అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రపంచ దేశాలపై విధించిన అధిక సుంకాలు కరోనావైరస్ మహమ్మారి కంటే ప్రమాదకరమైనవని ఆసియా మౌలిక సదుపాయాల పెట్టుబడి బ్యాంకు (AIIB) చీఫ్ ఆర్థికవేత్త ఎరిక్ బెర్గ్లోఫ్ హెచ్చరించారు. COVID-19 మహమ్మారి లేదా ప్రపంచ ఆర్థిక సంక్షోభం కంటే అమెరికా సుంకాలు ఎక్కువ అనిశ్చితిని సృష్టించాయని ఆయన పేర్కొన్నారు. TOI కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ.. ప్రపంచ సరఫరా గొలుసులు అలాగే ఉంటాయని విశ్వసిస్తున్నట్లు తెలిపారు.
ప్రపంచవ్యాప్తంగా సుంకాలు చాలా అనిశ్చితిని సృష్టిస్తాయని ఎరిక్ బెర్గ్లోఫ్ తెలిపారు. ప్రతి దేశంపై ఈ US Tariffs ప్రభావం పడుతుందని తెలిపారు. దురదృష్టవశాత్తు, భారతదేశం ఎక్కువగా ప్రభావితమైన దేశాలలో ఒకటిగా నిలిచిందని ఆయన పేర్కొన్నారు. ట్రంప్ తీసుకు వచ్చిన ఈ విధాన అనిశ్చితి అపూర్వమైనది. ఈ టారిఫ్స్ COVID మహమ్మారి, ప్రపంచ ఆర్థిక సంక్షోభం సమయంలోని దాని కంటే కూడా ఎక్కువగా ఉంది. ఇది పెట్టుబడి, వాణిజ్యంపై తీవ్ర ప్రభావం చూపుతుందని తెలిపారు. ప్రపంచ దేశాలపై తీవ్ర ఆర్థిక భారాన్ని మోపుతుందని తెలిపారు.

ఇది ఆర్థిక వృద్ధిపై కూడా గణనీయమైన ప్రభావాన్ని చూపుతుంది. ఊరట కలిగించే విషయం ఏంటంటే.. కొంత అనిశ్చితి ఇప్పుడు తగ్గుతోంది. ఇది మంచి విషయం. కానీ మనం ఇంకా చాలా దూరం వెళ్ళాలి. US, చైనా మధ్య సంబంధాలు ఎలా ఉంటాయో అంచనా వేయడం చాలా కష్టమనొ బెర్గ్లోఫ్ తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా సుంకాల స్థాయిలు చాలా ఎక్కువగా ఉంటాయన్నారు. అమెరికా సుంకాలను ఎదుర్కోవడానికి చైనా ప్రభుత్వం చాలా సిద్ధంగా ఉందని ఎరిక్ బెర్గ్లోఫ్ వివరించారు. వారు కూడా వాటిని ఆశిస్తున్నట్లు చెప్పుకొచ్చారు. కొన్ని రంగాలలో చైనాకు గణనీయమైన శక్తి ఉందని, ఈ శక్తి చర్చలను సమతుల్యం చేయడంలో సహాయపడిందని బెర్గ్లోఫ్ వివరించారు.
చైనాను విలువ గొలుసుల నుండి బయటకు నెట్టడానికి కొందరు ప్రయత్నిస్తున్నారని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు, ఈ వైఖరిని ఆయన వ్యతిరేకిస్తున్నారు. భారతదేశంతో చైనా చాలా కఠినమైన చర్చలలో పాల్గొన్న సందర్భాలు ఉన్నాయని బెర్గ్లాఫ్ వివరించారు. అమెరికా, వివిధ దేశాల మధ్య ద్వైపాక్షిక చర్చలు చైనాపై ప్రభావం చూపకుండా చూసుకోవాలని చైనా కోరుకుంటోంది. "చైనా ప్లస్ వన్" నమూనా ఇప్పటికీ ఎక్కువగా ఉందని ఆయన అన్నారు. దీని అర్థం కంపెనీలు చైనాతో పాటు మరొక దేశంలో కూడా ఉత్పత్తి చేస్తున్నాయి.
ఎరిక్ బెర్గ్లోఫ్ మాట్లాడుతూ.. భారతదేశం కొన్ని ముఖ్యమైన రంగాలలో ప్రయోజనం పొందిందని అన్నారు. ఉదాహరణగా ఆపిల్, ఫాక్స్కాన్ చేసిన పనిని చెప్పారు . చాలా కంపెనీలు భారతదేశానికి వచ్చాయి. ఇది కేవలం USతో జరిగిన దాని వల్ల మాత్రమే కాదు. బదులుగా, కంపెనీలు, దేశాలు తమ విలువ గొలుసులను వైవిధ్యపరచాలని కోరుకుంటున్నాయి. ఈ విలువ గొలుసులు చాలా అధిక సామర్థ్య ఒత్తిళ్ల ద్వారా నడపబడుతున్నందున ఇది అంత సులభం కాదని బెర్గ్లోఫ్ అన్నారు. వారు చాలా కాలంగా ఈ విలువ గొలుసులలో చాలా సన్నిహిత సంబంధాలను ఏర్పరచుకున్నారని తెలిపారు.
భారతదేశం ఒక భారీ, వేగంగా అభివృద్ధి చెందుతున్న మార్కెట్ అని ఎరిక్ బెర్గ్లాఫ్ అన్నారు. అందువల్ల దేశీయ, విదేశీ కంపెనీలు రెండూ భారతదేశంపై గొప్ప ఆసక్తిని చూపిస్తున్నాయి. భారతదేశం మరింత సమగ్రంగా మారుతుందని, ముఖ్యంగా ఆసియాలో ఉన్నతంగా మారుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. రైతులు, గ్రామీణ ఆర్థిక వ్యవస్థ అవసరాలకు సున్నితంగా ఉండటం చాలా ముఖ్యం అని ఆయన అన్నారు. అయితే, భారతదేశం దీని నుండి ఎంతో ప్రయోజనం పొందగలదు.


Click it and Unblock the Notifications