UPI Payments: భారతదేశంలో డిజిటల్ చెల్లింపుల విధానాన్ని యూపీఐ పూర్తిగా మార్చేసింది. మారుమూల ప్రాంతాల్లో సైతం ప్రజలకు ఈ సాంకేతికత అత్యంత చేరువ అయ్యింది. దీంతో చాలా మంది భౌతిక కరెన్సీ వినియోగానికి దూరమౌతున్నారు.
అక్టోబరు మాసంలో దేశవ్యాప్తంగా మెుత్తం 1,141 కోట్ల యూపీఐ ట్రాన్సాక్షన్లు జరిగాయని వెల్లడైంది. వీటి ద్వారా మెుత్తంగా రూ.17.16 లక్షల కోట్ల విలువైన డబ్బు చేతులు మారిందని నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ప్రకటించింది. యూపీఐ చెల్లింపుల సంఖ్య 1,000 కోట్లను దాటడం ఇది వరుసగా మూడో నెల కావటం విశేషం. సెప్టెంబరులో 1,056 కోట్ల ట్రాన్సాక్షన్ల ద్వారా రూ.15.8 లక్షల కోట్లు చేతులు మారగా.. ఆగస్టులో 1,024 కోట్ల ట్రాన్సాక్షన్ల ద్వారా రూ.15.18 లక్షల కోట్ల విలువైన చెల్లింపులు దేశంలో జరిగాయి.

వ్యాపారులు, కస్టమర్ల స్థాయిల్లో పెరిగిన డిజిటల్ స్వీకరణ కారణంగా UPI విలువ, వాల్యూమ్లు గరిష్ఠ స్థాయిలకు చేరుకున్నాయి. థర్డ్-పార్టీ UPI-ఆధారిత చెల్లింపు యాప్లు అందింస్తున్న రివార్డులు, ప్రోత్సాహకాల ప్రోగ్రామ్లు UPI ద్వారా మరిన్ని లావాదేవీలను చేయించేలా ఫిన్టెక్ కంపెనీలు ప్రోత్సహిస్తున్నాయి. FY23లో UPI ప్లాట్ఫారమ్ మొత్తం 8,376 కోట్ల లావాదేవీలను రూ.139 లక్షల కోట్లతో ప్రాసెస్ చేసింది.
NPCI ఒక నెలలో దాదాపు 30 బిలియన్ల లావాదేవీలు లేదా రాబోయే రెండు మూడు సంవత్సరాలలో రోజుకు ఒక బిలియన్ లావాదేవీలను నిర్వహించాలని లక్ష్యంగా పెట్టుకుంది. FY27 నాటికి UPI లావాదేవీలు రోజుకు 100 కోట్ల లావాదేవీల మార్కును చేరుకోవచ్చని PwC ఇండియా నివేదిక పేర్కొంది. ఇది UPIని రిటైల్ డిజిటల్ చెల్లింపుల ల్యాండ్స్కేప్లో ఆధిపత్యం చెలాయించేలా చేస్తుందని తెలుస్తోంది.


Click it and Unblock the Notifications