Vedanta share: ప్రస్తుతం దేశంలోని చాలా కంపెనీలు తమ అప్పుల భారాన్ని తగ్గించుకోవడం కోసం సతమతమవుతున్నాయి. ఇటీవల అదానీ గ్రూప్ కంపెనీల విషయంలోనూ ఇన్వెస్టర్లు ఆందోళన చెందటానికి వెనుక అసలు కారణం కూడా అధిక రుణాలే. ఈ విషయంలో చాలా తెలివిగా ప్రవర్తించింది మాత్రం రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ అనే చెప్పుకోవాలి.

వేదాంత షేర్..
వరుసగా 8 ట్రేడింగ్ సెషన్ల నుంచి వేదాంత లిమిటెడ్ షేర్లు ఎరుపు రంగులోనే ఉన్నాయి. రానున్న కాలంలో గ్రూప్ 2 బిలియన్ డాలర్ల నిధులను సేకరించటం ప్రారంభం కానుందనే అంచనాల తరుణంలో స్టాక్ ఈ రోజు ఏకంగా 9 శాతం క్షీణించింది. ఇది సెప్టెంబర్ 16, 2022 తర్వాత షేర్ల ధరలో అతిపెద్ద పతనం.

స్టాక్ ట్రేడింగ్..
మధ్యాహ్నం 1.41 గంటల సమయంలో స్టాక్ 5.24 శాతం నష్టంలో రూ.272.30 ధర వద్ద ట్రేడవుతోంది. ఉదయం ట్రేడింగ్ సెషన్లో స్టాక్ ఐదు నెలల కనిష్ఠ ధర అయిన రూ.262ను తాకింది. గత ఎనిమిది రోజులుగా స్టాక్ ధర ఏకంగా 15 శాతం క్షీణించింది. 2023లో ఇప్పటి వరకు స్టాక్ ఏకంగా 13 శాతం వరకు క్షీణించింది.

రేటింగ్ సంస్థ ఏమందంటే..
గ్లోబల్ రేటింగ్స్ సంస్థ S&P మైనింగ్ బిలియనీర్ అనిల్ అగర్వాల్ నేతృత్వంలోని వేదాంత రిసోర్సెస్ గురించి ఒక నివేదికలో పేర్కొంది. సమీప భవిష్యత్తులో కంపెనీ 2 బిలియన్ డాలర్ల నిధులను సేకరించాలని చూస్తోందని అందులో తెలిపింది. దీనికోసం కంపెనీ ఇటీవల తన అంతర్జాతీయ జింక్ ఆస్తులను హిందుస్థాన్ జింక్ లిమిటెడ్ విక్రయించాలని యోచిస్తోంది. అయితే దీనికి భారత ప్రభుత్వం అంగీకరించలేదు. కేంద్రం మోకాలు అడ్డుపెడితే కంపెనీ క్రెడిట్ రేటింగ్ వెంటనే ఒత్తిడిని ఎదుర్కోవాల్సి ఉంటుందని రేటింగ్ సంస్థ స్పష్టం చేసింది.

కేంద్రం వాటాలు..
దాదాపు 20 ఏళ్ల కిందట ప్రైవేటీకరించబడిన హిందుస్థాన్ జింక్ లిమిటెడ్ కంపెనీలో కేంద్ర ప్రభుత్వానికి దాదాపు 29.54 శాతం వాటా ఉంది. అందువల్ల వేదాంత రిసోర్సెస్ తన ఆస్తులను విక్రయించాలనే ప్లాన్ కు ప్రభుత్వం అనుకూలంగా లేదు. ఆస్తుల మదింపుతో సహా ప్రభుత్వం అనేక ఆందోళనలను లేవనెత్తింది. ఈ ఆస్తులను వేదాంత రిసోర్సెస్ దాదాపు 3 బిలియన్ డాలర్లకు విక్రయించాలని చూస్తోంది.

కట్టాల్సిన అప్పులు..
కంపెనీకి జూలై-సెప్టెంబర్ మధ్య కేవలం 15 మిలియన్ డాలర్ల రుణ మెచ్యూరిటీలను కలిగి ఉంది. ఈ క్రమంలో కంపెనీ నిధులను అవసరమైన మేరకు సమీకరించకపోతో చెల్లింపుల తర్వాత నగదు కొరతను ఎదుర్కోవాల్సి ఉంటుందని తెలుస్తోంది. డిసెంబరు 31, 2023తో ముగిసే త్రైమాసికంలో 500 మిలియన్ డాలర్ల రుణ చెల్లింపులు, జనవరి 2024లో చెల్లించాల్సిన 1 బిలియన్ డాలర్ల బాండ్ చెల్లింపులు కంపెనీ ముందు ప్రస్తుతం ఉన్నాయి. మూడేళ్ల కాలంలో 4 బిలియన్ డాలర్ల రుణాన్ని తగ్గించుకునేందుకు నిబద్ధతతో ముందుకు సాగుతోందని సమాచారం.
More From GoodReturns

కొంపలు ముంచుతున్న ఇరాన్ యుద్ధం.. కొనేవారు లేక దుబాయ్లో కుప్పలు కుప్పలుగా పడిన బంగారం ..

బంగారంపై షాకిస్తున్న వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ రిపోర్ట్.. వచ్చే 15 రోజులు పసిడి ప్రియుల గుండెల్లో దడదడ..

బంగారం ధరలు పతనం కాబోతున్నాయి.. వెనిజులా బంగారంపై కన్నేసిన అమెరికా.. ట్రేడ్ డీల్ క్లోజ్..

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

బంగారం ధరలు ఈ స్థాయికి వస్తేనే కొనడానికి వెళ్లండి.. పసిడి ధరలపై ఆర్థిక నిపుణులు కీలక సూచన..

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..

Hyderabad: హైదరాబాద్లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..

ఒక్కసారిగా తగ్గిన బంగారం ధర .. తగ్గిన రేట్లతో పసిడి ప్రియుల్లో జోష్.. మార్చి 9, సోమవారం ధరలు ఇవే..



Click it and Unblock the Notifications