అమెరికా-ఇరాన్ యుద్ధంలో కీలక మలుపు.. జీరో అవర్ హెచ్చరికతో ప్రపంచవ్యాప్తంగా ఆందోళన..

పశ్చిమాసియాలో అమెరికా - ఇరాన్ దేశాల మధ్య ముదిరిన సైనిక ఉద్రిక్తతలు శుక్రవారం నాటి పరిణామాలతో భీకర రూపం దాల్చాయి. ఇరు దేశాలు పరస్పరం దాడులు, ప్రతిదాడులు, తీవ్రస్థాయి హెచ్చరికలకు దిగడంతో గల్ఫ్ ప్రాంతంలో ఒక్కసారిగా యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి.

అమెరికా సైన్యం ఇరాన్‌కు చెందిన కీలక సైనిక లక్ష్యాలపై వైమానిక, నావికా దాడుల కొత్త విడతను ప్రారంభించింది. అమెరికా బలగాలు వరుసగా ఏడవ రాత్రి కూడా ఈ సైనిక చర్యలను కొనసాగించడం గమనార్హం. యూఎస్ సెంట్రల్ కమాండ్ (CENTCOM) తెలిపిన వివరాల ప్రకారం.. తూర్పు కాలమానం ప్రకారం శుక్రవారం మధ్యాహ్నం 3 గంటల ప్రాంతంలో ఈ తాజా దాడులు జరిగాయి. ఇరాన్ యొక్క సైనిక సామర్థ్యాలను బలహీనపరచడం, ప్రాంతీయ భద్రతతో పాటు అంతర్జాతీయ వాణిజ్య నౌకా మార్గాలకు ముప్పు కలిగించే టెహ్రాన్ సామర్థ్యాన్ని దెబ్బతీయడమే లక్ష్యంగా అమెరికా ఈ దాడులు జరిపింది.

US Iran War US Strikes Iran IRGC Zero Hour Iran News Middle East Conflict US Airstrikes Iran Retaliation Strait of Hormuz Oil Prices Geopolitical Tensions World News Breaking News US Iran War IRGC Zero Hour

ఈ ప్రచారంలో భాగంగా అమెరికా యుద్ధ విమానాలు, డ్రోన్లు, యుద్ధ నౌకలు ఏకకాలంలో పాల్గొని తీరప్రాంత నిఘా కేంద్రాలు, వాయు రక్షణ వ్యవస్థలు, సైనిక లాజిస్టిక్స్ కేంద్రాలు, సముద్ర ఆస్తులతో సహా డజన్ల కొద్దీ ఇరాన్ సైనిక స్థావరాలను లక్ష్యంగా చేసుకున్నాయి. కాగాఅ మెరికా జరిపిన తాజా దాడుల సమయంలో హార్మోజ్‌గాన్ ప్రావిన్స్‌లోని సిరిక్ నగరంలో మూడు భారీ పేలుళ్లు వినిపించాయని ఇరాన్ ప్రభుత్వ మీడియా నివేదించింది. ఈ దాడుల వల్ల దేశంలోని కొన్ని పౌర మౌలిక సదుపాయాలు దెబ్బతిన్నాయని.. పలువురు పౌరులు మరణించడం లేదా గాయపడటం జరిగిందని ఇరాన్ పేర్కొంది. ఈ సంఘర్షణ నేపథ్యంలో అమెరికా ఈ ప్రాంతమంతటా దాదాపు 50 వేల మందికి పైగా సైనికులను సర్వసన్నద్ధంగా ఉంచింది.

అమెరికా దాడులకు వ్యతిరేకంగా ఇరాన్ సైన్యం కూడా వరుస హెచ్చరికలు, సైనిక ప్రకటనలతో గట్టిగా స్పందించింది. ఈ ప్రాంతంలో పనిచేస్తున్న అమెరికా నావికా దళాల ప్రతి కదలికను తాము నిశితంగా గమనిస్తున్నామని ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ (IRGC) నావికాదళం పేర్కొంది. అమెరికా బలగాలు జీరో అవర్ అని పిలిచే ఆపరేషన్లకు దగ్గరవుతున్నాయని.. ఉద్రిక్తతలు మరింత పెరిగితే టెహ్రాన్ నుండి భారీ సైనిక ప్రతిస్పందన, ప్రతీకార దాడులు ఉంటాయని వాషింగ్టన్‌ను హెచ్చరించింది.

Also Read

ఈ హెచ్చరిక వెలువడిన కొద్దిసేపటికే.. ఉత్తర హిందూ మహాసముద్రంలో ఇరాన్ సైన్యం ఆపరేషన్ లైట్నింగ్ పేరిట చేపట్టిన సైనిక చర్య పదమూడవ దశను ప్రకటించింది. ఇరాన్ నౌకాదళం తాము దురాక్రమణదారుగా అభివర్ణించిన ఒక అమెరికా నౌకపై తీరం నుండి సముద్రంలోకి ప్రయోగించే క్రూయిజ్ క్షిపణులను ప్రయోగించింది. ఈ క్షిపణి దాడి భయంతో అమెరికా నౌక ఆ ప్రాంతం నుండి వైదొలగాల్సి వచ్చిందని ఇరాన్ అధికారులు వాదించినప్పటికీ.. అమెరికా దీనిని బహిరంగంగా ధృవీకరించలేదు. దీనితో పాటు, ఇరాన్ లోపల అమెరికా జరుపుతున్న దాడులకు ప్రతిస్పందనగా ఖతార్, కువైట్, జోర్డాన్, ఒమన్, సిరియా దేశాలలో ఉన్న అమెరికా నౌకాదళ, సైనిక స్థావరాలను లక్ష్యంగా చేసుకుని వేర్వేరు ఆపరేషన్లను ఇరాన్ సాయుధ దళాలు ప్రకటించాయి.

గతంలో వాషింగ్టన్ - టెహ్రాన్ మధ్య ఉద్రిక్తతలను తగ్గించడానికి ఒక చట్రంగా పనిచేసిన 14-అంశాల అవగాహన ఒప్పందం కుప్పకూలిన నేపథ్యంలోనే ఈ ఘర్షణ వాతావరణం ఏర్పడింది. ఇరుపక్షాలు ఎక్కడా తగ్గకుండా సైనిక చర్యలను ముమ్మరం చేస్తుండటంతో, ప్రపంచంలోనే అత్యంత వ్యూహాత్మక ప్రాముఖ్యత గల గల్ఫ్ ప్రాంతంలో సముద్ర భద్రతకు తీవ్ర భంగం కలిగి.. ఇది ఒక విస్తృత అంతర్జాతీయ సంఘర్షణగా మారుతుందనే ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+