Apple: ప్రపంచ ప్రఖ్యాత ఐఫోన్ తయారీ చైనా నుంచి ఇండియాకు మారిన విషయం మనందరికీ తెలిసిందే. తమిళనాడు కేంద్రంగా ఉత్పత్తికి కసరత్తు జరుగుతున్న వేళ త్వరలోనే మరిన్ని ఆపిల్ ఉత్పత్తులు ఇండియాలో తయారయ్యేలా చూడాలని కేంద్ర ప్రభుత్వం ప్లాన్ చేస్తోంది. దీని కోసం ప్రత్యేక ప్రణాళికను తెస్తున్నట్లు తెలుస్తోంది.

మరిన్ని ప్రోత్సాహకాలు..
IT హార్డ్వేర్ కోసం ఉత్పత్తి-అనుసంధాన ప్రోత్సాహక పథకం పరిధిని పెంచాలని కేంద్రం యోచిస్తోంది. గతంలో ఉన్న ప్రోత్సహకాలను రూ.7,380 కోట్ల నుంచి దాదాపు రూ.20,000 కోట్లకు పెంచాలని ప్రభుత్వం భావిస్తోంది. ఇందులో భాగంగా ఆపిల్ తన MacBooks, iPad తయారీని భారత్ కేంద్రంగా నిర్వహించవచ్చని తెలుస్తోంది. 'చైనా-ప్లస్-వన్ స్ట్రాటజీ'ని దృష్టిలో ఉంచుకుని భారత్ లో ఆపిల్ తన తయారీ పర్యావరణ వ్యవస్థను పెంచాలని ప్రభుత్వం కోరుకుంటోంది.

దేశంలో తయారీ..
ఫాక్స్కాన్, విస్ట్రాన్, పెగాట్రాన్ కంపెనీలు ప్రస్తుతం దేశంలో బిలియన్ డాలర్ల విలువైన స్మార్ట్ఫోన్లను తయారు చేస్తున్నాయి. ఈ క్రమంలో ఆపిల్ కు చెందిన మాక్బుక్, ఐప్యాడ్ వంటి ఇతర ఉత్పత్తులను రెండవ దశలో దేశానికి తీసుకురావాలని కేంద్ర ప్రభుత్వం ప్లాన్ చేస్తోంది. ఇందుకోసం పీఎల్ఐ పథకాన్ని మెరుగుపరచాలని కేంద్ర ఐటీ మంత్రిత్వ శాఖ ఇప్పటికే ప్రతిపాదనను పంపింది. 2021లో స్మార్ట్ఫోన్ల కోసం PLI పథకాన్ని నాలుగేళ్ల కాలానికి తీసుకొచ్చిన విషయం తెలిసిందే.

ఆటంకాలు..
చైనా ఇండియాకు సరిహద్దు వివాదాలు ఉన్నాయి. అయితే ఈ క్రమంలో పూర్తిగా ఆపిల్ ఉత్పత్తుల తయారీని ఇండియాకు మార్చటానికి ఇబ్బందులు ఉన్నాయి. ఎందుకంటే తయారీకి అవసరమైన విడిభాగాల కోసం కంపెనీ ఎక్కువగా చైనాపై ఆధారపడి ఉండటమే కారణం. దీనికి తోడు ఆపిల్ ఉత్పత్తుల విక్రయానికి చైనా పెద్ద మార్కెట్లలో ఒకటి కావటంతో టెక్ దిగ్గజానికి కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. పైగా భారత్లో చైనా పెట్టుబడులను అనుమతించడం కోసం తనిఖీలను సులభతరం చేయాలని టెక్ కంపెనీలు నిరంతరం ప్రభుత్వాన్ని ఒత్తిడి చేస్తున్నాయి.

మ్యానుఫ్యాక్చరింగ్ హబ్..
ప్రపంచ శక్తిగా భారత్ ఎదుగుతున్న తరుణంలో.. 'గ్లోబల్ మ్యానుఫ్యాక్చరింగ్ హబ్'గా మారాలని ప్రయత్నిస్తోంది. దీనిని సాకారం చేసుకోవటానికి Apple, HP, Dell వంటి ఇతర టాప్ సెల్లర్లను ఆకర్షించటం చాలా ముఖ్యమని ప్రభుత్వం భావిస్తోంది. ఎందుకంటే.. ఇవి ప్రపంచవ్యాప్తంగా ఉన్న మార్కెట్లకు సేవలందిస్తున్న పెద్ద కంపెనీలు కాబట్టి.
More From GoodReturns

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!



Click it and Unblock the Notifications