చైనా కంపెనీకి ఎదురుదెబ్బ.. మెగా పెట్టుబడిని తిరస్కరించిన మోదీ సర్కార్..

చైనాకు చెందిన ఎలక్ట్రిక్ వాహనాల తయారీ సంస్థ బీవైడీ ఇప్పటికే తన కార్లను ఇండియాలో విక్రయిస్తోంది. అలాగే మెగా ఇంజనీరింగ్ కంపెనీతో కలిసి ఎలక్ట్రిక్ బస్సుల తయారీలోనూ ఉంది.

ఈ క్రమంలో భారతదేశంలో ఎలక్ట్రిక్ వాహనాలు, ఎలక్ట్రిక్ కార్ల బ్యాటరీల తయారీకి 1 బిలియన్ డాలర్లను పెట్టుబడి పెట్టాలని చైనా BYD గత వారం కేంద్ర ప్రభుత్వానికి దరఖాస్తు చేసుకుంది. దీనికి BYD, ప్రసిద్ధ హైదరాబాద్‌కు చెందిన మెగా ఇంజనీరింగ్ & ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ సంయుక్తంగా పెట్టుబడి నాయకత్వం వహించాయి.

Union government rejects BYD 1 billion dollar EV investment in India

అయితే ఈ పెట్టుబడి దరఖాస్తును అంగీకరించలేమంటూ కేంద్ర ప్రభుత్వం తరస్కరించింది. హైదరాబాద్‌లో కొత్త ఎలక్ట్రిక్ వాహనాల తయారీ కర్మాగారాన్ని ఏర్పాటు చేసేందుకు కేంద్ర పారిశ్రామిక ప్రోత్సాహం అండ్ అంతర్గత వాణిజ్య శాఖకు 1 బిలియన్ డాలర్ల పెట్టుబడి ప్రతిపాదనను కంపెనీలు సమర్పించిన సంగతి తెలిసిందే. ఇందుకు ప్రధానంగా భద్రతా భయాలే కారణంగా ఉన్నట్లు కొందరు సీనియర్ అధికారులు చెబుతున్నారు.

నివేదిక ప్రకారం హైదరాబాద్‌లో కొత్త ఎలక్ట్రిక్ వాహనాల తయారీ ప్లాంట్‌ను ఏర్పాటు చేయడానికి మెగా ఇంజనీరింగ్ & ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ రూ.10,000 నుంచి రూ.15,000 కోట్లను పెట్టుబడి పెట్టబోతోంది. దీనికి చైనాకు చెందిన BYD అన్ని రకాల సాంకేతిక సహాయం, సాంకేతిక మౌలిక సదుపాయాలను అందించాలని నిర్ణయించింది. అయితే కేంద్ర ప్రభుత్వం నిర్ణయం కారణంగా ఈ మెగా పెట్టుబడి వెనక్కి వెళ్లింది.

More From GoodReturns

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+