అమెరికా వెళ్లాలనుకునే H-1B వీసా దరఖాస్తుదారులకు ట్రంప్ సర్కారు భారీ షాకిచ్చింది. అమెరికా విదేశాంగ శాఖ గతంలో జారీ చేసిన ఉత్తర్వుల మేరకు.. డిసెంబర్ 15 నుంచి అన్ని H-1B వీసా దరఖాస్తుదారులు, వారిపై ఆధారపడిన H-4 వీసా దరఖాస్తుదారుల సోషల్ మీడియా ఖాతాలను తప్పనిసరిగా స్క్రీనింగ్ చేయడం ప్రారంభించింది. డొనాల్డ్ ట్రంప్ నేతృత్వంలోని అధికారులు వలస విధానాలను మరింత కఠినతరం చేస్తుండటంతో.. ఈ నిర్ణయం తీసుకున్నట్లు అమెరికా అధికారులు స్పష్టం చేస్తున్నారు.
అమెరికా విదేశాంగ శాఖ ప్రకారం.. యుఎస్ వీసా అనేది ఒక హక్కు కాదు, అది ఒక ప్రత్యేక హక్కు మాత్రమే. దేశ భద్రతకు లేదా ప్రజా భద్రతకు ముప్పుగా మారే అవకాశమున్న వ్యక్తులను ముందుగానే గుర్తించడమే ఈ సోషల్ మీడియా స్క్రీనింగ్ లక్ష్యమని ఆ ఉత్తర్వులో పేర్కొన్నారు. డిసెంబర్ 3న జారీ చేసిన ఉత్తర్వు ప్రకారం.. H-1B, H-4 వీసాలకే కాకుండా F, M, J వంటి నాన్-ఇమ్మిగ్రెంట్ వీసా దరఖాస్తుదారులు కూడా తమ సోషల్ మీడియా ఖాతాల గోప్యతా సెట్టింగులను పబ్లిక్ గా మార్చాల్సి ఉంటుంది. ఈ ఆన్లైన్ ఉనికిని పరిశీలించి, వీసా మంజూరు చేయాలా వద్దా అన్నది నిర్ణయిస్తారు.

అమెరికా జాతీయ భద్రతకు వ్యతిరేకంగా వ్యాఖ్యలు, హింసాత్మక లేదా ద్వేషపూరిత కంటెంట్, ఉగ్రవాద సంస్థలకు మద్దతు వంటి అంశాలు ఉన్నాయా అనే కోణంలో అధికారులు సోషల్ మీడియా పోస్టులను పరిశీలించే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. H-1B వీసా పొందుతున్న వారిలో అత్యధికులు భారతీయులే. అమెరికా ప్రభుత్వ డేటా ప్రకారం.. మొత్తం H-1B వీసాలలో 70 శాతానికి పైగా భారతీయులకే మంజూరవుతున్నాయి. ప్రస్తుతం అమెరికాలో దాదాపు 3 లక్షల మంది భారతీయులు H-1B వీసాలపై పనిచేస్తున్నారు. వీరిలో ఎక్కువ మంది ఐటీ, టెక్నాలజీ, సేవల రంగాల్లో ఉన్నారు.
ఈ నేపథ్యంలో సోషల్ మీడియా స్క్రీనింగ్ అమలుతో భారతీయ దరఖాస్తుదారులే ఎక్కువగా ప్రభావితమయ్యే అవకాశముందని ఇమ్మిగ్రేషన్ నిపుణులు అంచనా వేస్తున్నారు. ఈ కొత్త నిబంధనలు అమల్లోకి రాకముందే.. భారతదేశంలోని అమెరికా రాయబార కార్యాలయం, కాన్సులేట్లు అనేక వీసా ఇంటర్వ్యూలను రీషెడ్యూల్ చేశాయి. దీంతో చాలా మంది H-1B, H-4 దరఖాస్తుదారులు భారత్లోనే చిక్కుకుపోయారు. కొందరి ప్రయాణ ప్రణాళికలు పూర్తిగా గందరగోళానికి గురయ్యాయి.
ఇమ్మిగ్రేషన్ న్యాయవాదులు హెచ్చరిస్తున్నదేమిటంటే.. భారతదేశంలో ఎక్కువ కాలం చిక్కుకుపోతే, కొంతమంది H-1B కార్మికులు తమ ఉద్యోగాలను కూడా కోల్పోయే ప్రమాదం ఉంది. అయితే అధికారికంగా ఏ అంశాలను పరిశీలిస్తారన్నది పూర్తిగా స్పష్టం చేయలేదు. అయితే గతంలో విద్యార్థి వీసాల సందర్భంలో ఇచ్చిన మార్గదర్శకాల ఆధారంగా.. ఉగ్రవాద సంస్థలకు మద్దతు, ద్వేష ప్రసంగాలు, హింసకు ప్రేరేపించే వ్యాఖ్యలు వంటి అంశాలపై ప్రత్యేకంగా దృష్టి పెట్టే అవకాశం ఉంది. ఈ నిర్ణయం డిజిటల్ గోప్యతపై దాడి అని పలువురు విమర్శిస్తున్నారు. అయితే అమెరికా ప్రభుత్వం మాత్రం ఇది జాతీయ భద్రత కోసమేనని స్పష్టం చేస్తోంది.
More From GoodReturns

మాట తప్పిన అమెరికాతో చర్చలు ఇక ఉండవని స్పష్టం చేసిన ఇరాన్.. గల్ఫ్ దేశాల తాగునీటిపై గురి పెట్టిన టెహ్రాన్..

అమెరికా నష్టపరిహారం ఇచ్చేదాకా యుద్ధం ఆపే సమస్యే లేదు.. సూటిగా వార్నింగ్ ఇచ్చిన ఇరాన్..

ఇరాన్ను ఎదిరించలేని పిరికిపందలు..మీ చావు మీరు చావాలంటూ నాటో దేశాలపై విరుచుకుపడిన ట్రంప్..

ట్రంప్ మరో భారీ స్కెచ్.. ఇరాన్ హార్ట్ అయిన ఖర్గ్ ద్వీపంపై కన్ను.. ఏ క్షణమైనా మిసైళ్లతో దాడి..

వెండి ధరలు బిగ్ క్రాష్.. దెబ్బకు నిలిచిపోయిన ట్రేడింగ్.. లబోదిబోమంటున్న పెట్టుబడిదారులు

iPhone 18 Pro : ఐఫోన్ 18 ప్రో సిరీస్ వచ్చేస్తోంది! ఇండియాలో ధర ఎంతంటే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

బంగారంతో కొత్త గేమ్ మొదలుపెట్టిన రష్యా.. ఇరాన్ యుద్ధం వేళ భారీగా డబ్బులు పోగేసుకోవడానికి..

Bengaluru: బెంగళూరు వాసులకు గుడ్ న్యూస్! రెండో ఎయిర్పోర్ట్ ఎక్కడో క్లారిటీ వచ్చేసింది!

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..



Click it and Unblock the Notifications