India Imports: భారత్ తీసుకుంటున్న ప్రతి నిర్ణయాన్ని కొన్ని దేశాలు పనిగట్టుకుని మరీ వివాదాస్పదం చేస్తున్నాయి. మిత్రదేశంగా చెప్పుకునే అగ్రరాజ్యం అమెరికా ఈ విషయంలో ముందుంటోంది. ఏకంగా అంతర్జాతీయ వేదికపై ఇండియా వైఖరిని తప్పుపట్టింది.
ల్యాప్ టాప్లు, ట్యాబ్లెట్లు సహా పలు ఎలక్ట్రానిక్ ఉత్పత్తుల దిగుమతులపై భారత ప్రభుత్వం పరిమితిని విధించింది. ఈ నిర్ణయంపై ఆపిల్, శామ్ సంగ్ వంటి దిగ్గజ కంపెనీలు సైతం స్పందించాయి. దీనిని పునః పరిశీలించాలని అభ్యర్థించాయి. అయితే తాజాగా వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్(WTO)వద్ద మార్కెట్ యాక్సెస్పై జరిగిన సమావేశంలో అమెరికా ఆందోళన వ్యక్తం చేసింది.

చైనా, తైవాన్ను దృష్టిలో పెట్టుకుని భారత్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు అగ్రరాజ్యం ప్రతినిధి ఆరోపించారు. ఇండియాతో వ్యాపారం చేయడానికి ఒకటికి రెండుసార్లు ఆలోచించాలని తమ సంస్థలకు సూచించేలా ఈ చర్యలు ఉన్నాయన్నారు. తద్వారా మాన్యుఫ్యాక్చరింగ్ రంగంలో భారీగా ఉద్యోగాలు సృష్టించాలనే భారత్ ఆశయం కష్టతరం అవుతుందన్నారు. ఇండియా ఎగుమతులపైనా దీని ప్రభావం ఉంటుందని స్పష్టం చేశారు.
దేశీయంగా ఎలక్ట్రానిక్ ఉత్పత్తుల తయారీని పెంచి, చైనా వంటి ఇతర ప్రాంతాలపై ఆధారపడటాన్ని తగ్గించుకోవాలని భారత్ ఆగస్టులో వాటిపై ఆంక్షలు విధించింది. దిగుమతులపై నిర్ధిష్టమైన షరతులు, భద్రతతో కూడిన లైసెన్సింగ్ వ్యవస్థను అమల్లోకి తీసుకురావాలని యోచిస్తోంది. నవంబర్ 1 నుంచి కొత్త నిబంధనలు సైతం అమల్లోకి రానున్నాయి.
పాలసీ మార్పులు సహా భారత్ తాజా విధానం వెనకున్న ఉద్దేశ్యాన్ని స్పష్టం చేయాలని చైనా కోరింది. ఈ చర్యలు WTO నిబంధనలకు విరుద్ధంగా ఉన్నాయని, అంతర్జాతీయ వాణిజ్య విపణిలో అనవసర అడ్డంకులు ఏర్పడే ప్రమాదం ఉందని దక్షిణ కొరియా ఆందోళన వ్యక్తం చేసింది. భారత్ తన నిర్ణయాన్ని మరోసారి పరిశీలించాలని, సమస్యపై వివరణాత్మక సమాచారం అందించాలని అభ్యర్థించింది.
More From GoodReturns

బెంగళూరులో రూ. 5 వేలకే రూమ్..ఈ ఏరియాలోకి రమ్మని పిలుస్తున్న ఇంటి ఓనర్లు..

బెంగళూరు మెట్రో ప్రయాణిలకు గుడ్ న్యూస్.. మరో రెండు కొత్త రైళ్లు వచ్చేస్తున్నాయి..

విజయవాడ నుంచి హైదరాబాద్కు గంటే ప్రయాణం.. 220 కి.మీ స్పీడ్తో కొత్త రైలు.. వందే భారత్ కన్నా ఫాస్ట్..

Gold price: 2013 తర్వాత అతిపెద్ద పతనం ఇదే! బంగారం కొనేందుకు ఇదే సరైన సమయమా?

Today Gold Silver Rate Live: బంగారం ధరల్లో తీవ్ర మార్పులు..కొంపలు ముంచుతున్న పశ్చిమాసియా యుద్ధం

టీసీఎస్ క్యూ4 ఫలితాలు: ఇన్వెస్టర్లకు భారీ లాభాల పండుగ?

బంగారం ధరలపై యూబీఎస్ సంచలన నివేదిక.. పసిడి ధరలు కుప్పకూలుతాయనే భయంతో కేంద్ర బ్యాంకులు..

టీసీఎస్ క్యూ4 ఫలితాలు.. ప్రకటనకు ముందే స్టాక్ మార్కెట్లో దుమ్మురేపిన టెక్ దిగ్గజం..

కుప్పకూలిన బంగారం ధరలు.. భారీ తగ్గుదలతో ఈ రోజు పసిడి రేటు ఎలా ఉందంటే.. ఏప్రిల్ 9, గురువారం ధరలు ఇవే..

అంబేద్కర్ జయంతి సెలవు: మీ బ్యాంక్ పనుల పరిస్థితి ఏంటి?

బంగారం, వెండి ధరలు ఈ రేటుకు దిగి వస్తేనే కొనండి.. కీలక సూచన చేస్తున్న బులియన్ నిపుణులు



Click it and Unblock the Notifications