్మక లోటు ఏర్పడింది.

రిలయన్స్ సెక్యూరిటీస్ విశ్లేషకుడు జిగర్ త్రివేది ప్రకారం.. మార్కెట్లో వెండి సరఫరా తీవ్రమైన స్థాయిలో తగ్గిపోయిందని, గ్లోబల్ స్టాక్లలో తగ్గుదల, లండన్లో స్పాట్ అందుబాటు బలహీనత, ETFలలో భారీగా నిధుల ప్రవాహం అన్నీ కలిసి ధరలను కొత్త గరిష్టాలకు నెట్టాయని పేర్కొన్నారు. సిల్వర్ ఇన్స్టిట్యూట్ కూడా వరుసగా ఐదవ సంవత్సరం వెండి మార్కెట్ లోటులోనే కొనసాగుతోందని ధృవీకరించింది. ఈ నేపథ్యంలో 2026 నాటికి వెండి ధరలు 70 నుండి 75 డాలర్ల వరకు పెరిగే అవకాశం ఉందని కోటక్ సెక్యూరిటీస్ అంచనా వేసింది.
చాలా సంవత్సరాలుగా విజయ్ కేడియా SMILE ఫ్రేమ్వర్క్ను అనుసరిస్తూ..పరిమాణంలో చిన్నదైనా, అనుభవంలో మధ్యస్థమైనా, ఆకాంక్షలో పెద్దదైనా, మార్కెట్ సామర్థ్యంలో ఏదైనా.. అటువంటి కంపెనీలను తన పోర్ట్ఫోలియోలో ఎంపిక చేస్తూ వచ్చాడు. అతుల్ ఆటో నుండి ఎలెకాన్ ఇంజనీరింగ్ వరకు అనేక కంపెనీలు అతన్ని మల్టీబ్యాగర్ పెట్టుబడిదారుడిగా నిలబెట్టాయి. అయినప్పటికీ ఇప్పుడు తన పోర్ట్ఫోలియోలో దాదాపు 10 నుంచి 12 శాతం విలువైన లోహాలకు కేటాయించడం పెట్టుబడి వ్యూహంలో ఉన్న కొత్త కోణాన్ని చూపిస్తోంది.
అయితే ఈ రంగంలో పెట్టుబడి పెరగడంతో Vijay Kedia జాగ్రత్తతో వ్యవహరిస్తున్నారు. వెండి మరిన్ని సంవత్సరాల్లో మళ్లీ రెట్టింపు కావచ్చని ఆయన నమ్ముతున్నప్పటికీ.. దానిలో పెద్ద మొత్తంలో పెట్టుబడి పెట్టలేదని స్పష్టం చేశారు. విలువైన లోహాలు పెరిగే చక్రం కొన్నిసార్లు ఐదు నుండి పది సంవత్సరాలు పడుతుందని ఆయన హెచ్చరించారు. ప్రస్తుతం మాత్రం వెండి ETF పెట్టుబడి విజయ్ కేడియాకు అద్భుతమైన ఫలితాన్ని ఇచ్చింది. చిన్న స్టాక్లలో మల్టీబ్యాగర్లు కనుగొనడంలో పేరుగాంచిన ఈ పెట్టుబడిదారుడు, ఈసారి విలువైన లోహంపై చేసిన పెట్టుబడి అద్భుతమైన ఫలితాలను అందించింది. భవిష్యత్లో ఈ ర్యాలీ కొనసాగుతుందా లేదా అనేది పారిశ్రామిక డిమాండ్ స్థాయిపై, గనుల ఉత్పత్తి పెరుగుదలపై ఆధారపడి ఉంటుందని చెప్పవచ్చు.
డిస్క్లైమర్: ఈ వెబ్సైట్లోని అభిప్రాయాలు, సూచనలు పూర్తిగా వ్యక్తిగత విశ్లేషకులు లేదా ఇతర సంస్థలవి మాత్రమే. ఇవి Goodreturns.in లేదా Greynium Information Technologies Private Limited అధికారిక అభిప్రాయాలు కాదని గమనించగలరు.మేము ఈ విషయం యొక్క ఖచ్చితత్వం, సమగ్రత లేదా విశ్వసనీయతపై ఎటువంటి హామీ ఇవ్వడం కాని, అనుమతించడం కాని బాధ్యత వహించడం జరగదు. మేము ఎలాంటి పెట్టుబడి సలహా ఇవ్వము. అలాగే ఎటువంటి సెక్యూరిటీ కొనుగోలు లేదా అమ్మకాలు ప్రోత్సహించము. ఈ వెబ్సైట్లోని కథనం పూర్తిగా సమాచారం, విద్యా ప్రయోజనాల కోసమే అందించబడుతుంది. మీరు ఏదైనా పెట్టుబడి నిర్ణయం తీసుకునే ముందు, లైసెన్స్ పొందిన ఆర్థిక సలహాదారుల సహాయం తీసుకోండి. ఈ కథనాన్ని కేవలం సమాచారంగా మాత్రమే పరిగణించండి


Click it and Unblock the Notifications


