Political Funding: భారీ అప్పులతో వేదాంత లిమిటెడ్ సతమతమవుతోంది. దీంతో డీమెర్జర్, నిధుల సమీకరణ వంటి దిద్దుబాటు చర్యలకు దిగింది. ఇవి కొంతమేర ఉపశమనం కలిగించినట్లే కనిపిస్తోంది. అయితే ఆ కంపెనీ చేసిన ఓ పని ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది.
రాజకీయ పార్టీలకు 200 కోట్లు విరాళం ఇచ్చేందుకు వేదాంత బోర్డు ఆమోదం తెలిపింది. ఇందుకోసం గతేడాది జూన్లో అంగీకరించిన 57 కోట్ల పరిమితిని పునరుద్ధరించడానికి నిర్ణయం తీసుకున్నట్లు ప్రముఖ మీడియా సంస్థ నివేదించింది. నేరుగా, ఎలక్టోరల్ ట్రస్ట్ ద్వారా మరియు ఎలక్టోరల్ బాండ్లకు సబ్స్క్రిప్షన్ ద్వారా ఈ వ్యవహారాన్ని పూర్తి చేసేందుకు కంపెనీ ఛైర్మన్ అనిల్ అగర్వాల్ మరియు వైస్ ఛైర్మన్ నవీన్ అగర్వాల్కు అధికారం ఉన్నట్లు వెల్లడించింది.

29వ విడత ఎలక్టోరల్ బాండ్ విక్రయాలను ప్రారంభించేందుకు రెండు రోజుల ముందు అంటే నవంబర్ 4న వేదాంత బోర్డు ఈ తీర్మానాన్ని ఆమోదించింది. మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్గఢ్, మిజోరాం, తెలంగాణ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల మధ్య నవంబర్ 20న ఎలక్టోరల్ బాండ్ల విక్రయాలు ముగిసినట్లు నివేదిక పేర్కొంది.
రాజకీయ నిధుల్లో పారదర్శకత తీసుకొచ్చే ప్రయత్నాల్లో భాగంగా.. పార్టీలకు ఇచ్చే నగదు విరాళాలకు ప్రత్యామ్నాయంగా ఎలక్టోరల్ బాండ్ల పథకం 2018లో నోటిఫై చేయబడింది. ఇలా మొత్తం మీద ఎలక్టోరల్ బాండ్ల ద్వారా రాజకీయ పార్టీలకు వేదాంత 457 కోట్లు అందించింది. ఈ ఆర్థిక సంవత్సరంలోనే 155 కోట్లను విరాళంగా ఇచ్చింది.
More From GoodReturns

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదల ఎంతో తెలుసా.. మార్చి 20, శుక్రవారం ధరలు ఇవే..

Bengaluru: బెంగళూరు వాసులకు గుడ్ న్యూస్! రెండో ఎయిర్పోర్ట్ ఎక్కడో క్లారిటీ వచ్చేసింది!

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?

Interest rates Hike: త్వరలో ప్రపంచవ్యాప్తంగా పెరగనున్న వడ్డీ రేట్లు.. మన EMIలు కూడా పెరుగుతాయా?

బంగారం, వెండి ధరలు పతనానికి ఇరాన్ యుద్ధం కారణం కాదు..సంచలన విషయాలు వెల్లడించిన బులియన్ నిపుణులు..

Bengaluru: ట్రాఫిక్ కష్టాలకు గుడ్ బై.. ఈ యువతి ఐడియా నెటిజన్లను ఆశ్చర్యపరుస్తోంది!

క్రెడిట్ కార్డు క్లోజ్ చేసిన 10 ఏళ్ళ తర్వాత రూ. 33 లక్షలు కట్టాలని బ్యాంక్ నోటీసులు.. కస్టమర్ ఏం చేశాడంటే..

బంగారం ధరలు ఈ స్థాయి వద్దకు దిగబోతున్నాయి.. కొనుగోలుపై కీలక నిర్ణయం తీసుకోమంటున్న ఆర్థిక నిపుణులు

Bengaluru: సిలికాన్ వ్యాలీకి ఏమైంది? టెక్ కంపెనీలు బెంగళూరుని వదిలి ఎందుకు వెళ్లిపోతున్నాయి?



Click it and Unblock the Notifications