IT Firing: రోజుకో జాబ్ ఆఫర్స్ వార్తలు వింటున్న ఐటీ ఔత్సాహికులు మరో పక్క భారీగా ఉద్యోగుల తొలగింపుల వార్తలు భయటకు రావటంతో ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికే గూగుల్, మైక్రోసాఫ్ట్, హెచ్సీఎల్ టెక్ వంటి కంపెనీలు తొలగింపుల గురించి ప్రకటనలు చేశాయి. క్లౌడ్ కమ్యునికేషన్స్ సేవలు అందించే టెక్ కంపెనీ ఇదే బాటను ఎంచుకుంది.

అమెరికా కంపెనీ..
యూఎస్ కు చెందిన క్లౌడ్ కమ్యూనికేషన్స్ కంపెనీ ట్విలియో 11 శాతం ఉద్యోగులను తొలగించింది. ప్రపంచవ్యాప్తంగా సంస్థకు ఉన్న 7,800 మంది ఉద్యోగుల్లో 850 మందిని కంపెనీ తొలగించింది. కంపెనీ ప్రస్తుతం యూఎస్ తో పాటు ఇతర దేశాల్లో పనిచేస్తున్న తమ ఉద్యోగులకు ఈ-మెయిల్ ద్వారా ఈ సమాచారాన్ని అందించింది.

తొలగింపు తర్వాత..
తొలగించబడిన ఉద్యోగులను క్లౌడ్ కమ్యూనికేషన్స్ కంపెనీ ప్రెసిడెంట్తో కలిసేందుకు ఏర్పాట్లు చేయనున్నట్లు ట్విలియో సీఈవో జెఫ్ లాసన్ వెల్లడించారు. ప్రస్తుతం వ్యాపార ప్రపంచం తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటున్నందున కంపెనీ చర్యలకు ఉపక్రమించినట్లు తెలుస్తోంది.

కంపెనీ ప్రకటన..
ఇది కంపెనీ తీసుకునే చివరి దశ తొలగింపులని సీఈవో లాసన్ తెలిపారు. అయితే ఇది తెలివైన, అవసరమైన నిర్ణయమని భావిస్తున్నానని అన్నారు. నిర్ణయానికి తానుబాధ్యత వహిస్తానన్నారు. ఈ నిర్ణయం కష్టమైనప్పటికీ తప్పక తీసుకున్నట్లు తెలిపారు.

పెట్టుబడి..
కంపెనీ చేసిన మెుత్తం పెట్టుబడి వల్ల వస్తున్న రాబడులపై కంపెనీ దృష్టి సారించింది. వాటిలో కొన్ని పెట్టుబడులు అర్థవంతంగా లేవని కంపెనీ గుర్తించింది. వాటిని సమర్థవంతంగా మార్చేందుకు ప్రయత్నం చేస్తున్నట్లు కంపెనీ వెల్లడించింది. దీనిని సరిదిద్దేందుకు చర్యలకు ఉపక్రమించినందున క్రమంలో ఉద్యోగులను తొలగించింది.
More From GoodReturns

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్గా కానిచ్చేస్తున్నారు!

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!



Click it and Unblock the Notifications