Flipkart News: అమెరికాకు చెందిన అతిపెద్ద రిటైల్ దిగ్గజం వాల్మార్ట్ ఇండియా మార్కెట్లో దూకుడు పెంచేసింది. అమెజాన్ ఆటకట్టించేందుకు ఆయుధాలు ఎక్కుపెట్టింది.
ఇండియాలో ఫిప్కార్ట్ లో వాటాల కొనుగోలు ద్వారా ఈ-కామర్స్ వ్యాపారంలో వాల్మార్ట్ ముందుకు సాగుతోంది. దేశంలోని 99 శాతం స్టార్టప్ కంపెనీల్లో విదేశీ సంస్థలు పెట్టుబడులు పెడుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో వాల్మార్ట్ 16 బిలియన్ డాలర్ల పెట్టుబడితో 77 శాతం వాటాలను 2018లో కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే. మెజారిటీ వాటాదారుగా ఉన్నప్పటికీ కంపెనీని పూర్తిగా సొంతం చేసుకోవాలని నిర్ణయించింది.

తాజాగా రిటైల్ దిగ్గజం వాల్మార్ట్.. ఫ్లిప్కార్ట్ ప్రారంభ పెట్టుబడిదారులైన యాక్సెల్, టైగర్ గ్లోబల్ నుంచి వాటాలను కొనుగోలు చేసింది. అలాగే సహ వ్యవస్థాపకుడు బిన్నీ బన్సల్ కూడా ఫ్లిప్కార్ట్లో తన వాటాను పూర్తిగా ఉపసంహరించుకున్నారు. దీంతో మెుత్తం 35 బిలియన్ డాలర్లు వెచ్చించి పెద్ద ఇన్వెస్టర్ల నుంచి వాటాలను అమెరికా రిటైలర్ కొనుగోలు చేసింది. తన వాటాలను విక్రయించటం ద్వారా టైగర్ గ్లోబల్ సుమారు 3.5 బిలియన్ డాలర్ల లాభాన్ని వెచ్చించిందని వెల్లడైంది. అలాగే బిన్నీ బన్సల్ సుమారు 1-1.5 బిలియన్ డాలర్లను సంపాదించినట్లు సమాచారం.

ఫిప్కార్ట్ భవిష్యత్తుపై తాము నమ్మకంగా ఉన్నామని వాల్మార్ట్ ప్రతినిధి తెలిపారు. మొదట పెట్టుబడి పెట్టినప్పుడు కంటే ఈ రోజు భారతదేశంలో అవకాశాల గురించి మరింత సానుకూలంగా ఉన్నట్లు తెలిపారు. దీర్ఘకాలికంగా ఆరోగ్యకరమైన, స్థిరమైన, లాభదాయకమైన వ్యాపారాన్ని నిర్మించడం ద్వారా.. ఫ్లిప్కార్ట్ అభివృద్ధి చెందుతున్న, డైనమిక్ మార్కెట్లో వృద్ధిని కొనసాగించేలా చేస్తుందని పేర్కొన్నారు. 2007లో భారత స్టార్టప్ కంపెనీగా ప్రారంభమైన ఫ్లిప్కార్ట్ ప్రస్థానం వాటాలు చేతులు మారినతర్వాత అమెరికా యాజమాన్యంలోని కంపెనీగా మారిపోయింది.
More From GoodReturns

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్గా కానిచ్చేస్తున్నారు!

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?



Click it and Unblock the Notifications