అమెరికా వెళ్లాలని కలలుగంటున్న భారతీయులకు ఆ దేశం ఓ బ్యాడ్ న్యూస్ చెప్పింది. కొన్ని నాన్-ఇమ్మిగ్రెంట్ వీసాలను సంబంధించిన ధరఖాస్తు రుసుమును పెంచుతూ US స్టేట్ డిపార్ట్ మెంట్ నిర్ణయం తీసుకుంది. దీనివల్ల స్టూడెంట్, టూరిస్ట్ వీసాల ధరలు పెరగనున్నాయి. సందర్శకుల వీసాపై ఈ ధరను 160 డాలర్ల నుంచి 185కి పెంచారు. ఇతర వాటిని పరిశీలిస్తే మొత్తంగా 15 నుంచి 110 డాలర్ల మేర ఫీజులు పెంచినట్లు అక్కడి విదేశాంగ శాఖ ప్రకటించింది.
తాత్కాలిక వృత్తిదారులకు ఇచ్చే నాన్-ఇమ్మిగ్రెంట్ వీసా ఫీజుపై 15 డాలర్లు, ప్రత్యేక వృత్తి నిపుణుల వీసాలపై 110 డాలర్ల మేరకు అమెరికా అదనంగా వడ్డించనుంది. కొత్త ధరలు ఈ ఏడాది మే 30 నుంచి అమల్లోకి వస్తాయని సంబంధిత శాఖ తెలిపింది. ఈ నిర్ణయంతో అక్కడి యూనివర్సిటీల్లో ప్రవేశాలు పొందిన భారతీయ విద్యార్థుల్లో తీవ్ర ఆందోళన నెలకొంది. వేలాది రూపాయలు ఎక్కువగా చెల్లించాల్సి వస్తుందని వాపోతున్నారు.

వీసా రేట్ల పెంపు గురించి US డిపార్ట్ మెంట్ ఆఫ్ స్టేట్ ఓ ప్రకటన విడుదల చేసింది. నిర్దిష్ట మార్పిడి సందర్శకులకు మాత్రం రెండేళ్ల పాటు రెసిడెన్సీ రుసుముతో ఇతర కాన్సులర్ ఫీజుల్లో మినహాయింపు కొనసాగుతుందని పేర్కొంది. గతేడాది అక్టోబర్ 1 తర్వాత జరిగిన వీసా ఇంటర్వ్యూలకు సంబంధించి జరిపిన చెల్లింపు ఏడాది పాటు చెల్లుబాటు అవుతుందని వెల్లడించింది. అంటే సెప్టెంబర్ 2023 వరకు ఇబ్బందిలేదన్న మాట.
అయితే దరఖాస్తుదారులు ముందస్తుగా ఇంటర్వ్యూను షెడ్యూల్ చేయాలి లేదా సెప్టెంబర్ 30 లోపు మినహాయింపు దరఖాస్తును సమర్పించాలని US విదేశాంగ శాఖ తన ప్రకటనలో తెలిపింది. తమ దేశంలోకి ప్రవేశించ తలిచిన వలసదారులందరి ప్రయాణాన్ని సులభతరం చేసేందుకు పనిచేస్తున్నట్లు వెల్లడించింది. ఈ విషయంలో దరఖాస్తుదారులు సహకరించాలని కోరింది.
More From GoodReturns

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్గా కానిచ్చేస్తున్నారు!

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?



Click it and Unblock the Notifications