IPO Multibagger: నాలుగు నెలలుగా స్టాక్ రాకెట్ స్పీడ్.. అదరగొడుతున్న ఐపీవో.. బ్రోకరేజ్ కొనమంటోంది
IPO Multibagger: ఈ మధ్య కాలంలో వచ్చిన చాలా కంపెనీలు అట్టర్ ఫ్లాప్ అయిన విషయం మనందరికీ తెలిసిందే. వాటి వల్ల చాలా మంది కస్టమర్లు తమ పెట్టుబడల సొమ్మును కోల్పోయారు. ఇలాంటి మార్కెట్ పరిస్థితుల్లో నాలుగు నెలల కిందట వచ్చిన ఒక ఐపీవో మాత్రం ఇన్వెస్టర్లకు ఊహించని రాబడులను అందిస్తోంది.
కంపెనీ వివరాలు..
ఇప్పటి వరకు మనం మాట్లాడుకున్నది వీనస్ పైప్స్ అండ్ ట్యూబ్స్ కంపెనీ గురించే. ఈ ఐపీవో నాలుగు నెలల కిందట మే 24న మార్కెట్లో లిస్ట్ అయింది. ఇష్యూ సమయంలో కంపెనీ షేర్ ధర రూ.326గా ఉంది. అప్పట్లో 4 శాతం ప్రీమియంతో రూ.337.50 కు జాబితా చేయబడింది. ఈ క్రమంలో స్టాక్ 92 శాతం పెరిగింది. ఈ రోజు స్టాక్ ధర బీఎస్ఈలో రూ.628.70గా ఉంది.
బ్రోకరేజ్ అంచనాలు..
స్టాక్ తాజాగా 52 వరాల గరిష్ఠ ధర అయిన రూ.652ను తాకింది. రానున్న కాలంలో కూడా కంపెనీ షేర్ ధర తన పరుగును కొనసాగిస్తుందని సెంట్రమ్ బ్రోకరేజ్ అంచనా వేసింది. అలా స్టాక్ కు రూ.764 స్థాయికి చేరుకుంటుందని వెల్లడిస్తూ BUY రేటింగ్ అందించింది. కంపెనీ ప్రస్తుతం దేశంలో రెండవ అతిపెద్ద తయారీదారుగా అవతరించిందని బ్రోకరేజ్ వెల్లడించింది. ప్రస్తుతం కంపెనీ EBITDA మార్జిన్ రత్నమణి పైప్స్ కంటే తక్కువగా ఉందని వెల్లడించింది.
వీనస్ కంపెనీ వ్యాపారం..
IPO నుంచి సేకరించిన నిధులను కంపెనీ ప్రాజెక్ట్ల కోసం ఉపయోగిస్తోంది. వీనస్ పైప్స్ & ట్యూబ్స్ గుజరాత్ కేంద్రంగా పనిచేస్తున్న కంపెనీ. ఇది స్టెయిన్లెస్ స్టీల్ పైప్స్, ట్యూబ్ల తయారీ, ఎగుమతి వ్యాపారంలో నిమగ్నమై ఉంది.ప్రస్తుతం కంపెనీ కెమికల్స్, ఇంజనీరింగ్, ఫెర్టిలైజర్స్, ఫార్మాస్యూటికల్స్, పవర్, ఫుడ్ ప్రాసెసింగ్, పేపర్, ఆయిల్ అండ్ గ్యాస్ వంటి రంగాల్లోని కంపెనీల అవసరాల కోసం వీనస్ బ్రాండ్ పేరుతో ఉత్పత్తులను సరఫరా చేస్తోంది.