Adani News: చైనాకు చెక్ పెట్టేందుకు అమెరికా గౌతమ్ అదానీని పావుగా వాడుకుంటోంది. పైగా డ్రాగన్ దూకుడుకు కళ్లెం వేయటం అటు అమెరికాతో పాటు ఇటు ఇండియాకు సైతం చాలా కీలకం.
గౌతమ్ అదానీకి సంబంధించిన పెద్ద వార్త ప్రస్తుతం మార్కెట్లో పెద్ద సునామీని సృష్టిస్తోంది. అవును శ్రీలంకలో చైనా ఆధిపత్యాన్ని తగ్గించేందుకు అదానీ గ్రూప్తో ఒప్పందం కుదుర్చుకోవాలని అమెరికా నిర్ణయించింది. ఇందులో భాగంగా శ్రీలంక రాజధాని కొలంబోలో పోర్ట్ టెర్మినల్ నిర్మించేందుకు గౌతమ్ అదానీకి 553 మిలియన్ డాలర్లను అందించాలని నిర్ణయించింది. దీంతో పరోక్షంగా యూఎస్ పరిస్థితులను కంట్రోల్ చేయాలని చూస్తోంది.

ప్రధానంగా దక్షిణాసియా ప్రాంతంలో పెరుగుతున్న చైనా ప్రభావాన్ని తగ్గించేందుకు ఇది పరోక్షంగా దోహదపడే ఒప్పందంగా నిపుణులు చెబుతున్నారు. కొలంబోలోని వేస్ట్ కంటైనర్ టెర్మినల్ను అభివృద్ధి చేసేందుకు గౌతమ్ అదానీ ఇంటర్నేషనల్ డెవలప్మెంట్ ఫైనాన్స్ కార్పొరేషన్ నుంచి ఈ మొత్తాన్ని పొందనున్నారు. US ప్రభుత్వ సంస్థ ఇంటర్నేషనల్ డెవలప్మెంట్ ఫైనాన్స్ కార్పొరేషన్ ఆసియాలో అతిపెద్ద మౌలిక సదుపాయాల పెట్టుబడిగా కొనసాగుతోంది. పైగా అమెరికా శ్రీలంకలో చేస్తున్నది ప్రపంచవ్యాప్తంగా మౌలిక సదుపాయాలలో అతిపెద్ద పెట్టుబడి.
తాజా చర్యతో భారత్-శ్రీలంక మధ్య మెరుగైన సమన్వయం సాధ్యమవుతుందని భావిస్తున్నారు. శ్రీలంకలో ఓడరేవును అభివృద్ధి చేయడానికి గౌతమ్ అదానీకి నిధులు మంజూరు చేయడం కూడా ఇటీవలి కాలంలో శ్రీలంకలో చైనా ప్రభావం పెరుగుతోందని అమెరికా ఆందోళన వల్ల తీసుకున్న నిర్ణయమేనని తెలుస్తోంది. అమెరికన్ ఇన్వెస్ట్మెంట్ కంపెనీ 2023లో ఇప్పటివరకు 9.3 బిలియన్ డాలర్లు పెట్టుబడి పెట్టింది. గతేడాది శ్రీలంకలో చైనా 2.2 బిలియన్ డాలర్లు పెట్టుబడి పెట్టడం ద్వారా అతిపెద్ద విదేశీ ప్రత్యక్ష పెట్టుబడిదారుగా మారింది. పైగా శ్రీలంకను చైనా అప్పుల ఊబిలో బంధిస్తోందని, ఇది ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రతికూల ప్రభావం చూపుతోందని అమెరికా అధికారులు చెబుతున్నారు.
More From GoodReturns

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?



Click it and Unblock the Notifications