Microsoft: యూపీకి మైక్రోసాఫ్ట్ మెగా రీసెర్చ్ సెంటర్.. యోగి ఆదిత్యనాథ్ శంకుస్థాపన.

Yogi Adithyanath: యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ మైక్రోసాఫ్ట్ ఇండియా అభివృద్ధి కేంద్రం నిర్మాణానికి నేడు శంకుస్థాపన చేసారు. ఈ కార్యక్రమం ఉత్తర ప్రదేశ్‌కు అత్యంత కీలకమైన దశలో జరిగిందని సీఎం అన్నారు. ఆర్థికం, ఆధ్యాత్మికత రంగాల్లో ఎదుగుతున్న సమయంలో యూపీలో మైక్రోసాఫ్ట్ ఇండియా అభివృద్ధి కేంద్రం ప్రారంభం ఆర్థిక వృద్ధిని ప్రోత్సహించడంతో పాటు స్థానిక యువతకు ఉపాది అవకాశాలను సృష్టిస్తుందని యోగి అభిప్రాయపడ్డారు.

మైక్రోసాఫ్ట్ ఇండియా అభివృద్ధి కేంద్రం ప్రారంభానికి సంబంధించిన కార్యక్రమం 2025 మార్చి 10న నోయిడాలో సెక్టార్ 145లో జరిగింది. ఈ కార్యక్రమంలో యోగి ఆదిత్యనాథ్, మైక్రోసాఫ్ట్ ఇండియా CEO పాల్గొన్నారు. ఈ అభివృద్ధి కేంద్రం ఐటీ, సాఫ్ట్‌వేర్, డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, డేటా అనాలిటిక్స్, ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ వంటి అనేక రంగాల్లోకి మరింతగా అభివృద్ధిని తీసుకురావాలని లక్ష్యంగా ఏర్పాటు చేయబడుతోంది. ఈ అభివృద్ధి కేంద్రం ఉత్తర ప్రదేశ్‌లో సాంకేతిక రంగం అభివృద్ధికి పెద్ద కదలికను తీసుకొస్తుందని యోగి అభిప్రాయపడ్డారు.

UP CM Yogi adithyanath laid foundation stone for Microsoft R amp amp D Center

ఈ క్యాంపస్ ఏర్పాటుతో మైక్రోసాఫ్ట్ అమెరికా బయట ఏర్పాటు చేస్తున్న అతిపెద్ద రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ హబ్ అని సీఎం యోగి వెల్లడించారు. దీంతో హైదరాబాద్ తర్వాత మైక్రోసాఫ్ట్ సంస్థకు ఉత్తర్ ప్రదేశ్ ఉత్తమ ఎంపికగా నిలుస్తుందని అన్నారు. అలాగే రాష్ట్రం ప్రస్తుతం ఐటీ, సాంకేతిక రంగాలపై మరింత దృష్టి పెడుతున్నట్లు పేర్కొన్నారు. ప్రపంచంలో వాణిజ్య కేంద్రంగా ఈ రాష్ట్రం నిలవడంలో సహకరించడానికి ఈ అభివృద్ధి కేంద్రం ఒక మైలురాయిగా మారుతుందన్నారు. ఇది యువతకు కొత్త అవకాశాలను కల్పించడమే కాకుండా, పటిష్టమైన ఆర్థిక వ్యవస్థను ఏర్పరచడంలో సహాయపడుతుందని హర్షం వ్యక్తం చేశారు.

ఈ అభివృద్ధి కేంద్రం ప్రధాన లక్ష్యం ఉత్తర ప్రదేశ్‌ను ప్రపంచవ్యాప్తంగా ఉన్న సాంకేతిక, డిజిటల్ మరియు ఇన్నోవేషన్ (ఆవిష్కరణ) రంగాలలో మరింతగా ముందుకు తీసుకెళ్లడం. మైక్రోసాఫ్ట్ సంస్థ నూతన సాంకేతికతలను అభివృద్ధి చేయడం, సాఫ్ట్‌వేర్ డెవలప్‌మెంట్, డేటా సైన్స్, క్లౌడ్ కాంప్యూటింగ్, ఐటీ సేవలు వంటి రంగాల్లో మరింత లోతైన పరిశోధనలను ప్రోత్సహించనుంది. వీటికి తోడు ఏఐ, మెషిన్ లెర్నింగ్, 5G, బ్లాక్‌చైన్ వంటి సాంకేతిక రంగాల్లో ఈ కేంద్రం అద్భుతమైన ప్రగతిని సాధించేందుకు కృషి చేయనుందని తెలుస్తోంది.

ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వం తన పాలసీల ద్వారా ఐటీ, బిజినెస్, వాణిజ్య రంగాల్లో పెట్టుబడుల ప్రవాహాన్ని ప్రోత్సహిస్తుంది. ప్రత్యేకంగా యోగి ఆదిత్యనాథ్ నాయకత్వంలో ప్రభుత్వం ఇన్ఫ్రాస్ట్రక్చర్, విద్య, సాంకేతిక రంగాల్లో ముఖ్యమైన విప్లవాత్మక మార్పులు తీసుకురావడంలో సఫలమైంది. మైక్రోసాఫ్ట్ ఇండియా అభివృద్ధి కేంద్రం ప్రారంభం ఉత్తర ప్రదేశ్ యువతకు ఎన్నో కొత్త అవకాశాలను అందిస్తుంది. ఈ ప్రాజెక్టు ద్వారా యువత మరింత ప్రొఫెషనల్ ట్రైనింగ్ పొందగలుగుతుంది, తద్వారా రాష్ట్రంలోని యువత సామర్థ్యం పెరిగి, దేశీయ మరియు అంతర్జాతీయ స్థాయిలో కూడా పెట్టుబడులు మరియు ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయని వారు భావిస్తున్నారు. ఈ సెంటర్ ఏర్పాటు దాదాపు 15 ఎకరాల విస్తీర్ణంలో జరగనుందన ితెలుస్తోంది.

More From GoodReturns

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+