Anil Agarwal: దేశంలో రాజకీయ పార్టీలకు వ్యాపారులు, వ్యాపార సంస్థలు విరాళాలు ఇవ్వటం ఆనవాయితీగా వస్తూనే ఉంది. అయితే దీనిని కొంత ఆధునీకరించి బాండ్స్ అంటూ కొత్త విధానాన్ని బీజేపీ ప్రభుత్వ హయాంలో దేశంలో ప్రవేశపెట్టింది.
దేశంలోని ప్రఖ్యాత వ్యాపార సంస్థల్లో ఒకటిగా ఉన్న వేదాంత FY23లో రాజకీయ పార్టీలకు అందించిన విరాళాల గురించి తన స్టాక్ మార్కెట్ ఫైలింగ్ లో వెల్లడించింది. మైనింగ్ కింగ్ అనిల్ అగర్వాల్ ఏకంగా రూ.155 కోట్లను ఎలక్టోరల్ బ్యాండ్స్ కొనుగోలు రూపంలో రాజకీయ పార్టీలకు విరాళంగా అందించారు. ఇది గతంలో కంటే ఎక్కువే.. అలాగే గడచిన ఐదేళ్ల కాలంలో వేదాంత లిమిటెడ్ రాజకీయ పార్టీలకు రూ.457 కోట్లను అధికారికంగా విరాళాల రూపంలో అందించింది.

2018లో మోదీ సర్కార్ ఎలక్టోరల్ బాండ్ పథకాన్ని తీసుకొచ్చింది. అయితే దీని ముఖ్య ఉద్ధేశ్యం ఏమిటంటే అనామకంగా పార్టీలకు నిధులు సమకూర్చటం. ఫలానా వ్యక్తి లేదా సంస్థ పేరు రాజకీయ పార్టీకి అధికారికంగా తెలియకుండా తంతు జరుగుతుందన్నమాట. దేశంలో ప్రభుత్వ యాజమాన్యంలోని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అధీకృత శాఖల ద్వారా ఎలక్టోరల్ బాండ్లను జారీ చేయడానికి, ఎన్క్యాష్ చేయడానికి మాత్రమే అధికారం ఉంది.
2018 నుంచి 2022 మధ్య కాలంలో బాండ్స్ రూపంలో వచ్చిన విరాళాల్లో అధిక భాగం కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ పార్టీకి రూ.5270 కోట్లు సమకూరగా.. ప్రతిపక్షంలో కాంగ్రెస్ పార్టీకి రూ.964 కోట్లు విరాళంగా అందాయి. ఆ తర్వాతి స్థానంలో తృణమూల్ కాంగ్రెస్కు రూ.767 కోట్లు ఎలక్టోరల్ బాండ్ల ద్వారా అందుకుందని గణాంకాలు చెబుతున్నాయి. FY22లో వేదాంత గ్రూప్ బాండ్స్ రూపంలో రూ.123 కోట్లను విరాళంగా అందించింది.
More From GoodReturns

iPhone 18 Pro : ఐఫోన్ 18 ప్రో సిరీస్ వచ్చేస్తోంది! ఇండియాలో ధర ఎంతంటే..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్గా కానిచ్చేస్తున్నారు!

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..



Click it and Unblock the Notifications