అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కోర్టు భారీ షాక్ ఇచ్చింది. అధికారంలోకి రాగానే అమలు చేసిన ట్రేడ్ టారిఫ్స్ పై మన్హట్టన్ అంతర్జాతీయ వాణిజ్య కోర్టు సంచలనాత్మక తీర్పు ఇచ్చింది. ట్రంప్ పాలనలో అమలు చేసిన టారిఫ్లు చట్టవిరుద్ధంగా ఉన్నాయని స్పష్టం చేసింది. ఈ అక్రమ సుంకాలను చెల్లించిన దిగుమతిదారులకు వడ్డీతో సహా తిరిగి చెల్లించాలని ట్రంప్ ప్రభుత్వానికి మాన్హట్టన్లోని US కోర్ట్ ఆఫ్ ఇంటర్నేషనల్ ట్రేడ్ న్యాయమూర్తి రిచర్డ్ ఈటన్ బుధవారం ఆదేశాలు జారీ చేశారు.
ఈ టారిఫ్లు అక్రమంగా విధించబడ్డాయని తెలిపిన ధర్మాసనం.. వెంటనే టారిఫ్ల ద్వారా వసూలు చేసిన సుమారు 130 బిలియన్ డాలర్లను (సుమారు రూ.12 లక్షల కోట్లు) వడ్డీతో సహా దిగుమతిదారులకు తిరిగి చెల్లించాలని కోర్టు ఆదేశించింది. 2025లో రెండో సారి Trump బాధ్యతలు చేపట్టిన తర్వాత.. ఇంటర్నేషనల్ ఎమర్జెన్సీ ఎకనామిక్ పవర్స్ యాక్ట్' (IEEPA) కింద, ప్రపంచవ్యాప్తంగా వస్తువులపై 10 శాతం నుండి 18 శాతం వరకు పన్నులు విధించారు. అయితే, 2026 ఫిబ్రవరి 20న అమెరికా సుప్రీంకోర్టు ఈ పన్నులను రాజ్యాంగ విరుద్ధంగా ప్రకటించింది. కోర్టు తీర్పులో.. పన్ను విధించే అధికారం కేవలం కాంగ్రెస్కు మాత్రమే ఉంటుంది. అధ్యక్షుడికి లేదని స్పష్టం చేసింది.

రిఫండ్ ప్రక్రియ సులభంగా ఉండేలా జడ్జి ఈటన్ ప్రభుత్వానికి కచ్చితమైన ఆదేశాలు ఇచ్చారు. పన్ను వసూలు చేసిన రోజు నుంచి లెక్కించి వడ్డీతో సహా మొత్తం మొత్తాన్ని దిగుమతిదారులకు చెల్లించాల్సి ఉంటుంది. రిఫండ్లు చేయడం మీ సిస్టమ్కు కొత్త విషయం కాదు. వెంటనే సాఫ్ట్వేర్ అప్డేట్ చేసి వ్యాపారస్తుల డబ్బును తిరిగి ఇవ్వండని తెలిపారు. ప్రస్తుతం ట్రంప్ ప్రభుత్వం ఈ తీర్పును సవాలు చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. అయితే ఆ సమయం వరకు ప్రభుత్వం.. ఫిబ్రవరి 24 నుంచి 'సెక్షన్ 122' కింద తాత్కాలికంగా 10 శాతం పన్నులను తిరిగి అమలు చేస్తోంది. ఈ తీర్పుతో సుమారు 3 లక్షల మంది దిగుమతిదారులు ఉపశమనం పొందుతారు.
ఈ రిఫండ్ నిర్ణయం అమెరికా వ్యాపార వర్గాలకు గణనీయమైన ఊరట కలిగించేలా ఉంది. ఇప్పటికే వసూలు చేసిన పన్నులను తిరిగి చెల్లించడం వల్ల..వ్యాపారాల ఆర్థిక స్థితి మెరుగుపడే అవకాశం ఉంది. ఈ పరిణామం గ్లోబల్ ట్రేడ్ మార్కెట్లపై కూడా ప్రభావం చూపుతుంది. ఎందుకంటే అమెరికా మీద ఆధారపడే దిగుమతిదారులు ఈ మొత్తాన్ని తిరిగి పొందుతారు. ఏదేమైనా కోర్టు ఇచ్చిన ఈ ఆదేశం IEEPA (International Emergency Economic Powers Act) కింద దాఖలైన దాదాపు 2 వేల కేసులకు మార్గదర్శకంగా మారుతుంది. అలాగే Atmus Filtration ATMU.N వంటి సంస్థలు ఇప్పటికే దాదాపు 11 మిలియన్ల డాలర్లు చెల్లించారని పేర్కొన్నారు.
న్యాయమూర్తి ఈటన్, అన్ని కేసులను వ్యక్తిగతంగా విచారించాల్సిన అవసరం లేదని.. ప్రతి దిగుమతిదారు చట్టవిరుద్ధ సుంకాలను ఎలా క్లెయిమ్ చేసుకోవచ్చో ఒక సులభమైన పద్ధతిని రూపొందించాలని చెప్పారు. దీనివల్ల CBP వాపసు ప్రక్రియలో ఏ అడ్డంకులు లేకుండా.. ప్రతి ఎంట్రీని సమీక్షించి, సమయానికి వడ్డీతో సహా తిరిగి చెల్లించగలుగుతుందన్నారు.ఈ తీర్పు అక్రమ టారిఫ్లపై అమెరికా వ్యాపారులకు, దిగుమతిదారులకు, గ్లోబల్ మార్కెట్లకు భారీ ఉపశమనం కలిగిస్తుంది. ఇక వాపసు ప్రక్రియ సాఫీగా జరిగితే, అమెరికా వ్యాపార వర్గాలు ఆర్థికంగా మళ్లీ సులభత పొందే అవకాశం ఉంది.
More From GoodReturns

వెండి ధరలు బిగ్ క్రాష్.. దెబ్బకు నిలిచిపోయిన ట్రేడింగ్.. లబోదిబోమంటున్న పెట్టుబడిదారులు

బంగారంతో కొత్త గేమ్ మొదలుపెట్టిన రష్యా.. ఇరాన్ యుద్ధం వేళ భారీగా డబ్బులు పోగేసుకోవడానికి..

iPhone 18 Pro : ఐఫోన్ 18 ప్రో సిరీస్ వచ్చేస్తోంది! ఇండియాలో ధర ఎంతంటే..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్గా కానిచ్చేస్తున్నారు!

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..



Click it and Unblock the Notifications