Pakistan Crisis: పాక్‌కు చైనా సాయం.. అమెరికా ఆందోళన.. RSS నేత కామెంట్స్

Pakistan Crisis: పాకిస్థాన్ ఇప్పటికే ఆర్థిక అంధకారంలోకి జారుకుంది. దీర్ఘకాలికంగా చెల్లింపుల బ్యాలెన్స్ సమస్యను ఎదుర్కొంటోంది. దీనంతటికీ కారణంగా దాయాది వల్ల సరిపడా ఫారెక్స్ నిల్వలు లేకపోవటమే కారణం. ఈ క్రమంలో పాక్ IMF ఆర్థిక సాయం కోసం చేతులు చాచింది. అది పెట్టిన షరతులకు సైతం తలొగ్గింది.

చైనా సాయం..

చైనా సాయం..

రోజురోజుకూ అప్పుల ఊబిలోకి జారుకుంటున్న పాకిస్థాన్ కు డ్రాగన్ దేశం సాయం చేసేందుకు ముందుకొచ్చింది. ఇందులో భాగంగా 700 మిలియన్ డాలర్ల రుణాన్ని అందించేందుకు చైనా ఆమోదించిందని ఆర్థిక మంత్రి ఇషాక్ దార్ బుధవారం ప్రకటించారు. ఇదే క్రమంలో అంతర్జాతీయ ద్రవ్య నిధి నుంచి 1.1 బిలియన్ డాలర్ల బెయిల్ అవుట్ సాయం కోసం పాక్ ఎదురుచూస్తోంది.

అమెరికా ఆందోళన..

అమెరికా ఆందోళన..

చైనా అప్పుల వల వేయటాన్ని అమెరికా తప్పుపట్టింది. భారత్ పొరుగుదేశాలైన శ్రీలంక, పాకిస్థాన్ లకు చైనా ఇస్తున్న రుణాలు "బలవంతపు పరపతి" కోసం ఉపయోగించబడటం తీవ్ర ఆందోళనకరమైన అంశంగా అమెరికా భావిస్తున్నట్లు విదేశాంగ శాఖ సీనియర్‌ అధికారి ఒకరు తెలిపారు. అమెరికా అగ్రశ్రేణి దౌత్యవేత్త మార్చి 1 నుంచి 3 వరకు మూడు రోజుల అధికారిక పర్యటన నిమిత్తం న్యూఢిల్లీకి రానున్నారు. భారత్‌తో కూడిన ఈ ప్రాంతంలోని దేశాలు తమ సొంత నిర్ణయాలు తీసుకోవాలని, బయటి భాగస్వాములెవరూ బలవంతం చేయకూడదని అమెరికా మాట్లాడుతోందని దక్షిణ మధ్య ఆసియా సహాయ కార్యదర్శి డొనాల్డ్ లూ చెప్పారు.

సైనికులకూ తిండి పెట్టలేక..

సైనికులకూ తిండి పెట్టలేక..

పాకిస్థాన్‌లో కొనసాగుతున్న ఆర్థిక సంక్షోభం సైన్యాన్ని దెబ్బతీస్తోంది. తీవ్రమైన ఆర్థిక సంక్షోభం మధ్య సరఫరాలో కోత కారణంగా పాకిస్తాన్ సైన్యం మెస్‌లు ఆహార కొరతను ఎదుర్కొంటున్నాయి. కొంతమంది ఫీల్డ్ కమాండర్లు జనరల్ హెడ్‌క్వార్టర్స్‌లోని క్వార్టర్ మాస్టర్ జనరల్ (QMG) కార్యాలయానికి దీనిపై లేఖలు రాశారు. అన్ని ఆర్మీ మెస్‌లలోని సైనికులకు ఆహార సరఫరాలో కోత విధించాలని సూచించినట్లు వార్తలు వెలుగులోకి వచ్చాయి. నిధులలో కోతల మధ్య సైన్యం సైనికులకు రోజుకు 'రెండుసార్లు సరిగ్గా' ఆహారం ఇవ్వలేకపోతున్నట్లు తెలుస్తోంది.

ఆర్ఎస్ఎస్ నేత..

ఆర్ఎస్ఎస్ నేత..

ప్రస్తుతం దాయాది పాక్ తీవ్ర ఆహార, ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్న తరుణంలో ఆర్‌ఎస్‌ఎస్ నేత కృష్ణ గోపాల్ కీలక కామెంట్స్ చేశారు. సంక్షోభంలో ఉన్న పాకిస్థాన్‌కు భారత్ గోధుమలు అందించాలని ఆయన అభిప్రాయపడ్డారు. పాకిస్థాన్ లో కేజీ గోధుమల ధర రూ.250కి చేరుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. 70 ఏళ్ల కిందట వారు మనతోనే కలిగి ఉన్నారని.. 1948, 1961, 1971, కార్గిల్ యుద్ధాలు చేసినప్పటికీ ప్రస్తుతం అక్కడ నెలకొన్న ఆహార సంక్షోభం సమయంలో సాయంగా గోధుమలు పంపాలని భారతీయులు భావిస్తున్నట్లు గోపాల్ కామెంట్ చేశారు.

More From GoodReturns

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+