Car Insurance: దేశంలో రోజురోజుకూ వాహనచట్టాలను ఉల్లంఘిస్తున్న వ్యక్తుల సంఖ్య విపరీతంగా పెరిగిపోతోంది. ప్రజలను ప్రభుత్వాలు ఎన్నిసార్లు దీనిపై అప్రమత్తం చేసినప్పటికీ వాహనదారుల్లో మాత్రం ఎలాంటి మార్పు రావటం లేదు. ఇన్సూరెన్స్ విషయంలో అప్రమత్తంగా ఉండని పరిస్థితిపై ఆందోళనలు పెరుగుతూనే ఉన్నాయి.
వివరాల్లోకి వెళితే దేశంలో తొలిసారిగా ఒడిశా ట్రాన్స్పోర్ట్ అథారిటీ వినూత్న ఆలోచనతో ముందుకొచ్చింది. చెల్లుబాటు అయ్యే ఇన్సూరెన్స్ పేపర్లు లేని వాహనదారులకు ఈపెనాల్టీలు అందించటానికి నిర్ణయించింది. దీనికోసం టోల్ ప్లాజాల వద్ద ఈ-డిటెక్షన్ వ్యవస్థను అందుబాటులోకి తీసుకొస్తోంది. మెుదటిసారి తప్పుచేసిన వ్యక్తులకు రూ.2,000 పెనాల్టీ విధించాలని అక్కడి ప్రభుత్వం నిర్ణయించింది. అలాగే 3 నెలల వరకు జైలు శిక్ష కూడా విధించే అవకాశం ఉన్నట్లు వెల్లడైంది.

ఒకసారి కంటే సార్లు ఇలా దొరికిన వాహనదారులపై రూ.4,000 పెనాల్టీ విధించనున్నట్లు వెల్లడించారు. 1988 మోటారు వాహనాల చట్టంలోని సెక్షన్ 146 ప్రకారం ప్రజా రహదారులపై నడిచే ప్రతి మోటారు వాహనానికి చెల్లుబాటు అయ్యే ఇన్సూరెన్స్ ఉండాల్సి ఉంది. వాస్తవానికి అనేక ప్రైవేట్, కమర్షియల్ వాహనాలు చెల్లుబాటు అయ్యే ఇన్సూరెన్స్ లేకుండా రోడ్లపై నడుస్తున్నాయి. దీని వల్ల రోడ్డు ప్రమాదాల బాధితులకు పరిహారం నిరాకరించబడుతుందని ఒడిశా ప్రభుత్వం ఆందోళన వ్యక్తం చేసింది. అయితే కొత్త వ్యవస్థతో చెల్లుబాటు అయ్యే ఇన్సూరెన్స్ లేని వారు ఏదైనా సంఘటన జరగడానికి ముందే ప్రతిదీ పొందేలా ఒడిశా ప్రభుత్వం నిర్ధారిస్తుంది.
వాస్తవానికి ఈడిటెక్షన్ వ్యవస్థను బిహార్ రాష్ట్రంలోని 32 టోల్ ప్లాజాల్లో ఇలాంటి వ్యవస్థను ఉంచింది. దీని ద్వారా పొల్యూషన్ సర్టిఫికెట్లు లేని వాహనాలను గుర్తించటానికి వినియోగిస్తున్నారు. పొల్యూషన్ సర్టిఫికెట్ లేదని గుర్తించిన వాహనాలకు రూ.10 వేలు పెనాల్టీ విధించబడుతోంది. ఈ వ్యవస్థలను ట్రయల్స్ కోసం ప్రవేశపెట్టినప్పుడు కేవలం 2 రోజుల్లోనే 5,000కి పైగా ఈ-చలాన్లు జారీ చేయబడినట్లు బీహార్ నివేదించింది. రానున్న రోజుల్లో ఈ వ్యవస్థను బీహార్ పాట్నా, ముజఫర్పూర్, భాగల్పూర్ సహా ఇతర స్మార్ట్ సిటీలకు విస్తరిస్తామని పేర్కొంది. దీనిని భవిష్యత్తులో దేశంలోని ఇతర రాష్ట్రాలు కూడా ఇలాంటి వ్యవస్థను వాహన చట్టాలను ఉల్లంఘించే వాహనదారులపై ప్రయోగించనున్నట్లు తెలుస్తోంది.
కేంద్రం కొత్త ప్రతిపాదన..
అందువల్ల ప్రస్తుతం దేశంలో రోడ్లపై తిరిగే ప్రతి వాహనం విషయంలో తప్పనిసరిగా ఇకపై థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ కలిగి ఉండేలా చూసే లక్ష్యంతో కేంద్ర రోడ్డు రవాణా మంత్రిత్వ శాఖ మోటార్ వాహనాల చట్టంలో నిబంధనలను సవరించాలని నిర్ణయించింది. దీనిని అమలులోకి తీసుకురావటానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నుంచి మద్ధతు అవసరమని తెలుస్తోంది. రానున్న రోజుల్లో రోడ్లపైకి థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ కాగితాలు లేని వాహనాలు తిరగటాన్ని తగ్గించేందుకు డేటా చాలా కీలకం. అందుకే ఫాస్ట్ట్యాగ్, ఇన్సూరెన్స్, పొల్యూషన్ సర్టిఫికేట్ వంటి వాటితో ఆధార్ కార్డులను లింక్ చేయాలనే ప్రతిపాదన కొనసాగుతోంది.
More From GoodReturns

బంగారం ధరలు పతనం కాబోతున్నాయి.. వెనిజులా బంగారంపై కన్నేసిన అమెరికా.. ట్రేడ్ డీల్ క్లోజ్..

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

Hyderabad: హైదరాబాద్లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..

పసిడి ప్రియులకు గుడ్ న్యూస్.. భారీగా తగ్గనున్న బంగారం, వెండి ధరలు.. కారణం ఏంటంటే..

బంగారం ధరలు ఈ రోజు కూడా తగ్గాయి.. 10 గ్రాములు ధర ఎంత తగ్గిందంటే.. మార్చి 3, మంగళవారం ధరలు ఇవే..

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..

Stock market: స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు అలర్ట్.. సోమవారం భారీ పతనం తప్పదా?

ఒక్కసారిగా తగ్గిన బంగారం ధర .. తగ్గిన రేట్లతో పసిడి ప్రియుల్లో జోష్.. మార్చి 9, సోమవారం ధరలు ఇవే..



Click it and Unblock the Notifications