అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత దిగుమతులపై సుంకాలను 50 శాతం వరకు పెంచిన నిర్ణయం దేశ వాణిజ్య రంగంలో ప్రకంపనలు రేపుతోంది. ఈ నేపథ్యంలో మారుతి సుజుకి ఇండియా (MSIL) చైర్మన్ ఆర్సి భార్గవ మాట్లాడుతూ.. దేశం ఐక్యంగా నిలబడాలని, అమెరికా చేసే ఎలాంటి "బెదిరింపులకు" లొంగరాదని పిలుపునిచ్చారు. కంపెనీ వార్షిక సర్వసభ్య సమావేశం (AGM)లో ఆయన మాట్లాడుతూ, ప్రభుత్వానికి సంపూర్ణ మద్దతు ఇవ్వడం దేశ గౌరవానికి సంబంధించిన అంశమని స్పష్టం చేశారు.
దేశీయ మార్కెట్ విషయానికి వస్తే.. చిన్న కార్లపై జీఎస్టీ తగ్గింపు అత్యంత అవసరమని ఆయన తెలిపారు. ప్రస్తుతం చిన్న కార్లపై జీఎస్టీ రేటు 28 శాతం ఉంది. ఈ రేటును 18 శాతానికి తగ్గిస్తే చిన్న కార్ల మార్కెట్ మళ్లీ బలపడుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. సెప్టెంబర్ 3, 4 తేదీల్లో జరగబోయే జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో ఈ ప్రతిపాదనపై చర్చ జరిగే అవకాశం ఉందని తెలిపారు. చిన్న కార్లపై పన్ను తగ్గితే ఎంట్రీ లెవల్ వినియోగదారులకు పెద్ద ప్రయోజనం కలుగుతుందని అన్నారు.

జీఎస్టీ తగ్గింపుతో ఆటో పరిశ్రమ వేగంగా ఎదగడానికి, కొత్త పారిశ్రామిక యూనిట్లు ఏర్పడటానికి, ఉపాధి అవకాశాలు పెరగడానికి మార్గం సుగమం అవుతుందని భార్గవ అన్నారు. ప్రస్తుతానికి SUV అమ్మకాలు ఆటో మార్కెట్ను నిలబెట్టినా.. ఇటీవల వాటి డిమాండ్ కూడా కొంత మందగించిందని ఆయన గుర్తు చేశారు. 2025-26 మొదటి త్రైమాసికంలో ప్రయాణీకుల వాహనాల అమ్మకాలు 1.6 శాతం తగ్గాయని గణాంకాలను ప్రస్తావించారు.
ప్రస్తుతం భారతదేశంలో ఎలక్ట్రిక్ కార్లపై కేవలం 5 శాతం జీఎస్టీ ఉండగా, హైబ్రిడ్ కార్లపై 28 శాతం జీఎస్టీ ఉంది. ఈ వ్యత్యాసం సరికాదని, యూరప్, అమెరికా లాగే రెండింటికీ సమాన పన్ను విధించాల్సిన అవసరం ఉందని ఆయన చెప్పారు. పరిశుభ్రమైన ఇంధనాన్ని ప్రోత్సహించే ఏ టెక్నాలజీ అయినా సమానంగా ప్రోత్సాహం పొందాలని ఆయన అభిప్రాయపడ్డారు.
2018-19లో అమల్లోకి వచ్చిన బిఎస్-6 ఉద్గార నిబంధనల కారణంగా వాహనాల ధరలు పెరిగాయని, ఫలితంగా చిన్న కార్ల అమ్మకాలు తగ్గిపోయాయని భార్గవ గుర్తు చేశారు. ద్విచక్ర వాహన యజమానులు తక్కువ ఖర్చుతో కార్లకు మారే అవకాశం తగ్గిందని చెప్పారు. జపాన్లో 1950లలో ప్రవేశపెట్టిన "కీ కార్ల" మోడల్ను ఉదాహరణగా చూపిస్తూ, తక్కువ పన్నులతో, తక్కువ ఖర్చుతో అల్ట్రా-చిన్న కార్లను భారత్లో కూడా ప్రవేశపెట్టాలని సూచించారు.
అలాగే అరుదైన భూమి అయస్కాంతాల కొరత వల్ల కలిగే సమస్యలపై భార్గవ హెచ్చరిక జారీ చేశారు. అయితే ప్రభుత్వం జోక్యం చేసుకుంటే ఈ సమస్యలను అధిగమించగలమని అన్నారు. బ్రిటన్తో చారిత్రాత్మక స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం కుదిరిందని.. ఇది భవిష్యత్ ఒప్పందాలకు ఆదర్శంగా నిలుస్తుందని ఆయన చెప్పారు.
మారుతి సుజుకి త్వరలో రెండు SUVలను మార్కెట్లోకి తీసుకురాబోతోంది. అందులో ఒకటి కంపెనీ దేశీయంగా తయారు చేస్తున్న మొట్టమొదటి ఎలక్ట్రిక్ SUV E-Vitara. దీనిని ఇటీవల ప్రధానమంత్రి ప్రారంభించారు. మరో SUV సెప్టెంబర్ 3న విడుదల కానుంది.
More From GoodReturns

Iran war: కేవలం గ్యాస్ ఒక్కటే కాదు.. ఈ 5 రంగాలపై భారీ ఎఫెక్ట్ ఉండే అవకాశం?

Iran war: త్వరలోనే యుద్ధం ముగింపు? ట్రంప్ వ్యాఖ్యలతో చమురు ధరల్లో భారీ మార్పు!

కొంపలు ముంచుతున్న ఇరాన్ యుద్ధం.. కొనేవారు లేక దుబాయ్లో కుప్పలు కుప్పలుగా పడిన బంగారం ..

బంగారంపై షాకిస్తున్న వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ రిపోర్ట్.. వచ్చే 15 రోజులు పసిడి ప్రియుల గుండెల్లో దడదడ..

బంగారం ధరలు పతనం కాబోతున్నాయి.. వెనిజులా బంగారంపై కన్నేసిన అమెరికా.. ట్రేడ్ డీల్ క్లోజ్..

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

Hyderabad: హైదరాబాద్లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..



Click it and Unblock the Notifications