అదిరిపోయే అప్‌డేట్: ఫస్ట్ వందే భారత్ స్లీపర్ రైలు ఆ రూట్లోనే! ఏసీ 3-టైర్, 2-టైర్ ధరలు ఇవే!

భారతీయ రైల్వే రంగంలో మరో విప్లవం రాబోతోంది. ఇప్పటికే పగటిపూట ప్రయాణాలకు వన్నె తెచ్చిన వందే భారత్ ఎక్స్‌ప్రెస్.. ఇప్పుడు రాత్రి ప్రయాణాల కోసం 'స్లీపర్' వెర్షన్‌లో సిద్ధమైంది. ఈ నెలలోనే ప్రారంభం కానున్న వందే భారత్ (vande bharat) స్లీపర్ రైలు ధరలు, రూట్, ప్రత్యేకతల గురించి ఇప్పుడు చూద్దాం.

vande bharat sleeper train ticket price route launch date january 2026 updates

రైల్వే ప్రయాణికులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న వందే భారత్ (vande bharat) స్లీపర్ రైలు ప్రారంభానికి ముహూర్తం ఖరారైంది. జనవరి 2026 ద్వితీయార్థంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ అత్యాధునిక రైలును జెండా ఊపి ప్రారంభించనున్నారని రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ వెల్లడించారు. సుదూర ప్రాంతాలకు ప్రయాణించే వారి కోసం విమాన స్థాయి సౌకర్యాలతో ఈ రైలును రూపొందించారు.

తొలి ప్రయాణం ఎక్కడ నుంచి ఎక్కడికి?

మొట్ట మొదటి వందే భారత్ స్లీపర్ సర్వీస్ గౌహతి, కోల్‌కతా (హౌరా) నగరాల మధ్య నడవనుంది. ఇది సుమారు 1,200 నుండి 1,500 కిలోమీటర్ల దూరాన్ని కవర్ చేస్తుంది. ఈ మార్గంలో పశ్చిమ బెంగాల్‌లోని హౌరా, హుగ్లీ, ముర్షిదాబాద్, అస్సాంలోని బొంగైగావ్ వంటి కీలక జిల్లాల ప్రజలకు ఈ రైలు ఎంతో ఉపయోగకరంగా ఉండబోతోంది.

టికెట్ ధరల వివరాలు (Ticket Fares)

సాధారణ రాజధాని ఎక్స్‌ప్రెస్ రైళ్లతో పోలిస్తే దీని ధరలు కొంచెం ఎక్కువగా ఉన్నప్పటికీ.. ఇచ్చే సౌకర్యాలు మాత్రం అద్భుతం. గౌహతి - కోల్‌కతా రూట్ కోసం ప్రాథమికంగా నిర్ణయించిన ధరలు ఇవే..

  • AC 3-Tier: రూ.2,300 (వన్ వే ప్రయాణానికి)
  • AC 2-Tier: రూ. 3,000
  • AC First Class: రూ. 3,600

రైలు ప్రత్యేకతలు ఏంటి?

ఈ స్లీపర్ రైలులో మొత్తం 16 కోచ్‌లు ఉంటాయి. ఇందులో 11 ఏసీ 3-టైర్, 4 ఏసీ 2-టైర్, ఒక ఫస్ట్ క్లాస్ ఏసీ కోచ్ ఉంటాయి. మొత్తం 823 మంది ప్రయాణికులు ఇందులో ప్రయాణించవచ్చు.

  • వేగం: కోటా-నాగ్దా సెక్షన్‌లో జరిగిన ట్రయల్ రన్స్‌లో ఈ రైలు గంటకు 180 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంది.
  • స్టెబిలిటీ: 180 కి.మీ వేగంతో వెళ్తున్నప్పుడు కూడా రైలులో నీటి గ్లాసు పెడితే అందులోని నీరు కూడా తొణకకుండా ఉండటం దీని ప్రత్యేకత.
  • సౌకర్యాలు: ఎర్గోనామిక్ సీట్లు, రీడింగ్ లైట్లు, సెన్సార్ ఆధారిత వాష్‌రూమ్‌లు, అత్యాధునిక ఫైర్ సేఫ్టీ సిస్టమ్స్ ఇందులో ఉన్నాయి.

భవిష్యత్తు ప్రణాళికలు

మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపిన వివరాల ప్రకారం.. రాబోయే ఆరు నెలల్లో మరో 8 స్లీపర్ వందే భారత్ రైళ్లను ప్రవేశపెట్టనున్నారు. 2026 చివరి నాటికి దేశవ్యాప్తంగా మొత్తం 12 స్లీపర్ రైళ్లు పట్టాలెక్కనున్నాయి. త్వరలోనే మన తెలుగు రాష్ట్రాల్లో కూడా అంటే హైదరాబాద్ - బెంగళూరు, విజయవాడ - చెన్నై వంటి రూట్లలో కూడా వందే భారత్ (vande bharat) స్లీపర్ రైళ్లు వచ్చే అవకాశం ఉంది.

More From GoodReturns

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+