టాప్ 20 స్మార్ట్ సిటీల్లో అమరావతి: సిస్టర్ సిటీలు... డయ్యూ నగరం కోసం విశాఖ
100 స్మార్ట్ సిటీలను నరేంద్ర మోడీ ప్రభుత్వం ఎంపిక చేసిన విషయం తెలిసిందే. స్మార్ట్ సిటీ అభివృద్ధిలో ప్రధాని నరేంద్ర మోడీ ప్రాతినిథ్యం వహిస్తున్న వారణాసి టాప్ 20లో నిలిచింది. కేంద్ర హౌసింగ్ అండ్ అర్బన్ అఫైర్స్ మంత్రిత్వ శాఖ 20 బెస్ట్ పర్ఫార్మింగ్ నగరాలు, 20 బాటమ్ నగరాలను జత చేసి, రెండూ కలిసి పని చేయనున్నాయి. ఈ నగరాలు సిస్టర్ సిటీలుగా పని చేస్తాయి.
పెరిగిన ధరలు... ఖర్చు, భారీగా పడిపోయిన ఆటో సేల్స్! ఆటో ఎక్స్పో, నిర్మల ప్రకటనపై ఆశలు
టాప్ 20లో వారణాసి, విశాఖ, అమరావతి
ఇక, టాప్ 20 బెస్ట్ నగరాల విషయానికి వస్తే అహ్మదాబాద్ (ఫస్ట్ ర్యాంక్), నాగపూర్, తిరుప్పూర్, రాంచీ, భోపాల్, సూరత్, కాన్పూర్, ఇండోర్, విశాఖపట్నం, వెల్లూర్, వడోదర, నాషిక్, ఆగ్రా, వారణాసి, దేవణగెరె, కోట, పుణే, ఉదయ్పూర్, డెహ్రాడూన్, అమరావతి ఉన్నాయి.
20-20 ఫార్ములా
సిస్టర్ సిటీల్లో భాగంగా 20-20 ఫార్ములా ప్రకారం రాంచీ, పుణే నగరాలకు షిమ్లా, ధర్మశాల తోడవుతున్నాయి. టాప్ 20 బెస్ట్ సిటీలు, బాటమ్లోని 20 నగరాలు ఫిబ్రవరి 20వ తేదీలోపు ఒప్పందం కుదుర్చుకుంటాయి. వివిధ కోణాల్లో నగరాలను జత చేశారు.
డయ్యూ కోసం విశాఖపట్నం
వారణాసి నగరాన్ని అమృత్సర్తో జత చేశారు. డయ్యూ నగర అభివృద్ధి కోసం విశాఖపట్నం, షరాన్పూర్ కోసం సూరత్ కలిసి పని చేయనుంది. మిజోరామ్ రాజధాని ఐజ్వాల్తో కలిసి భోపాల్ పని చేస్తుంది. 100 స్మార్ట్ సిటీలకు సంబంధించి రూ.2,05,018 కోట్ల విలువైన 5151 ప్రాజెక్టులను గుర్తించారు.