హమయ్య... అమెరికా-చైనా మధ్య కుదిరిన డీల్, టారిఫ్ తిరకాసు!
దాదాపు పద్దెనిమిది నెలలుగా అమెరికా - చైనా మధ్య ట్రేడ్ వార్ సాగుతోంది. దీనికి ముగింపు పలికే దిశగా అడుగు పడుంది. దాదాపు ఏడాది కాలంగా ఇరుదేశాల మధ్య చర్చలు జరుగుతున్నాయి. మరోవైపు, కొద్ది నెలల క్రితం వరకు టారిఫ్ పైన కాలు దువ్వుకున్నాయి. ఇప్పుడు ఈ రెండు దేశాల మధ్య తొలి దశ వాణిజ్య ఒప్పందం కుదిరింది. బుధవారం వైట్ హౌస్లో అమెరికా అధ్యక్షులు డొనాల్డ్ ట్రంప్, చైనా ఉపాధ్యక్షులు లీయూ హీ ఒప్పందంపై సంతకం చేశారు.
SBI నుంచి అదిరిపోయే రీఫండ్ హోమ్లోన్ స్కీం: ప్రయోజనమెలా?
అయితే చైనా ఎగుమతులపై టారిఫ్ తగ్గింపుకు సంబంధించిన అంశాన్ని మాత్రం ఒప్పందంలో చేర్చలేదు. మేధో హక్కుల పరిరక్షణ, బలవంతపు సాంకేతిక బదలీకి ముగింపు, వివాదాల పరిష్కారలకు సమర్థవంత వ్యవస్థ ఏర్పాటు, కరెన్సీ మార్పులకు ముగింపు తదితర అంశాలు ఈ ఒప్పందంలో ఉన్నాయి. ఈ ఒప్పందం ద్వారా చైనాకు అమెరికా వ్యవసాయ, పారిశ్రామిక ఉత్పత్తుల ఎగుమతులు పెరుగుతాయి.
ఈ ఒప్పందాన్ని ట్రంప్ చారిత్రాత్మకమైనదిగా పేర్కొన్నారు. రెండు దేశాల మధ్య న్యాయమైన పరస్పర వాణిజ్యానికి బాటలు వేస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. టారిఫ్ తగ్గింపుపై రెండో దశ ఒప్పందంలో పరిశీలిస్తామన్నారు. తాజా ఒప్పందంతో అమెరికాతో పాటు అంతర్జాతీయ మార్కెట్లు లాభాల్లో ట్రేడ్ ఉన్నాయి.