అంతర్జాతీయ రాజకీయాల్లో కీలక మలుపుగా.. అమెరికా శనివారం వెనిజువేలాపై పెద్ద ఎత్తున సైనిక దాడి చేపట్టింది. ఈ విషయాన్ని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్వయంగా తన సోషల్ మీడియా వేదిక ట్రూత్ సోషల్ ద్వారా ప్రకటించారు. వెనిజువేలా అధ్యక్షుడు నికోలస్ మదురోతో పాటు ఆయన భార్యను అదుపులోకి తీసుకుని దేశం వెలుపలికి తరలించామని ట్రంప్ వెల్లడించారు. ఈ ఆపరేషన్ను అమెరికా లా ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీలతో కలిసి విజయవంతంగా నిర్వహించినట్లు ఆయన పేర్కొన్నారు.
ట్రంప్ చేసిన ఈ ప్రకటన ప్రపంచ మార్కెట్లలో ఒక్కసారిగా కలకలం రేపింది. వెనిజువేలా చమురు సంపదకు పేరుగాంచిన దేశం కావడంతో.. అక్కడ జరిగిన సైనిక చర్యలు గ్లోబల్ కమోడిటీ మార్కెట్లపై ప్రభావం చూపనున్నాయన్న అంచనాలు వెంటనే మొదలయ్యాయి. ముఖ్యంగా Gold, వెండి, ముడి చమురు ధరలు సోమవారం గ్యాప్-అప్ ఓపెనింగ్తో ప్రారంభమయ్యే అవకాశం ఉందని మార్కెట్ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

వెనిజువేలా ఆర్థిక వ్యవస్థ ఇప్పటికే బలహీనంగా ఉండటంతో, ఈ పరిణామం భారత స్టాక్ మార్కెట్పై తీవ్ర ప్రభావం చూపే అవకాశాలు తక్కువేనని విశ్లేషకులు చెబుతున్నారు. అయినప్పటికీ, శుక్రవారం జరిగిన అస్తిర ట్రేడింగ్ సెషన్ తర్వాత, సోమవారం ఉదయం మార్కెట్లో భారీగా కొనుగోళ్లు కనిపించకపోవచ్చని, బుల్స్ ఆత్మవిశ్వాసానికి స్వల్ప దెబ్బ తగలవచ్చని అంచనా వేస్తున్నారు.
ఈ పరిణామాల నేపథ్యంలో కమోడిటీ మార్కెట్లపై ప్రభావం గురించి యా వెల్త్ డైరెక్టర్ అనుజ్ గుప్తా స్పందించారు. ఆయన మాట్లాడుతూ.. వెనిజువేలాపై అమెరికా దాడి లాటిన్ అమెరికా ప్రాంతంలో భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలను పెంచుతుంది. ఇది అనిశ్చితిని పెంచే అంశం కావడంతో, బంగారం, వెండి, రాగి, ముడి చమురు, గ్యాసోలిన్ వంటి వస్తువులు గ్యాప్-అప్తో ప్రారంభమయ్యే అవకాశం ఉందని తెలిపారు.
అనుజ్ గుప్తా అంచనాల ప్రకారం.. COMEX మార్కెట్లో బంగారం ధర ఔన్సుకు 4,380 డాలర్ల వరకు చేరవచ్చు. వెండి ధరలు ఔన్సుకు 75 డాలర్ల నుంచి 78 డాలర్ల వరకు పెరిగే అవకాశముంది. అదే విధంగా బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ధర బ్యారెల్కు 62 డాలర్ల నుంచి 65 డాలర్ల మధ్యకు చేరవచ్చని ఆయన అంచనా వేశారు. భారతీయ మార్కెట్ అయిన MCXలో బంగారం ధరలు 10 గ్రాములకు రూ. 1,40,000 వరకు.. వెండి ధరలు కిలోకు రూ. 2,45,000 వరకు వెళ్లవచ్చని చెప్పారు. ముడి చమురు ధరలు బ్యారెల్కు రూ.5,200 నుంచి రూ. 5,300 మధ్య ట్రేడ్ అయ్యే అవకాశం ఉందన్నారు.
బసవ్ క్యాపిటల్ సహ వ్యవస్థాపకుడు సందీప్ పాండే మాట్లాడుతూ.. అమెరికా-వెనిజువేలా సంక్షోభం ప్రపంచ సరఫరా మార్గాలపై ప్రభావం చూపుతుందని వివరించారు. ప్రపంచంలోనే ప్రధాన వెండి ఎగుమతిదారులైన పెరూ, చిలీ వంటి దేశాలు ఉపయోగించే సముద్ర మార్గాలు ప్రమాదంలో పడే అవకాశం ఉంది. దీని వల్ల వెండి సరఫరా అంతరాయం ఏర్పడవచ్చు. అందుకే వెండి ధరలు పెరిగే అవకాశం ఉంది. అదే సమయంలో భౌగోళిక రాజకీయ అనిశ్చితి కారణంగా బంగారానికి సేఫ్ హావెన్ డిమాండ్ పెరుగుతుందని ఆయన తెలిపారు.
భారతీయ ఈక్విటీ మార్కెట్పై ప్రభావం గురించి మాట్లాడుతూ.. భారత మార్కెట్ పెద్దగా కుదేలయ్యే అవకాశం లేదు. అయితే ముడి చమురు ధరలు పెరిగితే, ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు, చమురు నిల్వలపై స్వల్ప ప్రతికూల ప్రభావం కనిపించవచ్చు. అయినప్పటికీ ఇది తాత్కాలికమే, త్వరలోనే మార్కెట్ కోలుకుంటుందని అభిప్రాయపడ్డారు. ఏదేమైనా వెనిజువేలాపై అమెరికా దాడి ప్రపంచ కమోడిటీ మార్కెట్లలో అస్థిరతను పెంచే అవకాశం ఉన్నప్పటికీ.. భారత స్టాక్ మార్కెట్పై ప్రభావం పరిమితంగానే ఉండే సూచనలు కనిపిస్తున్నాయి. అయితే రాబోయే రోజుల్లో అంతర్జాతీయ పరిణామాలు మార్కెట్ల దిశను నిర్ణయించనున్నాయి.
More From GoodReturns

