200 మంది తెలుగువారిని తొలగించిన అమెరికా కంపెనీ.. అక్రమాలకు పాల్పడ్డారంటూ ఆరోపణ..

అమెరికా మోర్టజ్ దిగ్గజం, ఫైనాన్స్ కంపెనీ ఫ్యానీ మే (Fannie Mae) దాదాపు 200 మంది ఉద్యోగులను "నైతిక ప్రాతిపదికన" (ethical grounds) కింద తొలగించినట్లు వార్తలు వెలువడ్డాయి, అయితే వీరిలో ఎక్కువ మంది తెలుగువారే ఉండటం గమనార్హం. ఈ నెల జనవరిలో ఆపిల్ సంస్థ కుపెర్టినో హెడ్ ఆఫీస్'లో కూడా దాదాపు 50 మంది ఉద్యోగులను తొలగించింది, ఇందులో కూడా కొంతమంది భారతీయు ఉన్నారు. ఫ్యానీ మేలో ఆర్థిక అవకతవకలకు సంబంధించి ఈ తొలగింపులు చేసినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. అయితే కంపెనీ నిబంధనలను ఉల్లంఘించినందుకు ఇంకా అనేక అక్రమాలకు పాల్పడినందుకు ఈ తొలగింపులు చేసినట్లు వివరించింది. మరో విషయం ఏంటంటే ఫ్యానీ మే సంస్థ అమెరికా ప్రభుత్వ ఆధ్వర్యంలో నడుస్తుంది.

US Mortgage Giant Fannie Mae Donation Scam Fires 200 Employees Mostly Linked To Telugu Groups

ఫెన్నీ మే అని పిలువబడే ఫెడరల్ నేషనల్ మార్ట్‌గేజ్ అసోసియేషన్‌లో 200 మంది భారతీయ-అమెరికన్ ఉద్యోగులు పనిచేస్తున్నారు. సమాచారం ప్రకారం, సంస్థలోని కొంతమంది తెలుగు వారు కలిసి నకిలీ ధార్మిక సంస్థలను ఏర్పాటు చేశారని, ఈ స్వచ్ఛంద సంస్థలకి వారి నుంచి కంపెనీ నుండి ఆర్థిక సహాయం పొందారని, ఆ తర్వాత వారు ఆ ఆర్థిక సహాయాన్ని సొంత స్వార్థానికి ఉపయోగించుకున్నారని తెలిపింది. తెలుగు అసోసియేషన్ ఆఫ్ నార్త్ అమెరికా (TANA)తో కుమ్మక్కై కంపెనీలను మోసం చేసి నిధులను దుర్వినియోగం చేశారనే ఆరోపణలు చాల మంది తెలుగు ఉద్యోగులపై ఉన్నాయి. అయితే ఈ అవకతవకల్లో ఉత్తర అమెరికా తెలుగు సంఘం కూడా దర్యాప్తులో ఇరుక్కుపోయింది.

తొలగింపుకు గురైనా తెలుగు ఉద్యోగులలో ఒకరు తానాలో ప్రాంతీయ ఉపాధ్యక్షురాలిగా ఉన్నారని, మరొకరు అమెరికన్ తెలుగు అసోసియేషన్ (ATA) మాజీ అధ్యక్షుడి భార్య అని చెబుతున్నారు. ఇందులో తానా ఒక్కటే సంస్థ కాదని, ఇతర తెలుగు సంఘాలు కూడా దర్యాప్తులో ఉన్నాయని వార్తలు వచ్చాయి.

మరోవైపు ఆపిల్‌లో జరిగిన కుంభకోణం ఈ ఘటనని హై లెట్ చేస్తుంది. ఆపిల్ సంస్థ కూడా భారీగా తెలుగు ఉద్యోగులను (ఆంధ్రప్రదేశ్ ఇంకా తెలంగాణ) తొలగించింది. ఆపిల్ బే ఏరియా ఆఫీసులో పనిచేస్తున్న ఉద్యోగులను తొలగించాలని ఆదేశించింది. మ్యాచింగ్ గ్రాంట్స్ ప్రోగ్రాంలో అక్రమాలకు పాల్పడిన కారణంగా తెలుగు వారిని ఉద్యోగాల నుండి తొలగించారు. వీరిలో చాలామంది సీనియర్ మేనేజర్లు ఉండటం గమనార్హం.

ఆపిల్ కేసులో డిసెంబర్ 2024లో కాలిఫోర్నియాలోని నార్తర్న్ డిస్ట్రిక్ట్ కోర్టు TANAకు సమన్లు ​​జారీ చేసింది. 2019 నుండి 2024 వరకు వచ్చిన విరాళాలు, ఖర్చు చేసిన మొత్తాల రికార్డులు అలాగే సంస్థాగత ప్రతినిధుల వివరాలపై సమన్లు ​​డిమాండ్ చేశాయి.

More From GoodReturns

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+