PhonePe: యూపీఐ పేమెంట్స్ వ్యాపారంలో దిగ్గజ కంపెనీగా కొనసాగుతున్న ఫోన్ పే సంస్థ ప్రత్యేక సొంత కంపెనీగా మారింది. గతంలో ఈ కంపెనీ ఈ-కామర్స్ సంస్థ ఫ్లిప్కార్ట్ ఆధీనంలో నడిచేది. దేశంలోని అతిపెద్ద విలువైన ఫిన్టెక్ స్టార్టప్గా ఉన్న ఫోన్ పే 6 సంవత్సరాల తర్వాత ఇండిపెండెంట్ సంస్థగా మారింది.

ఎందుకు ప్రత్యేక విభజన..?
ఈ వ్యాపారాల స్పిన్-ఆఫ్ పెట్టుబడిదారుల్లో కంపెనీ విలువను కూడా పెంచుతుంది. ఈ లావాదేవీలో భాగంగా ఫ్లిప్కార్ట్ సింగపూర్, ఫోన్పే సింగపూర్ వాటాదారులు నేరుగా ఫోన్పే ఇండియాలో షేర్లను కొనుగోలు చేశారు. తమ సామర్థ్యాన్ని పెంచుకోవడానికి ఇది దోహదపడుతుందని రెండు కంపెనీలు సంయుక్త ప్రకటనలో తెలిపాయి.

భారతీయ కంపెనీగా..
ఈ ఏడాది ప్రారంభంలో విభజన ప్రక్రియ ప్రారంభం కాగా ప్రస్తుతం అది పూర్తైంది. దీంతో ఇప్పుడు ఫోన్ పే పూర్తిస్థాయి ఇండియన్ కంపెనీగా మారింది. దీనికి ముందు గత అక్టోబరులో ఫోన్ పే సంస్థ తన రిజిస్టర్డ్ ప్రధాన కార్యాలయాన్ని సింగపూర్ నుంచి మన దేశానికి మార్చే ప్రక్రియను ప్రారంభించింది. ఐపీవోగా మార్కెట్లోకి రావటానికి ముందుగానే ఫోన్ పే అనేక కీలక విషయాలపై వేగంగా చర్యలు తీసుకుంటోంది.

మేడ్ ఇన్ ఇండియా..
మాది మేడ్ ఇన్ ఇండియా కంపెనీ. మా కార్యాలయాలు డేటా సెంటర్, సిబ్బంది ప్రతి ఒక్కటి ఇక్కడే ఉన్నాయని కంపెనీ చెబుతోంది. ప్రస్తుతం ఫోన్ పే యూపీఐ సేవలను దాదాపుగా 400 మిలియన్ వినియోగదారులను కలిగి ఉందని కంపెనీ వెల్లడించింది. అలా నెలవారీ యూపీఐ చెల్లింపుల్లో మెుత్తంగా కంపెనీ 47 శాతం వాటాను కలిగి ఉంది.

మరిన్ని సేవలు..
ప్రస్తుతం కంపెనీ ప్రధానంగా యూపీఐ సేవలను మాత్రమే అందిస్తోంది. దీనికి తోడు ఇన్సూరెన్స్, అసెట్ మేనేజ్మెంట్, క్రెడిట్ సర్వీసింగ్ మొదలైన వ్యాపారాలపై కంపెనీ దృష్టి పెట్టాలని ప్లాన్ చేస్తోంది. తన వినియోగదారులకు వీటి ద్వారా రుణ సేవలను కూడా అందించేందుకు ఈ చర్యలు దోహదపడతాయని కంపెనీ భావిస్తోంది.

2016లో..
ఫోన్ పేను 2016లో ఫ్లిప్కార్ట్ కొనుగోలు చేసింది. అయితే ఫ్లిప్కార్ట్ 2020లో ప్రత్యేక కంపెనీగా విడిపోయింది. వాల్మార్ట్తో సహా అనేక మంది పెట్టుబడిదారుల నుంచి పోన్పే 700 మిలియన్ డాలర్ల నిధులను సేకరించి 5.5 బిలియన్ డాలర్ల విలువైన కంపెనీగా కొనసాగుతోంది. వ్యాపార విస్తరణ కోసం మరిన్ని నిధుల సమీకరణకు కంపెనీ ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. కంపెనీ తన ఆదాయాన్ని పెంచుకునేందుకు QR స్కాన్, UPI సేవల కోసం ఛార్జ్ చేయాలని యోచిస్తున్నట్లు తెలుస్తోంది.
More From GoodReturns

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

బంగారం ధరలు ఈ స్థాయికి వస్తేనే కొనడానికి వెళ్లండి.. పసిడి ధరలపై ఆర్థిక నిపుణులు కీలక సూచన..

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..

Hyderabad: హైదరాబాద్లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..

ఒక్కసారిగా తగ్గిన బంగారం ధర .. తగ్గిన రేట్లతో పసిడి ప్రియుల్లో జోష్.. మార్చి 9, సోమవారం ధరలు ఇవే..

Stock market: స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు అలర్ట్.. సోమవారం భారీ పతనం తప్పదా?

బంగారం ధరలు ఈ రోజు కూడా తగ్గాయి.. కొనుగోలుపై బులియన్ నిపుణులు కీలక సూచన.. మార్చి 5, గురువారం ధరలు ఇవే..

Gold: నిశ్శబ్దంగా ఉన్న బంగారం మార్కెట్.. బ్యాంకుల వ్యూహం మారింది, ఇన్వెస్టర్లు జాగ్రత్త!



Click it and Unblock the Notifications