బంగారం ధర ఈ వారం ఎంత పెరిగిందో తెలుసా.. రూపాయి పైనే పెట్టుబడిదారుల ఆశలు.. ఎందుకంటే..

బంగారం, వెండి ధరలు తగ్గాయని సంబరాలు వద్దు.. పసిడి పెరుగుదలపై షాకింగ్ న్యూస్ చెప్పిన బ్యాంకింగ్ దిగ్గజం..

బంగారం, వెండి ధరలు భారీగా తగ్గాలంటే రూపాయి బలపడాల్సిందే.. ఆర్థిక నిపుణులు ఏమంటున్నారంటే..

Gold silver: బంగారం ధరలకు రెక్కలు వస్తాయా? విదేశాల నుంచి వచ్చే జ్యువెలరీపై మోడీ సర్కార్ ఆంక్షలు!

బంగారం ధరలకు కొత్త సవాల్.. బిట్ కాయిన్ ఈటీఎఫ్ల ముందు వేస్ట్ అంటున్న నిపుణులు.. కారణం ఏంటంటే..

Today Gold Silver Rate Live: భారీగా పతనమైన వెండి, పసిడి ధరలు,..పుంజుకున్న రూపాయి

Gold: గోల్డ్ లవర్స్కు గుడ్ న్యూస్! భారీ పతనం తర్వాత కోలుకుంటున్న పసిడి.. నిపుణుల అంచనా ఇదే.!

Trump: అమెరికా అస్సలు గెలవలేదు! ఇరాన్ యుద్ధంపై జెఫ్రీ సాచ్స్ ఆసక్తికర వ్యాఖ్యలు!

Gold: పసిడి ప్రియులకు అలర్ట్! 1980 తర్వాత మళ్లీ ఇప్పుడే భారీ లాభాలు.. సిద్ధంగా ఉండండి!

Today Gold Silver Rate Live: కుప్పకూలిన బంగారం, వెండి ధరలు..కొంపలు ముంచుతున్న ట్రంప్ నిర్ణయాలు

Gold: ఐసీఐసీఐ బ్యాంక్లో భారీ గోల్డ్ లోన్ కుంభకోణం! నకిలీ బంగారంతో రూ. 23 కోట్లు మాయం!



Click it and Unblock the Notifications