అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రెండోసారి పదవిలోకి వచ్చిన తర్వాత కఠిన నిర్ణయాలతో ప్రపంచ దేశాలకు షాక్ ఇస్తూ వస్తున్నారు. ముందుగా వీసాపై తీసుకున్న చర్యలు ప్రపంచ వ్యాప్తంగా తీవ్ర ఆందోళనకరంగా మారాయి. ట్రంప్ చేపట్టిన కఠిన ఇమ్మిగ్రేషన్ అమలు చర్యలలో భాగంగా US డిపార్ట్మెంట్ ఆఫ్ స్టేట్ భారీ స్థాయిలో వీసా రద్దులకు చర్యలు చేపట్టింది. విద్యార్థులు, ప్రత్యేక నైపుణ్య కార్మికులు సహా మొత్తం లక్ష కంటే ఎక్కువ వీసాలను ఏడాది కాలంలో రద్దు చేసినట్లు అమెరికా విదేశాంగ శాఖ అధికారికంగా ప్రకటించింది. ఈ నిర్ణయం ప్రజా భద్రత, జాతీయ భద్రతలను ప్రధానంగా ఉద్దేశించి తీసుకున్న చర్యగా ప్రభుత్వం స్పష్టం చేసింది.
గతంలో ట్విట్టర్గా ఉన్న X వేదికపై స్టేట్ డిపార్ట్మెంట్ విడుదల చేసిన ప్రకటనలో.. ఇప్పటివరకు లక్షకు పైగా వీసాలను రద్దు చేసినట్లు వెల్లడించింది. వీటిలో దాదాపు 8 వేల స్టూడెంట్ వీసాలు ఉండగా, మరో 2,500 వీసాలు ప్రత్యేక కేటగిరీ కార్మికులకు చెందినవిగా పేర్కొంది. ఈ వీసాలు ప్రధానంగా నేర కార్యకలాపాలకు పాల్పడిన వ్యక్తులకు సంబంధించినవని స్పష్టం చేసింది.అమెరికాను సురక్షితంగా ఉంచేందుకు ఈ దుండగులను దేశం వెలుపలికి పంపించడాన్ని కొనసాగిస్తామని స్టేట్ డిపార్ట్మెంట్ స్పష్టంగా పేర్కొంది.

స్టేట్ డిపార్ట్మెంట్ డిప్యూటీ ప్రతినిధి టామీ పిగోట్ ప్రకారం ఈ వీసా రద్దులు.. దాడి, దొంగతనం, మద్యం సేవించి వాహనం నడపడం (DUI) వంటి నేరాలకు పాల్పడిన లేదా దోషులుగా తేలిన విదేశీ పౌరులను కవర్ చేస్తున్నాయి. ఒక సంవత్సరంలోపే లక్షకు పైగా వీసాలను రద్దు చేయడం ఇమ్మిగ్రేషన్ చట్టాల అమలులో కీలకమైన ముందడుగు అని ఆమె పేర్కొన్నారు.
ఫాక్స్ న్యూస్ నివేదిక ప్రకారం.. 2025లో రద్దు చేయబడిన వీసాల సంఖ్య చరిత్రలోనే అత్యధికంగా ఉంది. ఇది 2024లో మాజీ అధ్యక్షుడు జో బైడెన్ పాలనలో రద్దు చేసిన మొత్తం వీసాల సంఖ్య కంటే రెండింతలకు పైగా ఉండటం గమనార్హం చెప్పుకోవచ్చు. ఈ గణాంకాలు ట్రంప్ పరిపాలన తీసుకుంటున్న కఠిన వైఖరిని స్పష్టంగా చూపిస్తున్నాయని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
వీసా రద్దులలో ఎక్కువ భాగం వ్యాపార, పర్యాటక వీసాలతో అమెరికాకు వచ్చినవారు గడువు ముగిసిన తర్వాత కూడా అక్కడే అక్రమంగా ఉండిపోయిన కేసులకు సంబంధించినవిగా విదేశాంగ శాఖ వెల్లడించింది. అలాగే మద్యం సేవించి వాహనం నడపడం, దాడి, దొంగతనం, పిల్లలపై దుర్వినియోగం, మోసం వంటి తీవ్రమైన ఆరోపణలు ఎదుర్కొన్న వారిపైనా ఈ చర్యలు తీసుకున్నారు. ముఖ్యంగా విద్యార్థుల విషయంలో కూడా ప్రభుత్వం కఠినంగా వ్యవహరించింది. మాదకద్రవ్యాల స్వాధీనం, పంపిణీ కేసులతో సంబంధం ఉన్న దాదాపు 500 మంది విదేశీ విద్యార్థుల వీసాలను రద్దు చేసినట్లు నివేదికలు చెబుతున్నాయి. ఇది అంతర్జాతీయ విద్యార్థుల వర్గాల్లో ఆందోళన కలిగించే అంశంగా మారింది.
ఈ వీసా రద్దుల చర్యలు ట్రంప్ పరిపాలన తీసుకువస్తున్న విస్తృత ఇమ్మిగ్రేషన్ మార్పులలో భాగంగా చోటు చేసుకున్నాయి. అక్రమ వలసలను అరికట్టడం, బహిష్కరణలను వేగవంతం చేయడంతో పాటు, వీసా జారీకి మరింత కఠినమైన ప్రమాణాలను అమలు చేస్తున్నారు. ప్రజా భద్రత, జాతీయ భద్రతకు ప్రాధాన్యత ఇస్తూ అమెరికా ఇమ్మిగ్రేషన్ విధానాన్ని మరింత కఠినతరం చేయడమే ఈ చర్యల లక్ష్యమని ప్రభుత్వం స్పష్టం చేసింది.
More From GoodReturns

Iran war: కేవలం గ్యాస్ ఒక్కటే కాదు.. ఈ 5 రంగాలపై భారీ ఎఫెక్ట్ ఉండే అవకాశం?

Iran war: త్వరలోనే యుద్ధం ముగింపు? ట్రంప్ వ్యాఖ్యలతో చమురు ధరల్లో భారీ మార్పు!

కొంపలు ముంచుతున్న ఇరాన్ యుద్ధం.. కొనేవారు లేక దుబాయ్లో కుప్పలు కుప్పలుగా పడిన బంగారం ..

బంగారంపై షాకిస్తున్న వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ రిపోర్ట్.. వచ్చే 15 రోజులు పసిడి ప్రియుల గుండెల్లో దడదడ..

బంగారం ధరలు పతనం కాబోతున్నాయి.. వెనిజులా బంగారంపై కన్నేసిన అమెరికా.. ట్రేడ్ డీల్ క్లోజ్..

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

Hyderabad: హైదరాబాద్లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..



Click it and Unblock the Notifications