అమెరికా వెళ్లాలనుకునే H-1B వీసా దరఖాస్తుదారులకు ట్రంప్ సర్కారు భారీ షాకిచ్చింది. అమెరికా విదేశాంగ శాఖ గతంలో జారీ చేసిన ఉత్తర్వుల మేరకు.. డిసెంబర్ 15 నుంచి అన్ని H-1B వీసా దరఖాస్తుదారులు, వారిపై ఆధారపడిన H-4 వీసా దరఖాస్తుదారుల సోషల్ మీడియా ఖాతాలను తప్పనిసరిగా స్క్రీనింగ్ చేయడం ప్రారంభించింది. డొనాల్డ్ ట్రంప్ నేతృత్వంలోని అధికారులు వలస విధానాలను మరింత కఠినతరం చేస్తుండటంతో.. ఈ నిర్ణయం తీసుకున్నట్లు అమెరికా అధికారులు స్పష్టం చేస్తున్నారు.
అమెరికా విదేశాంగ శాఖ ప్రకారం.. యుఎస్ వీసా అనేది ఒక హక్కు కాదు, అది ఒక ప్రత్యేక హక్కు మాత్రమే. దేశ భద్రతకు లేదా ప్రజా భద్రతకు ముప్పుగా మారే అవకాశమున్న వ్యక్తులను ముందుగానే గుర్తించడమే ఈ సోషల్ మీడియా స్క్రీనింగ్ లక్ష్యమని ఆ ఉత్తర్వులో పేర్కొన్నారు. డిసెంబర్ 3న జారీ చేసిన ఉత్తర్వు ప్రకారం.. H-1B, H-4 వీసాలకే కాకుండా F, M, J వంటి నాన్-ఇమ్మిగ్రెంట్ వీసా దరఖాస్తుదారులు కూడా తమ సోషల్ మీడియా ఖాతాల గోప్యతా సెట్టింగులను పబ్లిక్ గా మార్చాల్సి ఉంటుంది. ఈ ఆన్లైన్ ఉనికిని పరిశీలించి, వీసా మంజూరు చేయాలా వద్దా అన్నది నిర్ణయిస్తారు.

అమెరికా జాతీయ భద్రతకు వ్యతిరేకంగా వ్యాఖ్యలు, హింసాత్మక లేదా ద్వేషపూరిత కంటెంట్, ఉగ్రవాద సంస్థలకు మద్దతు వంటి అంశాలు ఉన్నాయా అనే కోణంలో అధికారులు సోషల్ మీడియా పోస్టులను పరిశీలించే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. H-1B వీసా పొందుతున్న వారిలో అత్యధికులు భారతీయులే. అమెరికా ప్రభుత్వ డేటా ప్రకారం.. మొత్తం H-1B వీసాలలో 70 శాతానికి పైగా భారతీయులకే మంజూరవుతున్నాయి. ప్రస్తుతం అమెరికాలో దాదాపు 3 లక్షల మంది భారతీయులు H-1B వీసాలపై పనిచేస్తున్నారు. వీరిలో ఎక్కువ మంది ఐటీ, టెక్నాలజీ, సేవల రంగాల్లో ఉన్నారు.
ఈ నేపథ్యంలో సోషల్ మీడియా స్క్రీనింగ్ అమలుతో భారతీయ దరఖాస్తుదారులే ఎక్కువగా ప్రభావితమయ్యే అవకాశముందని ఇమ్మిగ్రేషన్ నిపుణులు అంచనా వేస్తున్నారు. ఈ కొత్త నిబంధనలు అమల్లోకి రాకముందే.. భారతదేశంలోని అమెరికా రాయబార కార్యాలయం, కాన్సులేట్లు అనేక వీసా ఇంటర్వ్యూలను రీషెడ్యూల్ చేశాయి. దీంతో చాలా మంది H-1B, H-4 దరఖాస్తుదారులు భారత్లోనే చిక్కుకుపోయారు. కొందరి ప్రయాణ ప్రణాళికలు పూర్తిగా గందరగోళానికి గురయ్యాయి.
ఇమ్మిగ్రేషన్ న్యాయవాదులు హెచ్చరిస్తున్నదేమిటంటే.. భారతదేశంలో ఎక్కువ కాలం చిక్కుకుపోతే, కొంతమంది H-1B కార్మికులు తమ ఉద్యోగాలను కూడా కోల్పోయే ప్రమాదం ఉంది. అయితే అధికారికంగా ఏ అంశాలను పరిశీలిస్తారన్నది పూర్తిగా స్పష్టం చేయలేదు. అయితే గతంలో విద్యార్థి వీసాల సందర్భంలో ఇచ్చిన మార్గదర్శకాల ఆధారంగా.. ఉగ్రవాద సంస్థలకు మద్దతు, ద్వేష ప్రసంగాలు, హింసకు ప్రేరేపించే వ్యాఖ్యలు వంటి అంశాలపై ప్రత్యేకంగా దృష్టి పెట్టే అవకాశం ఉంది. ఈ నిర్ణయం డిజిటల్ గోప్యతపై దాడి అని పలువురు విమర్శిస్తున్నారు. అయితే అమెరికా ప్రభుత్వం మాత్రం ఇది జాతీయ భద్రత కోసమేనని స్పష్టం చేస్తోంది.
More From GoodReturns

Iran war: కేవలం గ్యాస్ ఒక్కటే కాదు.. ఈ 5 రంగాలపై భారీ ఎఫెక్ట్ ఉండే అవకాశం?

Iran war: త్వరలోనే యుద్ధం ముగింపు? ట్రంప్ వ్యాఖ్యలతో చమురు ధరల్లో భారీ మార్పు!

కొంపలు ముంచుతున్న ఇరాన్ యుద్ధం.. కొనేవారు లేక దుబాయ్లో కుప్పలు కుప్పలుగా పడిన బంగారం ..

బంగారంపై షాకిస్తున్న వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ రిపోర్ట్.. వచ్చే 15 రోజులు పసిడి ప్రియుల గుండెల్లో దడదడ..

బంగారం ధరలు పతనం కాబోతున్నాయి.. వెనిజులా బంగారంపై కన్నేసిన అమెరికా.. ట్రేడ్ డీల్ క్లోజ్..

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

Hyderabad: హైదరాబాద్లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..



Click it and Unblock the Notifications