GoFirst: ప్రభుత్వ బెయిల్ అవుట్పై కేంద్ర మంత్రి క్లారిటీ.. గో ఫస్డ్ దారెటు..?
GoFirst: డబ్బు కొరతతో నేలకొరిగిన గోఫస్ట్ విహంగాలను తిరిగి గాల్లోకి తీసుకొచ్చేందుకు వాడియా గ్రూప్ ప్రయత్నాలను కొనసాగిస్తోంది. ప్రభుత్వం నుంచి ఏ చిన్న సాయం అందినా తాము తిరిగి సేవలను పునరుద్ధీస్థామని కంపెనీ సీఈవో ఇటీవల ధీమాగా తెలిపారు.
అయితే ఎయిర్ లైన్ ఆశలు అడియాశలుగా మారే అవకాశం ఉందని తెలుస్తోంది. ఈ వ్యవహారంపై కేంద్ర సహాయ మంత్రి వికె సింగ్ తాజాగా స్పందించారు. అమెరికాకు చెందిన ప్రాట్ & విట్నీతో ఇంజిన్ల సరఫరా సమస్యను పరిష్కరించే వరకు నగదు కొరతతో ఉన్న గోఫస్ట్ ఎయిర్లైన్స్కు ప్రభుత్వం బెయిలౌట్ చేసే అవకాశం లేదని వెల్లడించారు.

నగదు కొరతతో విమాన సేవలను అకస్మాత్తుగా రద్దు చేస్తున్న్టులు కంపెనీ గతవారం ప్రకటిస్తూ స్వచ్చందంగా దివాలా కోసం ఎయిర్లైన్ నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ ను ఆశ్రయించింది. కంపెనీ ఎదుర్కొంటున్న తాజా పరిస్థితులకు ఇంజిన్-మేకర్ ప్రాట్ & విట్నీని నిందించింది. లోపభూయిష్ట ఇంజిన్ల కారణంగా 54 ఎయిర్బస్ A320neos విమానాల్లో 50 శాతం గ్రౌండింగ్ అయ్యాయని గో ఫస్ట్ ఆరోపించింది.

ఈ సంక్షోభ సమయంలో విమానాలను తిరిగి స్వాధీనం చేసుకునేందుకు లీజర్లు కోర్టును ఆశ్రయించినందున ఎయిర్లైన్ దివాలా పిటిషన్పై ఉత్తర్వులు జారీ చేయాలని గో ఫస్ట్ లాయర్లు ట్రిబ్యునల్కు తెలిపారు. ఈ వివాదం కొనసాగుతుండగా విమాన టిక్కెట్ల విక్రయాన్ని కంపెనీ వెంటనే నిలిపివేయాలని డీజీసీఏ కంపెనీకి నోటీసులు జారీ చేసింది. అయితే గోఫస్ట్ విమానాలను త్వరగా తిరిగి ప్రారంభించలేక పోతే కంపెనీ తన స్లాట్లను కోల్పోవచ్చని తెలుస్తోంది.


Click it and Unblock the Notifications