అమెరికా చరిత్రలో అతి పొడవైన 43 రోజుల ప్రభుత్వ షట్డౌన్ చివరికి ఎట్టకేలకు ముగిసింది. రాయిటర్స్ నివేదిక ప్రకారం.. ఆహార సహాయాన్ని పునరుద్ధరించడానికి, సమాఖ్య ఉద్యోగులకు వేతనాలు చెల్లించడానికి, విమాన-ట్రాఫిక్ నియంత్రణ వ్యవస్థను తిరిగి ప్రారంభించడానికి అమెరికా కాంగ్రెస్ బుధవారం నాడు తుది ఒప్పందాన్ని ఆమోదించింది.
రిపబ్లికన్ పార్టీ ఆధిపత్యంలోని హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్ 222-209 ఓట్ల తేడాతో నిధుల బిల్లును ఆమోదించింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మద్దతు ఉన్నప్పటికీ, డెమోక్రాట్లు తీవ్రంగా వ్యతిరేకించారు. సెనేట్లో ఈ బిల్లుకు ఇప్పటికే ఆమోదం లభించగా, ట్రంప్ బుధవారం తర్వాత సంతకం చేయనున్నట్లు వైట్ హౌస్ ప్రకటించింది.

ఈ చట్టం ద్వారా ప్రభుత్వ నిధులు జనవరి 30 వరకు పొడిగించబడతాయి. అయితే దీని వల్ల అమెరికా జాతీయ రుణం 38 ట్రిలియన్ డాలర్లకు చేరుకొని, ఏటా సుమారు 1.8 ట్రిలియన్ డాలర్లను పెంచే పరిస్థితి ఏర్పడుతుందని విశ్లేషకులు హెచ్చరించారు.ఈ షట్డౌన్ ప్రధానంగా ఫెడరల్ హెల్త్ ఇన్సూరెన్స్ సబ్సిడీల పొడిగింపుపై ఉద్భవించిన రాజకీయ ప్రతిష్టంభనతో మొదలైంది. సెనేట్, హౌస్ మధ్య బడ్జెట్ ఒప్పందంపై అనేక వారాలుగా చర్చలు సాగాయి కానీ అవి విఫలమయ్యాయి.
అరిజోనాకు చెందిన రిపబ్లికన్ ప్రతినిధి డేవిడ్ ష్వీకెర్ట్ ఈ పరిణామాన్ని వ్యంగ్యంగా వివరిస్తూ.. ఇది సీన్ఫెల్డ్ ఎపిసోడ్లా ఉంది. కథాంశం లేని కామెడీ! 48 గంటల్లో ముగుస్తుందని అనుకున్నాం, కానీ 43 రోజులు గడిచాయని అన్నారు. డెమోక్రాట్లు ఈ బిల్లును పూర్తి విజయం కాని తాత్కాలిక పరిష్కారం"గా పేర్కొన్నారు. హౌస్ స్పీకర్ మైక్ జాన్సన్ సబ్సిడీల పొడిగింపు విషయంలో హామీ ఇవ్వలేదని వారు విమర్శించారు.న్యూజెర్సీకి చెందిన డెమోక్రటిక్ ప్రతినిధి మికీ షెర్రిల్ మాట్లాడుతూ.. తన పదవీ విరమణకు ముందు చివరి ప్రసంగంలో ఈ బిల్లును తీవ్రంగా ఖండించారు. పిల్లల ఆహారం తీసివేసి, ఆరోగ్య సంరక్షణను తగ్గించే పరిపాలనకు కాంగ్రెస్ ముద్ర వేయకండి. నేవీ మాదిరిగా, ఓడను వదులుకోకండని అన్నారు.
రాయిటర్స్/ఇప్సోస్ తాజా సర్వే ప్రకారం 50 శాతం అమెరికన్లు షట్డౌన్కు రిపబ్లికన్లను నిందించగా.. 47 శాతం మంది డెమోక్రాట్లను నిందించారు. అంటే ఈ వివాదం రెండు పార్టీలకూ రాజకీయంగా దెబ్బతీసినట్లేనని చెప్పవచ్చు. Shutdown సమయంలో వేలాది ఫెడరల్ ఉద్యోగులు వేతనాలు పొందలేకపోయారు. విమాన సర్వీసులు, ఆహార పంపిణీ కార్యక్రమాలు అడ్డంకులకు గురయ్యాయి. ఈ ఒప్పందంతో అవి తిరిగి ప్రారంభం కానున్నాయి.
ఏదేమైనా 43 రోజుల ప్రతిష్టంభన తర్వాత.. అమెరికా ప్రభుత్వం తిరిగి కార్యకలాపాలను ప్రారంభించబోతోంది. ఫెడరల్ ఉద్యోగులకు వేతనాలు చెల్లించబడతాయి.ఆహార సహాయ పథకాలు, విమాన రవాణా నియంత్రణ సేవలు పునరుద్ధరించబడతాయి. అయితే, ఈ తాత్కాలిక ఒప్పందం జనవరి చివరి వరకు మాత్రమే చెల్లుబాటు అవుతుంది. అందువల్ల మరో బడ్జెట్ వివాదం వచ్చే అవకాశాన్ని విశ్లేషకులు విస్మరించడం లేదని తెలుస్తోంది.
More From GoodReturns

మిత్రుడిని అమెరికా చంపేస్తుంటే మౌనంగా చూస్తుండిపోయిన చైనా.. సైలెంట్ వెనక మిస్టరీ ఇదే..

యుద్ధం మొదలైంది.. అమెరికా సత్తా ఏంటో ఇరాన్కు చూపిస్తాం.. ట్రంప్ సంచలన వ్యాఖ్యలు..

ఇరాన్–అమెరికా యుద్ధంపై షాకింగ్ న్యూస్.. ఎవరి ఆయుధాలు ముందుగా అయిపోతాయో తెలుసా..

ఇరాన్పై యుద్ధంతో ఖాళీ అవుతున్న అమెరికా ఖజానా.. తొలి 24 గంటల్లోనే రూ. 7 వేల కోట్లకు పైగా ఖర్చు..

బంగారం ధరలు పతనం కాబోతున్నాయి.. వెనిజులా బంగారంపై కన్నేసిన అమెరికా.. ట్రేడ్ డీల్ క్లోజ్..

ఇరాన్ మీద దాడులు.. బట్ట బయలైన అమెరికా కుట్రలు.. ప్రపంచానికి నిజాన్ని తెలిపిన స్పెయిన్..

ఇరాన్పై ఇజ్రాయెల్ మెరుపు దాడి.. సహకరించిన అమెరికా.. మధ్యప్రాచ్యంలో తీవ్ర ఆందోళన..

Anthropic: ఇరాన్ దాడిలో ఆంత్రోపిక్ ఏఐ వినియోగం? అమెరికాలో ముదురుతున్న వివాదం!

భారత ఆర్థిక వ్యవస్థని కుదిపేస్తున్న గల్ఫ్ యుద్ధ మంటలు.. ప్రమాదంలో 9 కోట్ల మంది పంపే డబ్బు ..

Bengaluru: ఒకప్పుడు డబ్బు లేక నేలపై నిద్ర.. నేడు రూ. 800 కోట్ల టర్నోవర్! 23 ఏళ్ల అంజలి ఇన్స్పైరింగ్ జర్నీ!

బంగారం ధరల పెరుగుదలపై దిమ్మతిరిగే న్యూస్.. గత చరిత్రతో కీలక నివేదికను విడుదల చేసిన Kedia Advisory



Click it and Unblock the Notifications